అరవైఏళ్ల అనుబంధాన్ని సోనియాగాంధీ రెండు ముక్కలుగా చేసింది. అన్నదమ్ముల ఉన్న వారు విడిపోతున్నందుకు బాధపడాలో.. కొత్త రాజధాని వస్తున్నందుకు ఆనందపడాలో తెలియని పరిస్థితుల్లో సీమాంద్ర నాయకులు, సమైక్యాంద్ర ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు. పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంచి.. ఈ పదేళ్లల్లో సీమాంద్రలో కొత్త రాజధాని ఏర్పాటు చేసుకోవాలని సోనియాగాంధీ సెలవిచ్చారు. 10 జిల్లాలతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం చేస్తూ కేంద్ర మంత్రి మండలికి నివేదించింది. ఇప్పుడు సీమాంధ్ర ప్రాంతంలో నూతన రాజధాని ఏర్పాటు పై చర్చలు జరుగుతున్నాయి. సీమాంధ్ర నాయకులకు అనుకూలంగా ఉండే ప్రాంతం పై అందరి చూపుపడింది. అయితే కొత్త రాజధాని ఎక్కడ అనేది ఖచ్చితంగా చెప్పలేకపోయిన కొంచెం అటు ఇటూ గా తెరపైకి వచ్చిన పేరు విజయవాడ లేదా గుంటూరు అని అంటున్నారు. ఈరెండు కాకపోతే.. ఒంగోలు పేరు కూడా ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. సాధారణంగా కొత్త రాజధాని ఏర్పాటు ప్రక్రియ మూడేళ్లలోపే పూర్తి కావడానికి అవకాశాలు ఉన్నాయి. పదేళ్ల తర్వాత రెండు రాష్ట్రాలు, వారి వారి రాజధానులనుండి పాలన వ్యవహారాలు చూస్తారు.
కాకపోతే రాజధానిగా ప్రాంతం ఎంపిక ఒక్కటే సమస్య. ఆ తర్వాత నిర్మాణానికి రెండేళ్ల సమయం సరిపోతుంది. సీమాంధ్ర భౌగోళికంగా చాలా పొడవుగా ఉంటుంది. చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకూ చూస్తే దూరం చాలా ఎక్కువ. రాజధాని ఏర్పాటుకు అన్ని ప్రాంతాలకు దగ్గరగా ఉండే స్థలాన్ని ఎంపిక చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఇదొక్కటే కాదు, ప్రభుత్వ భవనాలకు స్థలాల లభ్యత, విమానాశ్రయం, రైల్వే స్టేషన్లు ఇతర ప్రాంతాలతో రవాణ వసతులను పరిగణనలోకి తీసుకుంటారు. ఇలా చూస్తే విజయవాడ ప్రాంతానికి ఎక్కువ అనుకూలతలు ఉన్నాయని పాలనా నిపుణులు చెబుతున్నారు. అదే విజయవాడ-గుంటూరు నగరాల మధ్య రాజధాని ఏర్పాటుకు అనుకూలంగా ఉంటుందన్నది నిపుణులతో సీనియర్ ఐఏఎస్ ల అభిప్రాయం. ఇక్కడ వేలాది ఎకరాల స్థలం అందుబాటులో ఉంది. రెండు నగరాలు పెద్దవి. రైల్వే స్టేషన్లూ పెద్దవే. నీటి లభ్యత సమస్య లేకుండా పక్కనే కృష్ణా నది ఉంది. గన్నవరంలో విమానాశ్రయంతో పాటు ఇండస్ట్రీ లకు అనువైన ప్రాంతం.
గుంటూరు నుండి గన్నవరం వరకు సిటి ని విస్తరించే ఆవకాశాలు లేకపోలేదు. విజయవాడ ఇప్పటికే వ్యాపార రాజధానిగా ఉంది. అటు శ్రీకాకుళం, ఇటు చిత్తూరు జిల్లాలకు మధ్యలో ఉంటుంది. హైదరాబాద్, సికింద్రాబాద్ లు జంట నగరాలుగా ఎలా పేరోన్ధాయో విజయవాడ, గుంటూరు లు కూడా జంట నగరాలు రాజధాని ఏర్పాటుతో జంట నగరాలుగా వృద్ధి చెందుతాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. హైదరాబాద్ తర్వాత ఎక్కువగా అభివృద్ధి చెందిన విశాఖ పట్టణం నగరం. ఇక్కడ పెద్ద ఓడరేవు, రైల్వే స్టేషన్, విమానాశ్రయం, ఆయిల్ రిఫైనరీలు, స్టీల్ ప్లాంట్ ఇతర పరిశ్రములు ఉన్నాయి. కానీ ఒకవైపు బీచ్ ఉండడం, విస్తరణకు పెద్దగా అవకాశాలు లేకపోవడం విశాఖ పట్నం వైపు మొగ్గు చూపే ఆవకాశాలు తక్కువ. పైగా చిత్తూరు ఇతర రాయలసీమ జిల్లాలకు ఇది చాలా దూరంలో ఉంటుంది. ఒకప్పుడు రాజధానిగా ఉన్న కర్నూలు పట్టణం విషయానికొస్తే ఇతర ప్రాంత నేతలు అంత సుముఖంగా లేరు.
విజయవాడ – గుంటూరు కాకపోతే మాత్రం రెండో స్థానం ఒంగోలు పేరు వినబడుతుంది. కానీ ఒంగోలుకు దగ్గరల్లో విమానాశ్రయం లేకపోవటం ఒక మైనస్ గా కనిపిస్తుంది. ఒక వేళ తిరుపతి పేరు ను తీసుకుంటే.. శ్రీకాకుళం, వైజాగ్ వారికి దూరం పెరుగుతుంది. అంతేకాకుండా చెన్నయ్ దగ్గరగా ఉండటం పెద్ద మైనస్ గా నిపుణులు చెబుతున్నారు. ఇవి కాకుండా మళ్లీ కర్నూల్లో రాజధాని అంటే కొంత మంది ఆంధ్ర నాయకుల అందుకు సుముఖంగా లేరని తెలుస్తోంది. పొట్టి శ్రీరాముల జిల్లా గురించి ఆలోచిస్తే.. నీటి కొరత ఎక్కువుగా ఉంటుందని, స్థలం అంతగా లేదని రాజకీయ నిపుణులు అంటున్నారు. సో మొత్తం మీద విజయవాడ – గుంటూరుల మద్య ఆంద్రప్రదేశ్ కొత్త రాజదాని ఏర్పాటు చేస్తే అందరికి అనుకూలంగా ఉంటుందని రాజకీయ మేథావులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more