పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది ’ చిత్రం ఆడియో హైదరాబాద్ లోని శిల్ప కళా వేదికలో అభిమానుల మధ్య చిత్ర యూనిట్ సభ్యుల మధ్య అంగరంగా వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మెగా ఫ్యామిలీ నుండి కానీ, సినిమా ఇండస్ట్రీ నుండి కానీ ఎవరూ ముఖ్య అతిథులుగా హాజరు కాలేదు. ఏ ఆడియో కార్యక్రమానికి హాజరైనా రెండు మాటల కంటే ఎక్కువ మాట్లాడని పవన్ ఈ ఆడియోలో తనదైన స్టైల్లో మాట్లాడి అభిమానుల్ని ఖుషి చేశారు. దేవీ శ్రీ ప్రసాద్ స్వరపరిచిన పాటల తొలి సీడీని నదియా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ ‘సినిమాల్లో నటించడం తప్పా ఇలా అందరి ముందుకు వచ్చి మాట్లాడటం నాకు అలవాటు లేదు...ఇలా స్టేజి పైకి వచ్చి మాట్లాడటానికి ఎంతో ధైర్యాన్ని కూడ గట్టుకుంటాను. నావల్ల అభిమానులకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశ్యంతోనే ఇలాంటి ఫంక్షన్లకు దూరంగా ఉంటాను. ’ ‘అభిమానులు నా పై ఎంత ప్రేమ చూపిస్తున్నారో అంతకు రెండింతల ప్రేమ వారిమీద నాకుంది అని చెప్పుకొచ్చారు. ఇక దర్శకుడు త్రివిక్రమ్ గురించి చెబుతూ... నేను దర్శకత్వం వహించిన జాని సినిమా ప్లాపు తర్వాత కాస్త మూడౌట్లో ఉన్నాను. అదే సమయంలో త్రివిక్రమ్ వచ్చి కథ చెప్పారు. తొలిసారిగా ఆయన కథ చెబుతుంటే నిద్ర పోయాను. కానీ ఆయన ఏమాత్రం బాధ పడకుండా మళ్లీ జల్సా కథతో వచ్చారు. నేను మీలాంటి మనిషినే. నాకు బాధలు ఉంటాయి. జల్సా చేస్తున్న సమయంలో నాకు వ్యక్తిగతంగా కొన్ని సమస్యలు ఏర్పడ్డాయి. అప్పుడు త్రివిక్రమ్ నాకు ఎంతో భరోసా ఇచ్చారు. ఆయన చెప్పిన మాటలు నాకు ఎంతో ఓదార్పును ఇచ్చాయి. ఆయన నాకు ఎంత భరోసా ఇచ్చారు. అలాంటి వ్యక్తి దర్శకత్వంలో చేస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది అని పవన్ కళ్యాన్ చెప్పుకొచ్చారు.
ప్రతి రోజు షూటింగుకు వెళ్లే టప్పుడు ఇదే నా మొదటి రోజు అనుకొని నటిస్తానని, సెట్స్ లో నా దర్శకులు, సహనటుల ప్రోత్సాహంతో పని చేస్తుంటా అని అన్నారు. ఈ చిత్రంలో నటుల గురించి చెబుతూ... ఆలీ నాకు గుండె లాంటి వాడు... తను లేకుండా నా సినిమా ఉండదు. అలాగే బ్రహ్మానందంతో నాకు ఎంతో సాన్నిహిత్యం ఉంది. అత్త పాత్ర పోషించిన నదియా మంచి నటి అని, సమంతా భావాన్ని అర్థం చేసుకొని నటిస్తుందని అన్నారు. ఇక ఫ్యాన్స్ గోల చేయడంతో వారి కోరిక మేరకు చివర్లో ఓ డైలాగ్ చెప్పి అభిమానులకు మంచి జోష్ ఇచ్చారు. ‘చూడప్పా సిద్దప్పా... నేను సింహం లాంటివాడిని... దానికి నాకు తేడా ఒక్కటే... అది గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటాను. మిగతా అంతా సేమ్ టు సేమ్. లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్పా ’ అంటూ తనదైన స్టైల్లో డైలాగ్ చెప్పి ముగించారు. దర్శకుడు త్రివిక్రమ్ మాట్లాడుతూ... పవన్ కళ్యాణ్ ని ఒక హీరోగా కన్నా వ్యక్తిగతంగా చాలా దగ్గరగా చూశాను. ఎంతో మంది గొప్పవాళ్లను చూశాను, కలిశాను డబ్బు, పదవి, ప్రాణం పోతుందని భయపడే వాళ్ళే ఎక్కువ. కానీ ఎలాంటి భయం లేని వ్యక్తి పవన్ కళ్యాణ్. అందుకే ఆయనంటే భయపడతారు. అని చెప్పుకొచ్చారు. ఎంతో సరదాగా, హంగామా సాగిన ఈ ఆడియో వేడుక కన్నుల పండగగా ముగిసింది.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more