Ap assembly speaker nadendla manohar meets digvijay singh on telangana issue

speaker nadendla manohar meets digvijay, nadendla manohar meets digvijay singh, ap assembly speaker nadendla manohar meets digvijay, nadendla manohar meets digvijay singh on telangana issue, digvijay singh on telangana issue, speaker nadendla manohar meets digvijay singh, breaking news, ap politics, political news, andhra news, congress party,

AP Assembly Speaker Nadendla Manohar meets Digvijay Singh on telangana issue

డీగ్గిరాజతో నాదెండ్ల టీ-మంతనాలు ?

Posted: 07/18/2013 10:27 AM IST
Ap assembly speaker nadendla manohar meets digvijay singh on telangana issue

నిన్నటి వరకు అదిగో.. ఇదిగో అన్న కాంగ్రెస్ హైకమాండ్ ఈ సారి మాత్రం ప్రత్యేక తెలంగాణ పై ఏదో ఒకటి తెల్చాటానికి సిద్దమైంది. అందుకే ప్రత్యేకమైన కమిటిని ఏర్పాటు చేసి.. తెలంగాణ ఒక నిర్ణయం ప్రకటించాటినికి రెఢీ అవుతున్నట్లు సమాచారం. శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్‌తో సమావేశమయ్యారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ శాసన సభ ఆమోదించవలసిన తీర్మానం గురించి దిగ్విజయ్ సింగ్ నాదెండ్ల మనోహర్‌తో చర్చించినట్లు తెలిసింది. కాంగ్రెస్ అధినాయకత్వం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో దిగ్విజయ్‌ను నాదెండ్ల మనోహర్ కలుసుకోవటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

 

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియలో శాసన సభ తీర్మానం ఒక మలుపు లాంటిది. తీర్మానాన్ని చర్చకు చేపట్టే సమయంలో స్పీకర్ అత్యంత మెలుకువతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. 2009 డిసెంబర్ 9న అప్పటి హోం శాఖ మంత్రి పి చిదంబరం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించటంతోపాటు దీనికోసం రాష్ట్ర శాసన సభ ఒక తీర్మానాన్ని ఆమోదించవలసిందిగా ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యను అదేశించినట్లు చెప్పటం తెలిసిందే. అప్పట్లో రాష్ట్ర శాసన సభలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరే తీర్మానం చర్చకు రాకముందే తెలుగుదేశం, కాంగ్రెస్ తదితర పార్టీలకు చెందిన సీమాంధ్ర శాసన సభ్యులు రాజీనామా చేయటం, ఆ తరువాత పెద్ద ఎత్తున గొడవ జరగటం తెలిసిందే.

 

రాష్ట్ర శాసన సభలో పార్టీల బలాబలాల గురించి కూడా వారు చర్చించి ఉంటారని భావిస్తున్నారు. ఆరు సూత్రాల పథకాన్ని ఎత్తివేస్తేనే... ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటే మొదట ఆరు సూత్రాల పథకాన్ని ఎత్తి వేసేందుకు వీలుగా రాజ్యాంగ సవరణ చేయవలసి ఉంటుందని అంటున్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దిగ్విజయ్ సింగ్ వారం, పది రోజుల క్రితం ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకునే రాజ్యాంగ సవరణ గురించి మాట్లాడారని అంటున్నారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more