రాజకీయ చరిత్రలో మొట్టమొదటిసారిగా బహిరంగ సభలకు ప్రవేశరుసుము వసూలు చేస్తోంది భారతీయ జనతా పార్టీ. గుజరాత్ ముఖ్యమంత్రి, రాబోయే ఎన్నికలలో భాజపా ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీ (మోడి) ఆంధ్రప్రదేశ్ ప్రజలనుద్దేశించి ఆగస్ట్ 11 న హైద్రాబాద్ లో నిర్వహించబోతున్న బహిరంగ సభ నవ భారత యువ భేరి లో ప్రసంగించబోతున్నారు. దానిలో ప్రవేశం కావాలంటే రూ.5.00 చెల్లించాల్సిందే.
ఇది వింతగా అనిపిస్తోంది కదూ. కానీ నిజంగా ఈ ప్రక్రియ రాజకీయాల్లో కొత్త పుంతే. బహిరంగ సభలను విజయవంతం చెయ్యటానికి జన సమీకరణ చేసే రాజకీయనాయకులకు ఇది వ్యతిరేకమైన ఏర్పాటు. బహిరంగ సభకు వాళ్ళంతట వాళ్లు రావటమే కాకుండా ప్రవేశ రుసుము చెల్లించి మరీ పాల్గొనటమనేది వాళ్ళకి పార్టీ మీద, ప్రసంగీకుల మీద ఉన్న అభిమానాన్ని చూపుతుంది.
ఆ విధంగా పోగైన ధనాన్ని ఉత్తరాఖండ్ వరద బాధితులకు అందజేస్తామన్నారు నరేంద్ర మోదీ. భాజపా ప్రకటించినదాని ప్రకారం ఇప్పటికే 35000 మంది ఆ సభలో పాల్గొనటానికి తమ అంగీకారాన్ని ఆన్ లైన్ లో తెలియజేసారట. ఇదే సంభవిస్తే, భారత రాజకీయ ప్రస్తానంలో ఇది నిజంగా ఒక మైలురాయేనని చెప్పాలి. బహిరంగ సభలో పాల్గొనే ఔత్సాహికుల్లో, ఐటి రంగం, వృత్తులలో ఉన్నవారు, లాయర్లు ఉన్నారని భాజపా తెలియజేసింది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more