ఉత్తరాఖండ్ లో 81 మంది తెలుగువారి జాడ ఇంకా తెలియటంలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నెట్ లో పెట్టిన వివరాల ప్రకారం గౌరీ కుండ్, కేదార్ నాథ్ ప్రాంతాల్లో ఆచూకీ తెలియనివారి సంఖ్య ఇంకా 81. అందులో 10 జిల్లాలవారున్నారు.
రంగారెడ్డి జిల్లా నుంచి 33, కృష్ణా నుంచి 14, హైద్రాబాద్ నుంచి 8, చిత్తూరు నుంచి 5, విశాఖపట్నం నుంచి 5, గుంటూరు నుంచి 4, కడప నుంచి 4, అనంతపూర్ నుంచి 3, పశ్చిమ గోదావరి నుంచి 3, నిజామాబాద్ నుంచి వెళ్ళిన ఇద్దరు వ్యక్తుల ఆచూకీ ఇంకా తెలియలేదు.
నేషనల్ డిసాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ వైస్ ఛైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి, దేశంలోని వివిధ ప్రాంతాల్లోంచి 4000 మంది వరకూ ఆచూకీ తెలియనివారున్నారన్నారు. అధికారిక లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ నుంచి 2785 మంది చార్ ధామ్ యాత్రకు వెళ్ళి ఉత్తరాఖండ్ కి వెళ్ళారు. 13 మంది చనిపోయినట్లుగా తెలిసింది. మిగిలినవారిలో గత రెండు వారాలుగా ఇళ్ళకు చేరుకున్నారు. ఇంకా చేరుకోనివారు ఆచూకీ తెలియని 81 మందికి చెందిన కుటుంబీకులు వారి జాడ తెలుస్తుందేమోనన్న ఆశతో ఇంకా ఎదురుచూస్తున్నారు. మన రాష్ట్రానికి చెందిన డిసాస్టర్ మేనేజ్ మెంట్ కార్యాలయం నిరంతరం ఉత్తరాఖండ్ లోని ఆ శాఖ కార్యాలయంతో కాంటాక్ట్ లో ఉంటూ ఎప్పటికప్పుడూ సమాచారాన్ని తెలుసుకుంటూ నెట్ లో వివరాలను అప్ డేట్ చేస్తూపోతోంది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more