వరుస విజయాలతో దూ సుకుపోతున్న టీమిండియాకు ముక్కోణపు వన్డే సిరీస్ ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. తమ తొలి మ్యాచ్లో బ్యా ట్స్మెన్ తడబాటుతో పరాజయం చవిచూసింది. రెం డు వరుస విజయాలతో విండీస్ ఇప్పటికే ఫైనల్ అ వకాశాలను మెరుగుపరుచుకోగా, మంగళవారం శ్రీలంకతో జరిగే రెండో మ్యాచ్ కోసం భారత్ సన్నద్ధమవుతోంది . లీగ్ దశలో ఆడే నాలుగు మ్యాచ్ల్లో తొలి రెండు ఓడిపోతే.. ఆ తర్వాత మిగిలిన రెండు మ్యాచ్లు గెలిస్తేనే ఫైనల్కు వెళతారు. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్లో ఓడిన జట్టు కచ్చితంగా ఒత్తిడిలోకి వెళుతుంది. తర్వాతి రెండు మ్యాచ్లను నాకౌట్ తరహాలో ఆడేకంటే.... ఈ మ్యాచ్లో గెలిస్తేనే పరిస్థితి సానుకూలంగా ఉంటుంది. మొదటి లీగ్ మ్యాచ్ లో అనుభవం లేని యువ భారత బ్యాట్స్ మెన్స్ కరేబియన్ ధీవుల్లో రాణించలేక పోయారు. బౌలర్లు రాణించినా విజయాన్ని మాత్రం అందుకోలేక పోయారు. ధావన్, రోహిత్శర్మ ఓపెనింగ్తో పాటు కోహ్లి, రైనా, కార్తీక్లతో మిడిలార్డర్ పటిష్టంగా ఉన్నా కానీ, విండీస్ పై తడబడ్డారు. ఇక బౌలర్లు కూడా తన లోపాలను సరిదిద్దుకొని లైన్ అండ్ లెన్త్ లో లోపాలను సరిదిద్దుకోవాల్సి ఉంది.
ఇక లంక విషయానికి వస్తే....విండీస్తో జరిగిన టోర్నీ ఆరంభ మ్యాచ్లో అన్ని విభాగాల్లో చెత్త ప్రదర్శన చేసి ఘోర ఓటమిని మూటగట్టుకుంది. ఫలితంగా విండీస్కు బోనస్ పాయింట్ సమర్పించుకుంది. మహేల, కెప్టెన్ మాథ్యూస్ మినహా బ్యాటింగ్ విభాగం విఫలమైంది. బౌలర్లు కూడా బ్యాట్స్మెన్ను అనుసరించారు. లంక ఇప్పటికీ సీనియర్ ఆటగాళ్లు జయవర్ధనే, సంగక్కరలపైనే అతిగా ఆధార పడుతోంది. చాలా సందర్భాల్లో వీరిద్దరు కలిసే ఇన్నింగ్స్ను నిర్మిస్తున్నారు. అయితే తొలి మ్యాచ్లో కెప్టెన్ మాథ్యూస్ రాణించడం ఆ జట్టుకు ఊరట. యువ ఆటగాళ్లు తరంగ, చండీమల్, తిరిమన్నె పూర్తిగా విఫలం కావడం జట్టును దెబ్బ తీస్తోంది. ఇటీవలి ఇరు జట్ల ప్రదర్శన, రికార్డు చూస్తే అన్ని విధాలా భారత్దే పైచేయిగా కనిపిస్తోంది. మరి ఇద్దరికి కీలకమైన మ్యాచ్ ఏ జట్టు పై చేయి సాధిస్తుందో తెలుసుకోవాలంటే మరి కొన్ని గంటలు ఆగాల్సిందే.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more