నిన్న రాత్రి హైద్రాబాద్ శిల్ప కళా వేదికలో జరిగిన ఎవడు ఆడియో వేడుక కేంద్ర పర్యాటక శాఖామాత్యులు చిరంజీవి చేతులమీదుగా జరిగిన సందర్భంలో అభిమానుల సమక్షంలో తనకెంతో ఆనందం కలుగుతోందంటూ ఆయన హర్షాన్ని వ్యక్తంచేసారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారధ్యంలో రూపొందిన గీతాల ప్రధమ సిడి ని ఆవిష్కరించిన చిరంజీవి, ఎవడు చిత్రం గురించి మాట్లాడుతూ, మగధీరకి దీటుగా తయారైందంటూ ప్రశంసించారు. మగధీర లాంటి చిత్రం చరణ్ కి మరోసారి ఇంత త్వరగా లభించిందంటూ ఆయన అందుకు తన ఆనందాన్ని వ్యక్తపరచారు. మగధీరలో షేర్ ఖాన్ లా ఎవడు లో సాయికుమార్ నటించారని, కథానాయిక గా శ్రుతి హాసన్ అసమాన నటనా చాతుర్యాన్ని చూపించిందని, ఆమె తండ్రికి తగ్గ తనయగా పేరు తెచ్చుకుంటుందని చిరంజీవి అన్నారు.
చరణ్ పాత్ర గురించి మాట్లాడుతూ చరణ్ ఇందులో చాలా అందంగా కనిపించాడని, పాత్రలో చక్కగా ఇమిడిపోయాడని, ఈ సినిమాలో మాస్ హీరోగా అభిమానులకు బాగా నచ్చుతాడని అన్నారు చిరంజీవి. అల్లు అర్జున్ ఇందులో అతిథి పాత్రలో కనిపిస్తాడని, ఆ చిన్న పాత్రలో అర్జున్ అలరించాడని అన్నారు.
ఇక పాటల గురించి మాట్లాడుతూ, దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం తనలో ఉత్సాహాన్ని రేపి, ఇంట్లో తమ మనుమరాలితో కలిసి డ్యాన్స్ చేసేటట్టుగా చేసిందని చిరంజీవి శ్లాఘించారు.
అభిమానుల మధ్య సంతోషాన్ని పంచుకున్న చిరంజీవి అభిమానులకు చక్కని సూచన కూడా ఇచ్చారు. తన మీద, తన కుటుంబంలోని ఇతర హీరోల మీద ఉన్న అభిమానంతో వారు ఇతర సినిమాలను ఇతర నటీనటులను విమర్శించరని, తన అభిమానులు హుందాగా ప్రవర్తిస్తారని వారిమీద తనకున్న నమ్మకాన్ని చిరంజీవి వ్యక్తపరుస్తూ వారు ఆ స్థాయిని కొనసాగించవలసిందిగా కోరారు.
ఈ వేడుకలో పాల్గోన్న అల్లు అర్జున్ ప్రచార చిత్రాలను విడుదల చేసారు. ఇంకా వేడుకలో చిత్ర నాయికా నాయకులతో పాటు నిర్మాత దిల్ రాజు, అల్లు అరవింద్, సిరివెన్నెల సీతారామ శాస్త్రి, కోట శ్రీనివాసరావు, వేణమాధవ్, బ్రహ్మానందం తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంలో రామ్ చరణ్, అల్లు అర్జున్ లు చెరో పది లక్షల రూపాయలను ఉత్తరఖండ్ వరద బాధితుల సహాయంగానూ, చిరంజీవి అభిమానులు ప్రధానమంత్రి సహాయ నిధికి తమవంతు సాయాన్ని చిరంజీవికి అందజేసారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more