River yamuna flowing 2 meters above the danger mark in delhi

danger mark in Delhi, River Yamuna, Yamuna flowing 2 metre above danger mark in Delhi, Water level in Yamuna, Yamuna River, Haryana, Delhi, Flood, Yamuna waters, Delhi government, Yamuna flowing above danger level in Delhi,

River Yamuna flowing 2 meters above the danger mark in Delhi,Yamuna flowing above danger level in Delhi,

యమున ఉగ్రరూపం.. డేంజర్లో ఢిల్లీ వాసులు?

Posted: 06/19/2013 07:45 PM IST
River yamuna flowing 2 meters above the danger mark in delhi

యమునా నది మరింత ఉగ్రరూపం దాల్చింది. 207మీటర్ల ఎత్తులో ప్రవాహం పరవళ్లు తొక్కుతోంది. 35 ఏళ్లలోనే అత్యంత గరిష్ఠ స్థాయి కావడం గమనార్హం. ఢిల్లీలో యమునా తీరం, లోతట్టు ప్రాంతాల నుంచి 1500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. హర్యానాలోని హతీకుండ్ బ్యారేజీ నుంచి 9లక్షల క్యూసెక్కుల నీటిని కిందికి విడిచిపెట్టారు. దీంతో ఢిల్లీ నగరంలో యమున ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. వందేళ్లలో ఎన్నడూ లేనంతగా ఒకే నెలలో యమునా నదికి 8లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చిందని హర్యానా ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా చెప్పారు. వరదల కారణంగా 'యమున' నది ఉగ్రరూపం దాల్చింది. 1978 సంవత్సరంలో నీటి మట్టం 207.49 మీటర్లు ఉంటే ప్రస్తుతం 207.75 మీటర్ల నీటి మట్టం నమోదై సరికొత్త రికార్డు నెలకొల్పినట్లైంది. ఉత్తర భారతంలో భారీ వర్షాల కారణంగా హస్నీ కుండ్ ప్రాజెక్టు నుండి ఆరు లక్షల నీటిని విడుదల చేస్తే యమునా నది పరివాహక ప్రాంతాలతో పాటు తాజ్ మహాల్ కు ముప్పు ఉందని తెలుస్తోంది.

దీనితో ఢిల్లీ, హార్యాన రాష్ట్రాలు హై అలర్ట్ ప్రకటించాయి. 70 బోట్లను అధికారులు సిద్ధం చేశారు. తీర ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తమంగా ఉండాలని సూచనలు చేస్తోంది. ఎప్పుడు ముప్పు వస్తుందోనని నది పరివాహక ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వర్షాలతో ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమలమయ్యాయి. సైన్యం సాయంతో సహాయక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని వెల్లడించారు. మరోవైపు, ఉత్తరాఖండ్‌లో సహాయక చర్యలు ముమ్మరం చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం తెలిపారు.

కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం అనంతరం ఆయన బుధవారం విలేకర్లతో మాట్లాడారు. కోర్ కమిటీలో ఉత్తారఖండ్ వరద పరిస్థితులపై చర్చించినట్లు తెలిపారు. వరద సహాయక చర్యలపై కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే మాట్లాడుతూ వరద బాధితులకు సత్వర సాయం చేస్తున్నామని తెలిపారు. బాధితులకు ఆహారం, మంచినీరు, మందులు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more