సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ తిరిగి తన సొంత కేడర్ అయిన మహారాష్ట్రకు వెళ్లనున్నారు. కేంద్ర సర్వీసుల్లో భాగంగా ఏడేళ్లపాటు సీబీఐలో... అది కూడా సొంత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో పనిచేసిన లక్ష్మీనారాయణను తిరిగి మహారాష్ట్రకు పంపించారు. ఆయనను ముంబై క్రైమ్ బ్రాంచ్ చీఫ్గా నియమించినట్లు తెలిసింది. సత్యం స్కామ్, ఓబుళాపురం గనులు, ఎమ్మార్ విల్లాల 'ఘనులు', జగన్ అక్రమాస్తులు... ఇలా ఎన్నో సంచలనాత్మక కేసుల్లో దర్యాప్తు సారథి 2006 జూన్ 12న మన రాష్ట్రానికి వచ్చారు. సత్యం కుంభకోణం కేసు దర్యాప్తు చేపట్టి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు.
సీబీఐలో ఐదేళ్ల సర్వీసు పూర్తయ్యాక... 2011లో ఆయన తిరిగి మహారాష్ట్రకు వెళ్లాల్సి ఉండింది. అయితే... అప్పుడే అత్యంత కీలకమైన ఓబుళాపురం మైనింగ్ కేసు, ఆ వెంటనే జగన్ అక్రమాస్తుల కేసుల దర్యాప్తును సీబీఐ చేపట్టింది. దీంతో సీబీఐలో లక్ష్మీనారాయణ సర్వీసును ఏడాది పొడిగించారు. ఆ గడువు గత ఏడాదితో ముగిసింది. అయితే... జగన్ అరెస్టు అయిన వెంటనే జేడీని బదిలీ చేస్తే కేసు నీరుగారిపోతుందని, జనంలోకి తప్పుడు సంకేతాలు వెళతాయని భావించడంతో లక్ష్మీనారాయణ సర్వీసును మరో ఏడాది పొడిగించారు. ఈ సంవత్సరంతో ఆ గడువు కూడా ముగుస్తోంది. కేంద్ర సర్వీసుల్లో గరిష్ఠంగా ఏడేళ్లకు మించి కొనసాగించే అవకాశం లేకపోవడంతో... జూన్ 11లోగా రిలీవ్ కావాలని జేడీకి ఆదేశాలు అందినట్లు తెలిసింది.
ఆయన జూన్ 7న రిలీవ్ అవుతున్నట్లు తెలిసింది. ఓఎంసీ కేసులో చార్జిషీట్ల దాఖలు దాదాపుగా పూర్తయింది. జగన్ అక్రమాస్తుల కేసులో తుది చార్జిషీటు మాత్రమే దాఖలు చేయాల్సి ఉంది. ఆ బాధ్యతను డీఐజీ వెంకటేశ్ (దర్యాప్తు అధికారి)కు అప్పగించారు. లక్ష్మీనారాయణ స్థానంలో సీబీఐ ఇంకా ఎవరినీ నియమించలేదని... కొన్నాళ్లపాటు వెంకటేశ్ ఇన్చార్జిగా కొనసాగుతారని తెలుస్తోంది. ముంబై నగర పోలీసు కమిషనర్ తర్వాత అత్యంత కీలకమైన పోస్టు క్రైమ్ బ్రాంచ్ చీఫ్ కావడం గమనార్హం.
ముక్కుసూటితనం, తన పని తాను చేసుకుపోవడం, విమర్శలను లెక్క చేయకపోవడం, వృత్తితోపాటు సమాజ సేవను ప్రవృత్తిగా ఎంచుకోవడం... ఇవన్నీ లక్ష్మీనారాయణను ప్రత్యేక స్థానంలో నిలిపాయి. ఇతర అధికారులకు, యువతకు ఆయన స్ఫూర్తినిచ్చారు. సర్వీసు నిబంధనల ప్రకారం ప్రతి ఐపీఎస్ అధికారి కనీసం ఐదేళ్లపాటు కేంద్ర సర్వీసుల్లో పనిచేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా లక్ష్మీనారాయణ సీబీఐకి వెళ్లారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more