శని దేవుడు శపిస్తే ఇలాగే ఉంటుందని కొంతమంది చెబుతుంటారు. అది నిజమే అని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి విషయంలో తెలుస్తోంది. జయలలిత ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి మాజీ ముఖ్యమంత్రికారుణ నిధికి అన్నీ కష్టాలే. కొన్ని నెలల పాటు .. ఆయన కూతురు కనిమొళి జైలు జీవితం గడిపిన విషయం తెలిసిందే. అలాగే ఆ పార్టీ నాయకుడు అయిన మాజీ మంత్రి ఏ రాజా పుణ్యం వలనే కరుణానిధి కుటుంబం జైలు ముఖం చూసినట్లు తమిళ ప్రజలు అంటున్నారు. అయితే ఈసారి మరో షాకింగ్ న్యూస్ కరుణానిధి కొంప ముంచింది. 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంలో కరుణానిధి భార్య దయాలు అమ్మాళ్ ఉన్నట్లు సమాచారం.
అయితే ఈరోజు ఆమెకు ఢిల్లీ కోర్టు సమాన్లు జారీ చేసింది. ఈ కేసుల సాక్షిగా జులై 8వ తేదీన కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. 2జి స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో ప్రాసిక్యూషన్ సాక్షిగా ఉన్న ఆమె కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావడం నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. తన ఆరోగ్యం సహకరించడం లేదనే కారణం చెబుతూ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావడం నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని ఆమె కోర్టును అభ్యర్థించింది. ఆమె అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. కేసులో దయాలు అమ్మాళ్ ముఖ్యమైన సాక్షి అని, 200 కోట్ల రూపాయల లంచం తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్న కలైంగర్ టీవీకి ఆమె డైరెక్టర్గా ఉన్నారని సిబిఐ ప్రత్యేక న్యాయమూర్తి ఒపి సైనీ అన్నారు.
టెలికం మాజీ మంత్రి ఎ రాజా, డిబి రియాల్టీ లిమిటెడ్ ఎండి వినోద్ గోయంకాలతో పాటు కరుణానిధి కూతురు, డిఎంకె పార్లమెంటు సభ్యురాలు కనమొళి, టీవీ చానెల్ మేనేజింగ్ డైరెక్టర్ శరద్ కుమార్ విచారణను ఎదుర్కుంటున్న స్థితిలో దయాలు అమ్మాళ్కు కోర్టు సమన్లు జారీ చేయడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. కేసు వాస్తవాలను, పరిస్థితిని బట్టి దయాలు అమ్మాళ్ కేసులో ముఖ్యమైన సాక్షి అవుతారని, అందువల్ల కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావడం నుంచి ఆమెకు మినహాయింపు ఇవ్వలేమని న్యాయమూర్తి అన్నారు. అసలే పదవి లేని సమయంలో ఇలాంటి కేసులతో కరుణానిధికి పూర్తిగా చీకటి మయం అయింది. 2జీ కష్టాలు చివరకు కరుణానిధి భార్యను కూడా వదిలిపెట్టలేదని డీఎంకే పార్టీ కార్యకర్తలు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more