రామకృష్ణ చంచల్గూడలో పార్టీ అధినేత జగన్ను కలుసుకునేలా అపాయింట్మెంట్ ఖరారయింది. అయినా రామకృష్ణ అలా చేయ కుండా విశాఖకు వెళ్ళారు. అక్కడ ఆయన్ను కార్యకర్తలు కలుసుకున్నారు. దాడి చేరికను తీవ్రంగా వ్యతిరేకించారు. దాడి వీరభద్రరావు వైకాపాలో చేరాక విశాఖ జిల్లాలో ముఖ్యంగా అనకాపల్లి నియోజక వర్గంలో తలెత్తిన నిరసనల పర్వం చల్లారనే లేదు. ఆయన చేరికపై పునరాలోచించాలని వైకాపా కు చెందిన కొణతాల లక్ష్మీనారాయణ నాయకత్వంలో పార్టీ కార్యకర్తలు ఇచ్చిన అల్టిమేటంను వైకాపా సీరియస్గా తీసుకోలేదు గానీ, అక్కడి కార్యకర్తల అభీష్టం మేరకు రామకృష్ణ పార్టీని వీడుతారేమోనన్న అనుమానంతో ఆయన్ను బుజ్జగించే పనిలో పడ్డారు వైకాపా సీనియర్లు.
దాడి వీరభద్రరావు వైకాపాలో చేరాక విశాఖ జిల్లాలో ముఖ్యంగా అనకాపల్లి నియోజక వర్గంలో తలెత్తిన నిరసనల పర్వం చల్లారనే లేదు. దాడిని చేర్చుకున్నా రామకృష్ణకు వున్న ప్రాధాన్యత ఎప్పటికీ వుంటుందని హామీ ఇస్తూ ఆయన్ను పార్టీలో కొనసాగేలా అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆయన విషయంలో పార్టీ పునరాలోచన చేయకపోతే తమదారి తాము చూసుకుందామని రామకృష్ణపై వత్తిడి తెస్తున్నారు. ఆరునూరైనా దాడి పార్టీలో కొనసాగితే తాము మాత్రం పార్టీలో కొనసాగరాదని కొణతాల వర్గం పంతంపట్టి కూర్చుంది. కొణతాల ఎంతగా నచ్చచెప్పినా అక్కడి ఆయన వర్గం మాత్రం లెక్కచేసే పరిస్థితిలో లేదు.
అనకాపల్లి ఎంపీ సబ్బంహరి తీరుపై కొణతాల గుర్రుగా వున్నారు. సబ్బంహరి, సాంబశివరాజులు కూడబల్కుని దాడి వీరభద్రరావుని వైకాపాలోకి చేర్పించారని, ఈ విషయాన్ని వారెవరూ కనీసం తనతో పంచుకోలేదని, పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న తనకు ఇలా చేయడం సమంజసమా అని ఆయన ఆవేదన చెందినట్టు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. వైఎస్ మీద వున్న అభిమానంతో వైకాపాలో కొనసాగాలా, కార్యకర్తల మాటను ఆచరించాలా ఎటూ తేల్చుకోలేక కొణతాల రామకృష్ణ సతమతమవుతున్నారు. మరోవైపు రామకృష్ణకు కాంగ్రెస్ గాలం వేసింది. పిసిసి అధ్యక్షుడు బొత్స, విశాఖ జిల్లాకు చెందిన మంత్రి గంటా శ్రీనివాసరావులు కూడా కొణతాలతో మాట్లాడి పార్టీలోకి ఆహ్వానించినట్టు సమాచారం.
రామకృష్ణ పార్టీ వీడేది లేదని వైకాపా ఒకవైపు ప్రకటిస్తుండగా మరోవైపు ఆయన ఢిల్లీ పర్యటనకు బయలు దేరడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ‘దాడి వీరభద్రరావు ఎంట్రీ రేపిన చిచ్చు అనకాపల్లి వైకాపాలో ఇంకా చల్లారనే లేదు. ఆయన చేరికను తీవ్రంగా విభేదిస్తున్న కొణతాల వర్గీయులు పార్టీని వీడాలంటూ రామకృష్ణపై వత్తిడి పెంచుతూనే వున్నారు. కార్యకర్తల అభీష్టం మేరేక తాను నడుచుకుంటానని, అయితే జగన్ అంటే అభిమానమేనని రామకృష్ణ చెప్పుకోవడంతో ఆయన ఇంకా పార్టీని వీడాలా వద్దా అనే అంశంపై ఊగిసలాటలో వున్నట్టు చెప్పవచ్చు. ఇదిలా ఉండగా కొణతాల రామకృష్ణ హస్తినకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. బహుశా కాంగ్రెస్లో చేరడానికే ఆయన ఢిల్లీ పర్యటన ఎంచుకున్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more