పార్లమెంటుల్లో జరిగే ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు మీరు .. రావోద్దు? తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు ఆంద్రప్రదేశ్ రాజకీయల్లో పెనుమార్పులు తెచ్చిన విషయం తెలిసిందే.. ప్రపంచ దేశాలుకు తెలుగువాడి సత్తా ఏమిటో సాటిన మొదటి రాజకీయ నాయకుడు నందమూరి తారక రామారావు. ఆయన చనిపోయి 18 ఏళ్లు అయిన, ఇప్పటికి ఎన్టీఆర్ మీద ఎన్నో విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకపక్క కుటుంబ సభ్యులు, మరో పక్క రాజకీయ నాయకులు, ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీపార్వతి లతో.. నిత్యం ఆయన వార్తల్లో నిలుస్తున్నారు. రాజకీయ లబ్థికోసం ఎన్టీఆర్ ను రాజకీయ నాయకులు ..ఉపయోగించుకుంటున్నారు.
రాజకీయ పార్టీలతో భేదం లేకుండా అన్ని రాజకీయ పార్టీలు ఆయన బొమ్మతో రాజకీయం చేస్తున్నారు. అయితే ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ నాయకులు మాత్రం బొమ్మ ఫైట్ చేస్తున్నారు. ఒక తెలుగు నాయకుడి విగ్రహం పార్లమెంట్లు పెడుతున్న సమయంలో ఎన్నో కష్టాలు. 13 ఏళ్ల తరువాత ఎన్టీఆర్ బొమ్మను పార్లమెంట్ ఆవరణలో పెట్టడానికి అనుమతి లభించింది. ఎన్నో ఒడుదుడుకులను తట్టుకొని.. ఎన్టీఆర్ విగ్రహం ఢిల్లీకి చేరుకుంది. అయితే రేపు ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ జరుగుతుంది. ఈ ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ పై, రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు కొత్త విమర్శలు లేవనెత్తారు. మా పార్టీ నాయకుడి విగ్రహావిష్కరణకు మమ్మల్ని ఎందుకు పిలవలేదని.. టిడిపి నాయకులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఒక పక్క చంద్రబాబుకు ఇంతవరకు ఆహ్వానం అందలేదని ఆయన మండిపడుతున్నారు. సందట్లో సడేమియాలాగా.. ఎన్టీఆర్ భార్య లక్ష్మీ పార్వతి, నా భర్త విగ్రహావిష్కరణకు నన్ను పిలవలేదని ఆమె కన్నీరుమున్నీరుగా విలపిస్తుంది.
కేంద్ర మంత్రి పురంథేశ్వరి కావాలనే నాపై కక్ష సాధిస్తుందని లక్ష్మీపార్వతి మీడియా ముందు వాపోతుంది. వీరందరి పరిస్థితి ఇలా ఉంటే? కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీ మాత్రం ఎన్టీఆర్ విగ్రహం పై ఆవేశం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాడిన ఎన్టీఆర్ పై ఆమె నిప్పులు కక్కుతున్నారు. ఆంద్రప్రదేశ కాంగ్రెస్ ఎంపీలకు సోనియా గాంధీ వార్నింగ్ ఇచ్చినట్లు ఢిల్లీ నాయకులు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాడిన ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు హాజరు కావద్దని పార్టీ అధినేత్రి సోనియాగాంధీని కాంగ్రెస్ ఎంపీలు కోరారు. కాంగ్రెస్ ఎంపీలు లగడపాటి రాజగోపాల్, కావూరి సాంబశివరావు, సాయి ప్రతాప్, అనంత వెంకట్రామి రెడ్డి తదితరులు సోనియాను కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు.
సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలను ఆంద్రప్రదేశ్ కాంగ్రెస్ ఎంపీలు తప్పుబడతున్నారు. ఎన్టీఆర్ కడుపున పుట్టిన బిడ్డ పురంథేశ్వరి మాత్రం ఎంపీగా కాంగ్రెస్ లో ఉండాలి? ఎన్టీఆర్ విగ్రహం కోసం పురంథేశ్వరి చేసిన పనులకు కేంద్రం అనుమతి ఇవ్వాలి? ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు మాత్రం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఎంపీలకు వెళ్లకూడదా? ఇదేక్కడి న్యాయం అని ఎంపీలు, ఎమ్మెల్యేలు చర్చించుకుంటున్నారు. అలాటప్పుడు ఎన్టీఆర్ విగ్రహం పార్లమెంటు లో ఎందుకుపడుతున్నారని , కొంతమంది కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. చివరకు ఎన్టీఆర్ విగ్రహం పై రాజకీయ చెయ్యటం మంచిది కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అమ్మ పిలుపుకు ఎంత మంది ఎంపీలు నిలబడతారో చూడాలి. పార్లమెంటు ప్రాంగణంలో రాజ్యసభ ప్రవేశ ద్వారం వద్ద ఎన్టీఆర్ విగ్రహాన్ని స్పీకర్ మీరాకుమార్ ఆవిష్కరించనున్న విషయం తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more