రాష్ట్ర రాజధాని హైద్రాబాద్ దేశ రాజధాని ఢిల్లీ అడుగుజాడల్లో కనీసం ఒక విషయంలో అయితే నడుస్తున్నట్టుగా కనపడుతోంది. అది మహిళలు, బాలికల పట్ల అత్యాచారం విషయంలో. వెలుగుచూసిన ఈక్రింది సంఘటనలను పరిశీలిస్తే, హైద్రాబాద్ లో కూడా అత్యాచార జాఢ్యం వ్యాపిస్తున్న సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
1. ఎనిమిది సంవత్సరాల బాలిక మీద ఆ అమ్మాయి పెంపుడు తండ్రి అత్యాచారం.
2. మానసిక స్థితి సరిగ్గా లేని యువతి మీద పక్కింటి మనిషి అత్యాచారం.
3. నాలుగు సంవత్సరాల బాలిక మీద మైనర్ బాలుడి అత్యాచారం.
4. కూలి పని చేసుకుని బ్రతుకు వెళ్ళబోసుకుంటున్న మహిళ మీద సామూహిక అత్యాచారం
పై సంఘటనలను చూస్తుంటే, వెలుగులోకి రానివి మరెన్ని ఉన్నాయో తెలియదు కానీ అత్యాచారమనే మానసిక దౌర్బల్యంలో రాష్ట్ర రాజధాని దేశ రాజధానికేమీ తీసిపోదని తెలుస్తోంది.
హైద్రాబాద్ రాజేంద్రనగర్ లో పెంపుడు తండ్రి ఎనిమిది సంవత్సరాల కూతురుని లైంగికంగా వేధించాడంటే వావి వరుసలు మరచిపోయేంతగా పెరిగిపోయింది ఈ అత్యాచార ధోరణి. సికింద్రాబాద్ పరిథిలోని అల్వాల్ లో మానసికస్థితి సరిగ్గా లేని యువతి బయట వరండాలో పడుకునివుండగా పక్కింటి నాగరాజు ఆమె మీద అత్యాచారానికి ఒడిగట్టాడు. అంటే ఈ మనిషి మానసిక స్థితి ఎంత దిగజారిపోయిందో తెలుస్తోంది. కుషాయిగూడాలో రోజు కూలి చేసుకునే యువతిని సామూహికంగా అత్యాచారానికి గురిచేసిన ఉదంతం రెండు రోజుల తర్వాత వెలుగులోకి వచ్చింది. ఇంకా ఘోరం ఏమిటంటే, యుక్త వయసుకే ఇంకా రాని బాలుడు నాలుగు సంవత్సరాల బాలిక మీద అత్యాచారం చెయ్యటం.
ఈ సంఘటనలన్నీ పతనమౌతున్న మానసిక స్థాయిలను తెలియజేస్తున్నాయి. మొదటి మూడు సంఘటనల్లో ముందుగా అనుకోకపోయినా అప్పటికప్పుడు అదుపు తప్పిన మానసిక స్థితిగా తీసుకున్నా, 20 సంవత్సరాల రోజు కూలీ చేసుకునే మనిషి మీద అత్యాచారం మాత్రం ముందుగా అనుకుని పథకం ప్రకారం చేసిందే.
రోజు కూలీలుండే అడ్డాకు పోయిన యువకులు ఇంటిలో పని ఉందనే మిషతో అక్కడ కూలీ కోసం ఉన్న ఆమెను ఇంటికి తీసుకునిపోయి అత్యాచారానికి ఒడిగట్టారంటే, వాళ్ళకి ఎవరన్నది అనవసరం, ప్రేమ లాంటిదేమీ లేదు, సమయంతో సంబంధం లేదు, సరే ఇక అన్ని అత్యాచార సంఘటనల్లోనూ ఉన్నట్టుగా అవతలి మనిషి ఇష్టం, సుఖం తో ఎలాగూ ఎలాంటి పనిలేదు.
ఇదీ మనుషులు దిగజారుతున్న విధానం. తర్వాత పట్టుబడతామేమోనన్న భయాన్ని కూడా ఆ సమయంలో మనసు అధిగమించి కోరికను తీర్చుకోమని చెప్తుందంటే వ్యసనాలలోకెల్లా అది పెద్ద వ్యసనం, సామాజికంగా క్యాన్సర్ లా తయారవుతోందీ మానసిక దౌర్బల్యం.
పోలీసులు అప్రమత్తులై వెలుగుచూసిన ఘటనలలో నేరస్తులను వెతికి పట్టుకుంటున్నారు. కానీ అసలు నేరస్తులు తప్పించుకుంటున్నారు. సమాజంలో ఇంతటి మానసిక దిగజారుడుతనాన్ని ప్రేరేపిస్తున్నవారెవరు, వారు ఏ విధంగా మనసుని బలహీనంగా చేస్తున్నారు, అందుకు ఏయే మాధ్యమాలను వాడుతున్నారు. సినిమాలా, పుస్తకాలా, వీడియోలా, లేక ఇంకా ఏమిటి అన్నది తెలుసుకుని వాటిని అరికట్టటం చాలా ముఖ్యం. అన్నిటికన్నా ప్రధానం ఇటువంటి ఆలోచనలను రాకుండా చిన్నప్పటి నుంచే పిల్లల మానసిక ఎదుగుదలకు పెద్దలే అరికట్టాలి.
చిన్నపిల్లలను సరిగ్గా చూడని పెద్దల పట్ల అమెరికాలో చట్టపరంగా శిక్షలున్నట్లుగా, పెద్దల మాటను జవదాటే పిల్లలను కూడా శిక్షించే విధానం రావాలి. అప్పుడే సమాజం బాగుపడుతుంది.
ఒక చిన్న కురుపు అవుతేనే ఒంట్లో సుగర్ ఉందా, ఇంట్లో ఎవరికైనా అలాంటి వ్యాధి ఉందా అంటూ ఎన్నెన్ని ఆరాలు తీస్తారు. అలాంటిది సమాజానికి పట్టుకున్న చీడను వదిలించటానికి సామాజిక సంస్కరణలు, చట్టంలో మార్పులు చాలా అవసరం. అన్నిటికన్నా ముఖ్యంగా మనుషుల్లో అవగాహన పెరగాలి.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more