63 సంవత్సరాలు 207 రోజలు, 16 జిల్లాలు, 84 నియోజకవర్గాలు, 160 మండలాలు, 1246 గ్రామాలలో చంద్రబాబు పాదయాత్ర సాహసం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చేపట్టిన 'వస్తున్నా.. మీ కోసం' పాదయాత్ర శనివారంతో ముగియనుండడంతో విశాఖలో కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. 207 రోజుల పాటు తనతో పాదయాత్రలో పాల్గొన్న కార్యకర్తలు, సిబ్బందితో ఆయన కుటుంబసభ్యులు ఆప్యాయంగా ముచ్చటించారు. తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు నిర్వహిస్తున్న సుదీర్ఘ పాదయాత్ర చివరి దశకు చేరుకుంది. 63 ఏళ్ల వయస్సులో ఎవ్వరూ చేయని సాహసం చేసిన చంద్రబాబు ఈ ఆరు నెలల కాలంలో మొత్తం 2800 కిలోమీటర్లు పైగా నడిచారు. మధ్యలో అనారోగ్యం ఇబ్బందులకు గురి చేసినా ఆయన వెరవక, బెదరక మొండిగా పాదయాత్ర కొనసాగించారు.
గత సంవత్సరం ఒక దశలో తెలుగు దేశం పార్టీ కార్యకర్తలలో నిరుత్సాహం గూడు కట్టుకుపోయింది. తెలుగుదేశం పార్టీ మళ్లీ కోలుకోగలదా అన్న సందేహం అందరినీ పట్టి పీడించిన సమయం అది. ఆ సమయంలో పాదయాత్రతో ప్రజలకు చేరువ కావాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. ఆరు పదులు దాటిన ఈ వయస్సులో పాదయాత్రలు ఏమిటని విమర్శించినవారున్నారు. తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి రాగలదన్న విశ్వాసం ప్రజలకు కలగాలంటే పాదయాత్రకు మించిన ప్రత్యామ్నాయం లేదని విశ్లేషకులు పేర్కొన్నారు. ముందుకు పోవడమే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు 2012 అక్టోబర్ రెండవ తేదీన హిందూపురంలో పాదయాత్ర ప్రారంభించారు. ఈ పాదయాత్రలో ఆయన ప్రజల కష్టనష్టాల గురించి విన్నారు.
వారిలో ఒకరుగా కలిసిపోయారు. ప్రజల చెంతకు వచ్చేవాడే నాయకుడు అన్నట్టుగా ప్రజలతో మమేకం అయిపోయారు. రైతన్న దగ్గరికి వెళ్లి పొలం దున్నారు. వడ్రంగి దగ్గరకు వెళ్లి తానూ ఆ పనిలో ఒక చేయి వేశారు. రోడ్డు పక్కన చాయ్ చేసి అమ్మే చాయ్ దుకాణంలో తానూ చాయ్ తయారు చేశారు. చంద్రన్నా మళ్లీ నువ్వే రావాలన్నా అని ఎందరో తమ్ముళ్లు చంద్రబాబుకు ఎదురువెళ్లి స్వాగతం పలికారు. ముసలీ ముతకా తమ సమస్యలు చెప్పుకున్నారు. వారి వారి సమస్యలు చెవి వొగ్గి విన్న బాబు వారికి ఎన్నో వరాలు కురిపించారు. ఎన్నో జిల్లాలలో డిక్లరేషన్లు ప్రకటించారు. ఈ పాదయాత్ర ముగింపు సందర్భంగా విశాఖపట్నంలో శనివారంనాడు బ్రహ్మాండమైన బహిరంగ సభ జరగబోతున్నది. ఈ సభకు కనీసం ఐదు లక్షల మంది ప్రజలు పాల్గొంటారని భావిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more