సామాన్యంగా మద్యపానం చేసేవారిలో కాలేయంలో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మద్యపానంతో నిమిత్తం లేకుండా కాలేయం చెడిపోయే కేసులు ఎక్కువౌతున్నాయి. ఈ సమస్య పాశ్చాత్య దేశాలలో 36 నుంచి 45 శాతం వరకుంటే మనదేశంలో పట్టమ ప్రాంతాల్లో 20 నుంచి 30 శాతం వరకు కనపడుతుండటం వైద్యపరంగా కలతచెందే విషమని ఇండియన్ అసోసియేషన్ ఫర్ స్టడీ ఆఫ్ లివర్ డిసీజెస్ లో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (ఐఎన్ఎస్ఏఎల్) మెంబర్ డాక్టర్ మనిషా బంగార్ అన్నారు.
ఇది కేవలం ఆహారపు అలవాట్లలో లోపించిన క్రమశిక్షణ, అవగాహనలే కారణమని డాక్టర్ మనిషా అన్నారు. కార్బో హైడ్రేట్స్ ఎక్కువగా తీసకుంటూ పోషకపదార్థాలను తక్కవ ప్రమాణంలో తీసుకోవటం వలనే ఈ సమస్య ఏర్పడుతుందని ఆవిడ అన్నారు. ఈ విషయంలో శాకాహారులే ఎక్కువ ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందన్నారు. ఎందుకంటే కార్బోహైడ్రేట్లు చివరకు పరివర్తన చెందేది కొవ్వు పదార్థంలోకే కాబట్టి. ఇది ప్రస్తుతం అవలంబిస్తున్న ఆధునిక జీవన శైలి కారణంగా జరుగుతోందన్నారు డాక్టర్ మనిషా.
ఊబకాయం ఉన్నవారిలోనే కాలేయంలో కొవ్వు పదార్థాలు పేరుకుపోవటం ఎక్కువగా జరుగుతోందని, సన్నగా ఉన్నవారిలో అలా జరగటం లేదని ఆవిడ పరిశీలనలో తేలిందని చెప్పారు. అయితే సన్నగా ఉన్నవారిలో కూడా ఆహారపు అలవాట్లు సరిగ్గా లేకపోతే అవయవాలలోపల కొవ్వు పేరుకుపోయే అవకాశం ఉందని అన్నారావిడ. ఈ లక్షణాలను ప్రారంభదశలోనే కనిపెట్టినట్లయితే తక్కువ కొవ్వు పదార్థాలనున్న ఆహారాన్ని తీసుకోవటం, వ్యాయామం ద్వార దాన్ని నియంత్రించవచ్చని చెప్పారు.
పాశ్ఛాత్య దేశస్తులతో పోలిస్తే, శరీర ప్రమాణంతో సంబంధం లేకుండా, అంతర్గత అవయవాలలో కొవ్వు పేరుకునే లక్షణం మనదేశవాసుల శరీర వ్యవస్థలోనే ఎక్కువగా ఉందని, అందుకు కారణం మన ఆచారవ్యహరాలు ఆహారపు అలవాట్లేనని డాక్టర్ మనిషా తెలియజేసారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more