అధిక బరువుని తగ్గించుకునేందుకు స్మార్ట్ ఫోన్ అప్లికేషన్ ని ఒకదాన్ని లండన్ పరిశోధకులు రూపొందించారు.
అప్లికేషన్ పేరు మై మీల్ మేట్. ఇందులో బరువు తగ్గటం కోసం లక్ష్యాన్ని ఒకదాన్ని ఏర్పరచుకుని, ఏరోజు కారోజు దాన్ని పర్యవేక్షించవచ్చు. అలా కాకుండా డైరీ లో కూడా రాసుకుని ఆ ఫలితాన్ని పొందవచ్చు. అయితే, అలా పేపర్ మీద రాసుకున్నదానికి, ఫోన్ అప్లికేషన్ ద్వారా పరిశీలించుకున్నదానికి తేడా చూస్తే, ఆరు నెలల్లో ఫోన్ అప్లికేషన్ ద్వారా 4.6 కిలోలు తగ్గితే, మామూలుగా డైరీలో చేత్తో రాసుకుని అనుసరించినదాని ద్వారా 2.9 కిలోల కంటే ఎక్కువ ఫలితం రాలేదట.
అసలు దీని విధానమేమిటంటే, ప్రతిరోజూ తీసుకునే ఆహారం, చేస్తున్న వ్యాయామం, పెట్టుకున్న లక్ష్యాలను బట్టి ఈ అప్లికేషన్ వాటిని సరిచూసి దీన్ని వాడేవాళ్ళకి తగు సూచనలిస్తుంది.
ప్రతిరోజు మనం తినే ఆహారంలో ఎన్ని కెలోరీల శక్తి మనకి వస్తోందన్నది మనం గమనించం. మైమీల్ మేట్ ద్వారా నియంత్రించుకుంటే ఫలితాలు చాలా బాగున్నాయని అంటున్నారు. ఆహార పదార్థాల ప్యాకెట్ల మీద రాసిన వివరాలను చూస్తే ఎందులో ఎన్ని కెలోరీలున్నాయన్న సంగతి తెలుస్తుంది కానీ వాటిని సేవించటం వలన శరీరంలో కలిగే సంపూర్ణమైన మార్పుల అవగాహన రాదు. అన్నారు ఈ ప్రాజెక్ట్ ని నిర్వహిస్తున్న ప్రొఫెసర్ జానెట్ కేడ్.
ఈ అప్లికేషన్ ని స్పచ్ఛందంగా వచ్చిన 128 మంది చేత ఉపయోగింపజేసి ఆరునెలల తర్వాత ఫలితాలను పరీక్షించటం జరిగింది. వాళ్ళందరినీ మూడు బృందాలుగా చేసి ఒక్కో బృందం చేత ఒక్కో రకమైన అప్లికేషన్ ని ఉపయోగించి చూసి ఫలితాలను నోట్ చేసుకున్నారు.
అయితే మిగతా ఫోన్ అప్లికేషన్ ల లాగా దీనిమీద ఎల్లకాలం ఆధారపడి ఉండనక్కరలేదని, మొదట్లో దీనిద్వారా పరిశీలించుకోవటం మొదలుపెడితే ఆ తర్వాత ఎవరికి వారు వారి ఆహారాన్ని, వ్యాయామాన్ని ఎప్పిటికప్పుడు సరిచూసుకోవటం వచ్చేస్తుందంటున్నారు.
మనదేశంలో కూడా ఇది ఉపయోగపడుతుంది కానీ కేవలం ప్యాక్డ్ ఫుడ్ తినేవాళ్ళకి, విదేశీ వంటకాలను భుజించేవాళ్ళకే కానీ రాను రాను మన ఇడ్లీ, దోశ, ఊతప్పం, చపాతీలు, పులిహార, చక్రపొంగలి, బొబ్బట్లు అరిసెలు కూడా ఈ అప్లికేషన్ లో చోటుచేసుకోవచ్చు. కానీ మనకు ఆహారంగా ప్రాచీన కాలం నుంచి వస్తున్న పద్దతిని సరిగ్గా ఆచరిస్తే, ఆహారం దానంతటదే సమతౌల్యమౌతుంది. మనదేశంలో చిప్స్, బర్గర్, పిజ్జాలు తినటం మొదలుపెట్టిన తర్వాతనే ఊబకాయాలు మొదలయ్యాయి. మళ్ళీ వాటిని తగ్గించుకోవటానికి మరో విదేశీ అప్లికేషన్ ని ఉపయోగించవలసి వస్తుందన్నది హాస్యాస్పదం కదూ. ఆరోగ్యం విషయంలో మన ఆయుర్వేదం ప్రపంచానికే మార్గదర్శం కాదా
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more