చంచల్ గుడా జైల్లో జగన్ ని కలవటానికి వెళ్తున్న పలు నేతల విషయంలో మాట్లాడుతూ, జగన్ ని చంచల్ గూడ జైల్లో ఉంచటం వలనే అక్కడ దర్బారు నడుస్తున్నదని, అదే ఏ తిహార్ జైల్లోనో పెట్టుంటే ఆ ఆటలు సాగేవి కావని తన అభిప్రాయాన్ని తెలియజేసిన సర్వే సత్యనారాయణ జగన్ మీద ప్రభుత్వం కక్ష తీసుకుంటున్నదన్న మాటల్లో సత్యం లేదని అన్నారు.
అయితే ఇలా తలా ఒక పద్ధతిలో జగన్ మీద ఆరోపణలు చెయ్యడం సరికాదని, రానున్న ఎన్నికల నేపథ్యంలో మంత్రులందరూ మాట్లాడుకుని ఒకే విధంగా ఆరోపణ చేస్తే మంచిదని అన్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ కెఆర్ ఆమోస్, జగన్ చేసిన దోపిడీ ప్రజలకు సరిగ్గా తెలియాలంటే ఒక విధానాన్ని రూపొందించుకోవాలని, అందుకు కాంగ్రెస్ పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చెయ్యాలని ఆయన అభిప్రాయపడ్డారు.
అంటే, పార్టీలోనూ బయటా వివిధ ధోరణులలో జగన్ గురించి మాట్లాడటం జరుగుతోంది కాబట్టి ప్రజలు సందిగ్ధంలో పడుతున్నారని, అందువలన అందరం కూడబలుక్కుని ఒకే మాట మీదుంటే కనీసం కాంగ్రెస్ పార్టీ నుంచైనా జగన్ విషయంలో స్పష్టమైన వైఖరి ప్రజల్లోకి వెళ్తుందని ఆయన ఉద్దేశ్యం.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more