తెలంగాణ రాష్ట్ర సమితి ఇతర పార్టీ నాయకులను ఆకర్షించే పనిలో సమర్ధవంతంగా పనిచేసిందనే చెప్పాలి. కరీం నగర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు గంగుల కమలాకర్ తెరాస గుడారంలోకి వెళ్ళిపోయారు. ఆయన తెరాస అధ్యక్షుడు కెసిఆర్ ని ఆయన ఫామ్ హౌస్ లో కలిసి 45 నిమిషాలసేపు చర్చించారు.
ఈ సంగతి తెలిసిన తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గంగుల కమలాకర్ ని పార్టీనుంచి బహిష్కరించారు.
కెసిఆర్ ఆహ్వానం మీదనే తాను తెరాసలోకి వెళ్తున్నానని, ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కోసం నిజాయితీగా కృషి చేస్తున్నది ఒక్క తెరాస అన్న అభిప్రాయంతోనే తాను ఆ పార్టీలో చేరదలచుకున్నానని గంగుల కమలాకర్ ప్రకటించారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది శాసన సభ్యులు, కొంతమంది పార్లమెంటు సభ్యులు కూడా తెరాస లో చేరటానికి ఉత్సుకతను చూపిస్తున్నారని చెప్పిన కెసిఆర్, అయితే వాళ్ళల్లో ఎవరి చేరికను అనుమతించాలన్న నిర్ణయాన్ని తెరాస పార్టీలోని నాయకులు, ఉద్యమకారులను సంప్రదించిన తర్వాత తీసుకుంటామని కూడా అన్నారు.
కొత్త నాయకులను తీసుకుంటే తెరాస లోని పాత సీనియర్ నాయకులలో అలజడి, నిరత్సాహాలతో వారి నుండి నిరసనలు వెల్లువెత్తే అవకాశం ఉన్నదన్న విషయాన్ని కూడా కెసిఆర్ విస్మరించటంలేదని తెలుస్తోంది. అందుకే,
మేము ఎవరినిబడితే వాళ్ళని తీసుకోము. పార్టీలోకి తీసుకునేముందు వాళ్ళు తెలంగాణా ఉద్యమంలోనూ పార్టీ పటిష్టతకు ఎంతగా పాటుపడ్డారన్నది పరిగణనలోకి తీసుకుంటాం అన్న కెసిఆర్. సకల జనుల సమ్మెలో తెలంగాణా ప్రజల మనోభావాలు అందరికీ అవగతమయ్యాయని, అందువలన అన్ని పార్టీ నాయకులు కలిసి పోరాడాలని ఆయన సూచించారు. ఎన్నికల సమయం వచ్చేసరికల్లా తెరాస పూర్తిగా బలాన్ని పుంజుకోవాలని మా ఆశయం అన్నారు కెసిఆర్.
ఈ విషయంలో తెలంగాణా పార్లమెంటు సభ్యులందరిదీ ఏకాభిప్రాయం ఉన్నట్టుగా గోచరించటం లేదు. మధు యాష్కి, పొన్నం ప్రభాకర్ మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ తెరాసతో కలిసే ఆలోచనలో లేరని వార్త. తెరాసలో చేరటానికి మధు యాష్కి గౌడ్ విముఖత చూపించటానికి కారణం లేకపోలేదు. ప్రస్తుతం పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న మధుయాష్కీ స్థానంలో కెసిఆర్ కూతురు కవితను ఎన్నికల్లో నిలబెట్టే అవకాశం ఉంది.
పెద్దపల్లి ఎంపీ జి.వివేకానందతో పొన్నం ప్రభాకర్, ఎస్.రాజయ్య, మందా జగన్నాధ్ భేటీ అవుతుండటంతో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు కె.కేశవరావు నివాసంలో ఏర్పాటు చెయ్యదలచుకున్న సమావేశాన్ని రద్దు చేసుకోవలసి వచ్చింది. కానీ తెరాస అధ్యక్షుడు తన పార్టీలో చేరటానికి ఆఖరు సమయం అంటూ ప్రకటించినందువలన అంత త్వరగా అనాలోచితంగా నిర్ణయం తీసుకోవలసిన అవసరం లేదని కొందరు ఎంపీలు భావిస్తున్నారు.
కేశవరావు పాల్గొన్న పంచాయితీ రాజ్ మంత్రి జానారెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో తో ఎంపీలు చేసిన చర్చలు ముఖ్యంగా కెసిఆర్ తన పార్టీలో చేరటానికి పంపిన ఆహ్వానం మీద, తెలంగాణా విషయంలో అధిష్టానం అనవసరం చేస్తున్న జాప్యం మీద కేంద్రీకృతమై నడిచాయి.
కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి, పంచాయితీ రాజ్ మంత్రి జానారెడ్డి నేతృత్వంలో ప్రతిపాదించిన కొత్త పార్టీ వచ్చేది అంత నమ్మకంగా లేదు. అయితే ఏప్రిల్ 22 న మాత్రం పార్లమెంటులో తెలంగాణా అంశం మీద తీవ్రంగా ఆందోళన చేద్దామని మాత్రం నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.
మొత్తం మీద కాంగ్రెస్ శ్రేణుల్లో నిర్దిష్టమైన ప్రణాళిక లేకపోవటం, తెరాస అధినేత కెసిఆర్ అందరం కలసి తెలంగాణా కోసం పోరాడదామని పిలుపునిస్తే నాయకులు ఆ విషయంలో ఊగిసలాడటం చూస్తుంటే, ఈ సారి కెసిఆర్ పార్టీన బలోపేతం చెయ్యటానికి కదిపిన పావులు ఫలితాన్నిచ్చేట్టుగానే కనిపిస్తున్నాయి.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more