గత వారం రోజుల నుండి తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయకుడు కాలినొప్పితో బాధపడుతున్న విషయం తెలిసిందే. అయిన పాదయాత్ర చెయ్యటానికే చంద్రబాబు సిద్దమయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో బాబు పాదయాత్ర చెయ్యకూడదని డాక్టర్లు చెబుతున్నప్పటికి, బాబు మాత్రం ప్రజల ముందుకు నడిచి వెళ్లుతున్నారు. అయితే టిడిపి నాయకులు ఆందోళన చెందుతున్నారు. డాక్టర్ సలహా మేరకు రెండు రోజులు పాదయాత్రకు విరామం ప్రకటించిన చంద్రబాబు. విశాఖ జిల్లాలో మీకోసం వస్తున్న పాదయాత్ర చేస్తున్నారు. అయితే కాలి నొప్పితో బాధపడుతున్న చంద్రబాబు కుటుంబ సభ్యుల నుండి పరామర్శలు అందుతుంది. అయితే ఇటీవల కాలంలో టిడిపికి హరిక్రిష్ణ కుటుంబం దూరంగా ఉంటుందనే విమర్శలు పార్టీలో వినిపిస్తున్నాయి. రీసెంట్ గా జరిగిన జూనియర్ ఎన్టీఆర్ పోస్టర్ వివాదం గానీ, సీనియర్ ఎన్టీఆర్ వివాదం గానీ, అన్నదమ్ముల మధ్య వైర్యం పెంచిందని పార్టీ నాయకులు అంటున్నారు. ఎన్టీఆర్ కుటుంబం మద్య ఇలాంటి వివాదం రావటం పై పార్టీలోని సీనియర్ నాయకులు ఆందోళన చెందుతున్నారు. బాలయ్య, హరిక్రిష్ణ చేసిన వ్యాఖ్యలకు జూనియర్ ఎన్టీఆర్ కౌంటర్ ఇవ్వకపోయిన, మీడియా ముందు కొన్ని నిజాలు బయటపెట్టడం జరిగింది. నేను తాతగారు స్థాపించిన పార్టీ నుండి ఏ రాజకీయ పార్టీలోకి చేరాను. నందమూరి టిడిపిలోనే ఉంటాను అంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ నాయకుల్లో కొత్త ఆలోచనలు పుట్టించాయి. అంటే ఇప్పటి వరకు టిడిపి అధినేతగా నారా చంద్రబాబు నాయుడు ఉన్న విషయం తెలిసిందే. ఇన్ డైరెక్టర్ గా నారావారి టీడీపీలో నందమూరి కుటుంబ సభ్యులు ఉండరనే విధంగా జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడినట్లు గా రాజకీయ నాయకులు చెప్పుకుంటున్నారు.
ఇటీవల కాలంలో టిడిపిలో బాలయ్య హవా ఎక్కువగా కనిపిస్తున్న విషయం తెలిసిందే. బావకు మద్దతుగా బాలయ్య అడుగులు వేస్తున్నారు. అయితే టిడిపి హరిక్రిష్ణ కుటుంబం దూరమవుతుందనే విమర్శలు నందమూరి అభిమానుల మద్య తలెత్తాయి. అలాంటి విమర్శలకు చెక్ పెడుతూ ఈ రోజు హరిక్రిష్ణ కొడుకు, నటుడు నందమూరి కళ్యాణ్ రామ్ సరికొత్త ప్రయోగం చేశారు. విశాఖలో పాదయాత్ర చేస్తున్న అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును హీరో కళ్యాణ్ రామ్ పరామర్శించారు. నర్సీపట్నంలో ఆయనను కళ్యాణ్ రామ్ కలిసి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్న బాబు నేటి నుంచి గురువారం వరకు పాడేరు, పాయకరావుపేట, నర్సీపట్నం నియోజకవర్గాల పరిస్థితిపై సమీక్షించనున్నారు. హీరో కళ్యాణ్ రామ్ చంద్రబాబును పరామర్శించటం పై తెలుగుదేశం నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా రావాలని టిడిపి సీనియర్ నేతలు భావిస్తున్నారు. జూనియర్ఎన్టీఆర్ టిడిపి దూరంగా ఉండటంతో .. చంద్రబాబుకు కళ్యాణ్ రామ్ దగ్గరవుతున్నాడనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏమైన నారా కుటుంబంతో నందమూరి కుటుంబం విభేదాలు లేకుండా కలిసిపోతే.. తెలుగుదేశం పార్టీకి, తెలుగు అభిమానులకు మంచిదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more