విద్యుత్ ఛార్జీలకు నిరసనగా వామపక్ష పార్టీలకు మద్దతునిస్తూ విపక్షాలన్నీ బంద్ లో పాల్గొన్న సందర్భంగా ఈ రోజు ఉద్రిక్తతలు చోటు చేసుకున్న ప్రాంతాలు ఇవి-
అద్దంకి భవానీ కూడలిలో శాసన సభ్యుడు గొట్టిపాటి రవికుమార్, తెదేపా నేత కరణం వెంకటేశ్ లు ఎదురు పడ్డప్పుడు ఇరు వర్గాల మధ్య ఘర్ఘణ చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనాలు తగిలి తోపులాటలు, దాడులకు దారితీసింది. పాత బస్టాండ్ ప్రాంతంలో కూడా ఇరువర్గాల మధ్య ఘర్షణ జరగ్గా పోలీసులు కలుగజేసుకున్నారు.
హైద్రాబాద్ లోని మంత్రుల నివాస ప్రాంగణంలోకి తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం కార్యకర్తలు చొచ్చుకుని పోయేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోగా పలువురికి గాయాలయ్యాయి.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు లో భారతీయ జనతా పార్టీ నాయకులు విఆర్ సి కూడలిలో రోడ్డుకి అడ్డంగా పడుకుని నిరసన తెలియజేసారు. దానితో వాహనాలు అటూ ఇటూ భారీగా నిలిచిపోయి గందరగోళ పరిస్థితి ఏర్పడింది. పోలీసులు ముందు నచ్చిచెప్పే ప్రయత్నం చేసారు. ఫలితాన్నివ్వకపోవటంతో అరెస్ట్ చేసే ప్రయత్నంలో తోపులాటల మధ్య భాజపా నేతలకు దెబ్బలు తగిలాయి.
శ్రీకాకుళంలో విద్యుత్ ఎస్ ఈ కార్యాలయం ముందు ఆందోళనకు దిగిన విపక్షాలు నెమ్మదిగా లోపలికి కూడా చొచ్చుకెళ్ళి కార్యాలయంలోని కంప్యూటర్లు, ఫర్నిచర్ ని ధ్వంసం చేసారు. బిల్లులు వసూలు చేసే సిబ్బందిని బయటకు పంపించేది ఆందోళన చేపట్టారు. పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.
హైద్రాబాద్ లిబర్టీ కూడలిలో భారతీయ జనతా పార్టీ నేతలను అరెస్ట్ చేసారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో లిబర్టీలో ప్రారంభించిన ధర్నా సచివాలయం వైపు కదులుతుండగా పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేసారు.
హైద్రాబాద్ ఎల్ బి నగర్ ప్రాంతంలో వామపక్షాలు బస్సుల అద్దాలను ధ్వంసం చేసి టైర్లలోంచి గాలి తీసివేసి ఆందోళన చేసారు.
గుంటూరు, ఖమ్మం జిల్లాలలో బంద్ ప్రశాంతంగా సాగింది. బస్సులు నిలిచిపోయాయి కానీ ఉద్రిక్త సన్నివేశాలు చోటుచేసుకోలేదు. విశాఖపట్నంలో బస్సులు నిలిచిపోయాయి. సిటీ బస్సులు నిలిచిపోవటంతో ఈ పట్టణాలలో జన జీవనానికి తీవ్రంగా అంతరాయం కలిగింది. కడప జిల్లాలో బస్సులు డిపోల నుంచి బయటకే రాలేదు.
రాజకీయ పార్టీలే కాకుండా పారిశ్రామికవేత్తలు కూడా విద్యుత్ శాఖ పట్ల తమ నిరసనను తెలియజేసారు. హైద్రాబాద్ నాచారం మల్లాపూర్ లోని పారిశ్రామిక వేత్తలు నాచారం సబ్ స్టేషన్ ని ముట్టడించారు. ఎడాపెడా వేసిన విద్యుత్ పన్నులను చెల్లిస్తున్నా, సకాలంలో విద్యుత్ అందటం లేదని కోతలు చాలా విపరీతంగా ఉన్నాయని వాళ్ళు ఆందోళన చేపట్టారు.
కృష్ణా జిల్లా గుడివాడలో కొడాలి నాని థియేటర్ దగ్గర, జూనియర్ ఎన్టీఆర్ చిత్రం బాద్షా ప్రదర్శనను నిలిపివేయాలంటూ వైయస్ఆర్ కాంగ్రెస్ నాయుకుడు కొఠారి ఆందోళనకు దిగారు.బంద్ లో పార్టీలన్నీ ప్రధానంగా ఆర్ టి సి బస్సుల మీదనే దృష్టి సారించటం విశేషం.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more