ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, పీసీసీ ఛీప్ బొత్స సత్యనారాయణకి ఒకరంటే ఒకరికి పడదనే విషయం తెలిసిందే. కానీ ఎప్పుడు ఎవరు ఎలా మారుతారో చెప్పలేం. విద్యుత్ ఛార్జీల విషయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అండగా నిలిచాడు. కిరణ్ అన్నీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటాడని తన మంత్రి వర్గ మంత్రులు అయిన డీఎల్ రవీంద్రా రెడ్డి, సి. రామచంద్రయ్యలు బాహాటంగానే విమర్శిస్తుంటే... బొత్స మాత్రం కిరణ్ ని వెనకేసుకొచ్చాడు. డీఎల్ రవీంద్రారెడ్డి వ్యాఖ్యల పై స్పందించిన బొత్స, కిరణ్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం లేదని, ఏ నిర్ణయం తీసుకున్నా కాంగ్రెస్ పార్టీకి మేలు చేసే నిర్ణయాలే తీసుకుంటాడని అన్నారు. విద్యుత్ చార్జీల పెంపుతో కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు తప్పవని, తాము పేదలపై భారం పడకుండా చూస్తామన్నారు. విధ్యుత్ ఛార్జీల పెంపు అంశంలో పేదలపై భారం పడకుండా చూస్తామని చెప్పినా ప్రతిపక్షాలు ఆందోళన చేయడం అర్థరహితమన్నారు. ధనవంతులకు విద్యుత్ ఛార్జీలు పెరగకుండా ఉండేందుకే వైయస్సార్ కాంగ్రెసు పార్టీతో సహా ఇతర ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయని మండిపడ్డారు .
ఈఆర్సీ ప్రతిపాదనలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు . విద్యుత్ ఛార్జీలు ఇంకా పెరగలేదని బొత్స అన్నారు. మరో వైపు ముఖ్యమంత్రి విద్యుత్ చార్జీల పెంపుపై ఎవరూ ఆందోళన చెందనవసరం లేదని ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి హామీ ఇచ్చారు. ఇందిరమ్మ బాట కార్యక్రమంలో ఉన్న ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదవారికి ఇబ్బంది కలగదని, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లో కరెంట్ ఒక ముఖ్యమైనదని ఆయన అన్నారు. ఈఆర్సీ ప్రతిపాదించిన విద్యుత్ చార్జీలపై సమీక్ష జరుపుతామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పేదలకు సహాయం చేసే విషయంలో మేము టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, బీజేపీ దగ్గర పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదని సీఎం అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more