అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు, మన చేనేత ఉత్పత్తులకు దేశ విదేశాలలో మంచి గిరాకీ ఉంది. కానీ చేనేత కార్మికులు మాత్రం ఆత్మహత్య చేసుకుంటున్నారు. టీనా అంబానీ, కిరణ్ ఖేర్ లాంటి వాళ్ళు ముచ్చట పడే ఆంధ్ర ప్రదేశ్ చేనేత వస్త్రాలు లక్ష రూపాయల పైనే పలుకుతాయి. కానీ వాటిని తయారు చేసిన చేనేత కళాకారులు అప్పుల రొంపి నుంచి పైకి వచ్చే మార్గం కనిపించక బలవంతంగా ప్రాణాలు తీసుకోవటమే మేలనుకుంటున్నారు. ఫాషన్ షోలలో కూడా ఆకర్షణగా నిలిచిపోయే చేనేత వస్త్రాలు వాటికి ప్రాణం పోసినవారి ప్రాణాలను నిలపలేకపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని మూడున్నర లక్షల చేనేత కుటుంబాలలో ని సభ్యులంతా కలిసి పనిచేసినా వాళ్ళకి వచ్చే ఆదాయం కనీసం తినటానికి కూడా సరిగ్గా సరిపోవటంలేదు. చేనేత కళాకృతుల కోసం వాటిని ఆదరించేవారు అవి దొరికే చోటికి వెతుక్కుంటూ వెళ్తుంటే, వాటిని తయారు చేసేవారు మాత్రం వాటిని వదిలి వేరే పనిని అన్వేషిస్తూ వెళ్ళిపోతున్నారు.
కళాకారుల చేతిలో ఉన్నంతసేపూ చిల్లర రేటు పలికిన వస్తువు, అదే డిజైనర్ చేతికి వచ్చేటప్పటికి దాని విలువ వంద రెట్లకి పెరిగి, దానిమీద రేటు టాగ్ వేయించుకుంటుంది. డిజైనర్ల ఇష్టం. 400 రూపాయలకు కొన్నదానికి 50000 రూపాయల ప్రైస్ టాగ్ కూడా వెయ్యగలరు. అలాగని వాళ్ళతో బేరమాడే స్థితిలో చేనేత కార్మికులు లేరు. డిజైనర్లు ఏమీ కష్టపడకుండానే లక్షలు ఆర్జిస్తున్నారు కానీ కొనుగోలు చేసేటప్పుడు ఎవరు తక్కువకిస్తే వాళ్ళ దగ్గరే తీసుకుంటారు. మార్కెట్ ని పూర్తిగా నియంత్రిస్తారు. వాళ్ళకి దేశ విదేశాలలో నడుస్తున్న మార్కెట్ పంథా ఏమిటో క్షుణ్ణంగా తెలుసు. అందువలన ఎటువంటి వస్తువు ఎక్కడ ఎంత రేటుకి అమ్మగలరో అంతకి అమ్మేస్తారు కానీ కొనుగోలు చేసేటప్పుడు వందోవంతు ఇవ్వటానికి కూడా గీచి గీచి బేరమాడుతారు. గట్టిగా మాట్లాడితే వాళ్ళనుంచి తీసుకోవటమే మానేస్తారేమో ననే అభిప్రాయాన్ని వారిలో కలుగజేస్తారు.
ఈ పరిస్థితిని నియంత్రించే వారు ముందుకు రాకపోవటమే ఇందుకు కారణం. మానవత్వమనేది పక్కన పెట్టినా, ఇది ఇలాగే సాగితే కళాకారులు వాళ్ళ పనులు మానేసుకోవటమో, లేక జీవితాలనే అంతం చేసుకోవటమే చేసుకుంటే మొత్తానికే అంతరించి పోతే పెద్ద ఎత్తున సాగుతున్న వాళ్ళ వ్యాపారానికి కూడా నష్టం కలుగుతుందనే ఆలోచన కూడా లేదు. ఎందుకంటే వేల మీద ఉన్నారు చేనేత కుటుంబాలు. ఒకరు కాకపోతే మరొకరు వీళ్ళు చెప్పిన రేటుకి ఇవ్వటానికి ముందుకొస్తారనే ధీమా.
ప్రభుత్వమే ముందుకొచ్చి కఠినమైన కొన్ని నియమాలను విధిస్తే తప్ప పరిస్థితి మారదు. దీని వెల ఇంత అని అధికారికంగా చెప్పగలిగేవారు లేకపోవటమే ఈ అన్యాయానికి కారణం. అది చెయ్యటం పోయి భారత ప్రభుత్వం చేనేత కార్మికులను ఆదుకోవటానికి కోట్లకొద్దీ నిధులను కేటాయిస్తోంది, అందులో ఆంధ్రప్రదేశ్ కూడా తనవంతు వాటా అందుకుంటోంది. కానీ అది చేతులు మారి చివరకు లబ్ధిదారి దగ్గరికి చేరుకునేటప్పటికి అది అతని చేతిని నింపలేకపోతోంది.
దీనికి మార్గం కాగితాల మీద లెక్కలు వేసుకుని ఇన్ని నిధులను కేటాయించాం అని చెప్పటం కాకుండా, అధికారులను నియమించి, చేనేత పరిశ్రమలో జీవితాలను వెళ్ళదీసుకునేవారికి వారి శ్రమకు తగ్గ ఆదాయం వచ్చేట్టుగా చూడాలి. చేనేత కార్మికులకు నేతలో శిక్షణనిచ్చే కార్యక్రమాలకు నిధులను వెచ్చించటం వలన ఏం ప్రయోజనం. వాళ్ళకి కావలసింది వాళ్ళ వాటాకు రావలసిన సొమ్ము కానీ సాంకేతిక విద్య కాదు. 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రభుత్వం వాళ్ళకి క్లాసులు పెట్టి వాళ్ళకి బోధించే ప్రయత్నం చేస్తోంది కానీ కనీసం వాళ్ళకి ముడి సరుకు కొనుగోలు చెయ్యటంలో కూడా సహాయం చెయ్యటంలేదు. చేనేత వస్త్రాలు ఎటువంటి రసాయనాలు వాడకుండా తయారు చేసేవి, ఇవి కాలుష్యాన్ని కలుగజేయవు పర్యావరణానికి ముప్పు తేవు, సమతౌల్యాన్ని కాపాడతాయని ఉత్పత్తుల మీద అవగాహన పెంచి మార్కెట్ ని పెంచే దిశగా ప్రయత్నం చేసినా సరిపోయేది కానీ అసలే ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న చేనేత కార్మికుల క్లాస్ పీకటం కాదు చెయ్యవలసింది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more