భారత ప్రభుత్వం ప్రకటించిన విధంగానే ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు సర్వ ప్రయత్నాలూ చేస్తున్నట్టుగానే కనిపిస్తోంది. మెతకతనం పోయి ఆత్మరక్షణకు కావలసిన సరంజామా అంతా పోగుచేసుకుంటున్నట్టుగానే భావించవచ్చు. శాంతి కాముకతను బలహీనతగా భావిస్తున్న విదేశీయులకు ఉచితరీతిని తమ సత్తా చాటుదామని చూస్తున్నట్టుగానే ఉంది.
ముంబై లో జరిగిన మారణ హోమానికి కారకులైన వారిని కఠినంగా శిక్షించటంలో స్వదేశీయులను కూడా కనికరించని భారతదేశ న్యాయవ్యవస్థ తీర్పు ఉగ్రవాదాన్నిక సహించమని ప్రపంచానికి ప్రత్యక్ష చర్యలతో చాటుతోంది. 257 మంది మరణానికి, 713 మంది గాయపడటానికి కారణమైన ముంబై నరమేధానికి వెనకనున్న యాకుబ్ అబ్దుల్ రజాక్ మెమెన్ కు ఉరిశిక్ష ఖరారు చెయ్యటంతోపాటు టాడా మరణ శిక్షకు తీర్పునిచ్చిన మరో పదిమందికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. వారు మరణించేంత వరకూ జైలులో ఉండవలసిందే. శలవులు లెక్కలు కట్టి, వారి నడవడిక చూసి శిక్షాకాలాన్ని తగ్గించే వెసులుబాటు ఇవ్వలేదు. ఆయుధాలను కలిగివున్నందుకు హిందీ సినీ నటుడు సంజయ్ దత్ కి ఐదు సంవత్సరాల కారాగారవాసాన్ని విధించింది. అయితే ఇప్పటికే 18 నెలల కారాగారాన్ని అనుభవించినందువలన ఇంకా మూడున్నర సంవత్సరాలు జైలు శిక్షననుభవిస్తే చాలు. ఆ మారణహోమంలో ఉగ్రవాదులకు సహకరించిన పోలీసులు, కస్టమ్స్ అధికారుల మీద అత్యున్నత న్యాయస్థానం కన్నెర్ర చేసింది. కిరాతకమైన ఆ ఘటనలో పాలుపంచుకున్నవారికి పాకిస్తాన్ లో శిక్షణనిచ్చినట్లుగా నిరూపితమైనందుకు పాకిస్తాన్ పట్ల కూడా నిరసన వ్యక్తం చేసింది. 1993లోని ఈ దారుణమైన సంఘటన పెద్ద ఎత్తున మారణాయుధాల వాడకంతో జరిగినదేనని సుప్రీం కోర్టు భావించింది. ఇలా 2198 పేజీల సుదీర్ఘమైన తీర్పునిచ్చిన సుప్రీం కోర్టు, ఇక జరిగింది చాలు భారతదేశం ఇక సహించదు అన్న సంకేతాలను స్పష్టంగా గట్టిగా ప్రపంచానికి అందిస్తోంది.
ఇటలీ దేశ నావికాధికారులను తిరిగి పంపించని ఇటలీ ప్రభుత్వం మీద సుప్రీం కోర్టు చూపించిన ఆగ్రహానికి ఇటలీ వణికిపోయింది. ఉగ్రవాదులకు పడ్డ ఉరిశిక్షలను మాఫీ చెయ్యటానికి అంగీకరించకుండా ఎప్పటి నుంచో ఉన్న పెండింగ్ క్షమాభిక్షకేసులను కూడా రాష్ట్రపతి తిరస్కరించటం గమనార్హం. హైద్రాబాద్ లోని బాంబు పేలుళ్ళ సంఘటనకు ప్రభుత్వం స్పందించిన తీరు కూడా ఉగ్రవాదాన్ని సమూలంగా పెరికివేయటానికి కంకణం కట్టుకున్నసంకేతాలనే ఇస్తోంది.
ఇరవై సంవత్సరాలనుంచి విచారణ జరుగుతోంది మరణ శిక్షను కారాగారశిక్షగా మార్చమని అర్థించిన ముంబై మారణహోమంలో ప్రధాన నిందితుడు మెమెన్ అభ్యర్థనను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. చాలా కాలం గడిచిందంటూ మరణ శిక్షను జీవిత ఖైదుగా మార్చమని అడిగే హక్కు నిందితులకు ఉండదంటూ పేర్కొంది.
మొత్తానికి ప్రభుత్వం, న్యాయస్థానాలు తీసుకుంటున్న కఠిన చర్యలు, నిర్ణయాలు భారత దేశ మంచితనాన్ని బలహీనతగా తీసుకోకండంటూ చేస్తున్న హెచ్చరికలై, దేశ ప్రజల పరిరక్షణా బాధ్యతను సంపూర్ణంగా తీసుకుంటున్నట్టుగా కనిపిస్తోంది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more