ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తన పీసీసీ పదవికి రాజీనామా చేయనున్నారా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. గత కొన్ని రోజులుగా ఆయన కాంగ్రెస్ ఎవరు అనుభవించలేనంతంగా జోడు పదవులు అనుభవిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల కాంగ్రెస్ జైపూర్ లో నిర్వహించిన చింతన్ శిబిర్ లో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు అయిన రాహుల్ గాంధీ కొన్ని కీలకమైన సూచనలు చేశారు. ఈ సూచనలే బొత్స పీసీసీ పదవికి ఎసరు తెచ్చే విధంగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ నింబధన ప్రకారం ఒక వ్యక్తికి ఒకే పదవి ఉండాలి, పార్టీ పదవులు అనుభవించే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల్లో పోటీ చేయారాదు అని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. దీనికి తోడు బొత్స అనుభవిస్తున్న జోడు పదవుల పై కూడా కాంగ్రెస్ లో తీవ్రమైన చర్చ జరుగుతుంది. ఈ నిబంధనులు ఖచ్చితంగా అమలు చేస్తే బొత్స ఒక పదవిని వదుకోవాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి వస్తే బొత్స పీసీసీ పదవిని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే... ఒకవేళ పీసీసీ పదవిలో బొత్స కొనసాగితే, 2014 ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా పోటీచేసే అవ కాశం కోల్పోతారు. గత కొంతకాలంగా ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొంటున్న బొత్స ఒకసారి లోక్సభకు, పలుమార్లు రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు. పీసీసీలో ఉంటే ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న సెగ్మెంట్నుంచి ఆయన పోటీ చేసే అవకాశం కోల్పోతారు. అలాకాకుండా మంత్రిగా కొనసాగితే సాధారణ ఎన్నికల వరకు పదవిలో ఉంటూ, ఎమ్మెల్యేగా పోటీచేయవచ్చని ఆయన భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో పీసీసీ చీఫ్ పదవికి బొత్స రాజీనామా చేయాలని, ఈ విషయంపై ఆయన సీరియస్గా ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ లెక్కన చూస్తే బొత్స త్వరలో పీసీసీ పదవికి గుడ్ బై చెబుతారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more