యూపీఏ సర్కార్ నుంచి డీఎంకే వైదొలిగింది. శ్రీలంకలో తమిళుల వ్యవహారంపై యూపీఏ వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏకంగా ప్రభుత్వం నుంచి వైదొలుగుతున్నట్టు డీఎంకే ప్రకటించింది. డీఎంకేకు చెందిన ఐదుగురు మంత్రులు కేంద్ర కేబినెట్ నుంచి రాజీనామా చేస్తారని పార్టీ అధ్యక్షుడు కరుణానిధి ప్రకటించారు. మంత్రులు రాజీనామా లేఖల్ని ప్రధానికి అందజేసే అవకాశం ఉంది. చెన్నైలో ఏర్పాటు చేసిన పార్టీ అత్యవసర సమావేశంలో డీఎంకే ఈ నిర్ణయం తీసుకుంది. డీఎంకే నిర్ణయంతో యూపీఎ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. లోక్‑సభలో డీఎంకేకు 18మంది ఎంపీలున్నారు. డీఎంకే వైదొలగటంతో యూపీఏ బలం 230కి పడిపోయింది. డీఎంకే నిర్ణయంతో యూపీఏ సర్కారు ఇరకాటంలో పడింది. యూపీఏలో రెండో అతి పెద్ద భాగస్వామి అయిన డీఎంకే యూపిఏకు షాకిచ్చింది. యూపీఏ ప్రభుత్వం నుంచి డీఎంకే వైదొలగడం వల్ల యుపిఏ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం స్పష్టం చేశారు. యుపిఏ ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఉందని, అధికారంలో కొనసాగుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కరుణానిధి డిమాండ్లను పరిశీలిస్తున్నామని, మిత్రపక్షాలతో చర్చలు జరుపుతున్నామని చిదంబరం పేర్కొన్నారు.
యూపీఏ ప్రభుత్వానికి తాము మద్ధతు ఉపసంహరించుకుంటున్నామని యూపీఏ భాగస్వామ్య పక్షం డీఎంకే ప్రకటించడంపై కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికిప్పుడు ప్రభుత్వం పడిపోయే ప్రమాదమేమీ లేదన్నారు. యూపీఏకు కావాల్సిన సంఖ్యా బలం ఉందని ఆయన తెలిపారు. శ్రీలంక తమిళల అంశంపై పార్లమెంట్‑లో తీర్మానానికి సంబంధించి డీఎంకేతో చర్చిస్తున్నామని చిదంబరం పేర్కొన్నారు. కరుణానిధి తన నిర్ణయంపై పునరాలోచించే సూచనలు ఉన్నాయని చిదంబరం ధీమా వ్యక్తం చేశారు.ఇప్పటి వరకు లోక్సభలో యుపిఏ ప్రభుత్వానికి 248 మంది సభ్యుల మద్దతు ఉండేది. డిఎంకేకు చెందిన 18 మంది సభ్యుల మద్దతు ఉపసంహరణతో యుపిఏ సంఖ్యాబలం 230కు పడిపోయింది. కాగా, యూపీఏకు ఎస్పీ, బీఎస్సీతో పాటు ఆర్జేడీ, జేడీఎస్, మరో తొమ్మిది మంది స్వతంత్రులు బయటి నుంచి మద్దతిస్తున్నారు. లోక్సభలో యూపీఏ భాగస్వామ్య పక్షాల బలబలాలు...
యూపీఏకు లోపల నుండి మద్ధతుఇచ్చేవి:
1. కాంగ్రెస్ - 205
2. ఎన్సీపీ - 9
3. ఆర్ఎల్డీ - 5
4. ఇతరులు - 11
యూపీఏకు బయట నుంచి మద్దతు కొనసాగించేవి:
1. ఎస్పీ - 22
2. బీఎస్పీ - 21
3. ఆర్జేడీ - 4
4. జేడీఎస్ - 3
5. స్వతంత్రులు - 9
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more