హెలీ స్కామ్లో ఇప్పుడిప్పుడే కొత్తగా అనేక మంది బయటపడుతున్నారు. అగస్టా- వెస్ట్లాండ్ వివిఐపి హెలికాప్టర్ల కొనుగోలు కుంభకోణం తీగలాగితే డొంక కదులుతున్న చందంగా ఉంది. ఈ కుంభకోణం వెనుక మాజీ ఎయిర్ఛీఫ్ మార్షల్ ఎస్ పి త్యాగి, ఆయన సమీప బంధువులు ఉన్నట్లు, మార్గదర్శకాలు మార్చి అసలు వేలంలో పాల్గొనడానికి అర్హత లేని ఇటలీ కంపెనీ ఈ కాంట్రాక్టును కైవసం చేసుకునేలా సహకరించినట్లు త్యాగీపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే జాతీయ ఆంగ్ల వార్తా ఛానెల్ ఎన్డిటివి జరిపిన దర్యాప్తులో పుట్టలోని అనేక పాములు బయటకు వస్తున్నాయి. ఈ కేసులో ఇటలీ కంపెనీకి అనుకూలంగా వ్యవహరించిన వారిలో త్యాగి ఒక్కరే కాకుండా ఇంకా అనేకమంది ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది.
అప్పటి జాతీయ భద్రతా దళాల సలహాదారు, ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ గవర్నర్గా ఉన్న ఎంకె నారాయణన్, అప్పటి ప్రత్యేక రక్షణ గ్రూప్ అధిపతి, ప్రస్తుతం గోవా గవర్నర్గా ఉన్న బివి వాంఛూ, ప్రస్తుత రక్షణ శాఖ కార్యదర్శి, అప్పటి సంయుక్త కార్యదర్శి శశికాంత్ శర్మకూ ఈ వ్యవహారంలో సంబంధం ఉందని ఆ దర్యాప్తులో వెల్లడైంది. 2004 నవంబర్ నుండి 2006 సెప్టెంబర్ వరకు కనీసం ఆరుగురు ఉన్నత స్థాయీ సమావేశాలు జరిగాయని తెలిసింది. పిఎంఒ, రక్షణ శాఖ, ఎస్పిజి ప్రతినిధులు, భారత వైమానిక దళం ప్రతినిధులు కూడా ఈ సమావేశాల్లో పాల్గొన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఆ సమావేశం తరువాత రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ జారీ చేశారు. ఈ సమావేశాల్లో ఆగస్టా- వెస్ట్లాండ్ కంపెనీ పోటీలో పాల్గొనేందుకు అనుమతించాలని నిర్ణయించారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more