రాజమండ్రి కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ లోక్ సభలో ఉత్తర భారత ఎంపీలకు షాకిచ్చారు. తెలుగువాడి సత్తా ఏమిటో వారికి రుచిచూపించారు. తెలుగు అంటే ఏమిటో ఉత్తర భారత ఎంపీలకు అర్దమయ్యే విధంగా చెప్పినట్లు తెలుస్తోంది. హిందీలో మాట్లాడాలంటూ తన తెలుగు ప్రసంగాన్ని అడ్డుకున్న పలువురు ఉత్తర భారత ఎంపీలకు రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ లోక్సభలో క్లాస్ తీసుకున్నారు. ‘మాతృభాషలో మాట్లాడటాన్ని వ్యతిరేకించటం అంటే కన్న తల్లిని వ్యతిరేకించటంతో సమానం, మీకు మీ మాతృభాష ఎంత ముఖ్యమో మాకు కూడా మా మాతృబాష అంతే ముఖ్యం’ అంటూ ఆయన హిందీలో ప్రసంగించాలన్న ఉత్తర భారత ఎంపీల డిమాండ్ను తోసిపుచ్చారు. లోక్సభ జీరో అవర్లో సివిల్ సర్వీస్ పరీక్షలకు ఇంగ్లీష్ భాషను నిర్బంధం చేయటంపై జరిగిన చర్చలో ఉండవల్లి అరుణ్కుమార్ తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించారు. అయితే ఉత్తర భారత దేశానికి చెందిన పలువురు ఎంపీలు దీన్ని వ్యతిరేకిస్తూ మీరు హిందీలో మాట్లాడితే మాకు కూడా అర్థమవుతుందని సూచించారు. దీనికి ఉండవల్లి అరుణ్కుమార్ బదులిస్తూ ‘మీరు హిందీని ప్రేమించినట్లే మేము తెలుగు,తమిళం, కన్నడ, మలయాళం,పంజాబీ తదితర ప్రాంతీయ భాషలను ప్రేమిస్తాము, తెలుగు నా మాతృ భాష, మాతృభాషలో మాట్లాడటాన్ని మీరెలా వ్యతిరేకిస్తారు’ అని నిలదీశారు. మాతృమూర్తి భగవంతుడితో సమానం, మాతృమూర్తితో సమానమైన మాతృభాషలో మాట్లాడేందుకు ఇష్టపడే వారిని వ్యతిరేకించటం అంటే భగవంతుడిని వ్యతిరేకించటంతో సమానమంటూ ఉండవల్లి వారి నోళ్లు మూయించారు.
అంతేకాకుండా యుపిఎస్సి నోటిఫికేషన్ పెద్ద కుట్ర. దీన్ని ఎదుర్కొంటామని ఆర్జెడి అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. ప్రాంతీయ భాషల్లో సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయకుండా చూసేందుకు ఇలాంటి కుట్ర పన్నారని దుయ్యబట్టారు. వంద మార్కుల ఇంగ్లీష్లో ఉత్తీర్ణులు కాకపోతే సివిల్ సర్వీసులకు ఎన్నిక కాలేరు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు, ప్రాంతీయ భాషల్లో చదువుకున్న వారిని దెబ్బ తీసేందుకే యూపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. దీన్ని ఉపసంహరించు కోవాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. ‘ఈ దేశం ప్రాంతీయ భాషల వారిది. ఇంగ్లీష్ మాట్లాడే వారిది కాదు. ఈ దేశం యూపీఎస్సీ అధికారులది అసలే కాదు’ అంటూ లాలూ ప్రసాద్ యాదవ్ ఆవేశంతో అన్నారు. రాష్ట్ర కాంగ్రెస్కు చెందిన ఉండవల్లి అరుణ్కుమార్ మాట్లాడుతూ యూపీఎస్సీ తీసుకున్న నిర్ణయం ఎవ్వరికీ మేలు చేయదన్నారు. మేలు చేయని నోటిఫికేషన్ను ఎందుకు అమలు చేయాలని నిలదీశారు. ‘ఇంగ్లీష్ మాట్లాడే వారు ఇతర భాషలు మాట్లాడే వారికంటే అధికులనే అభిప్రాయం ఎంతమాత్రం మంచిది కాదు. ఈ ఆలోచనా విధానమే తప్పు’ అని ఆయన స్పష్టం చేశారు. మాతృ భాషలో పరీక్ష రాసే అధికారం ఉండాల్సిందేనన్నారు. భాష ఆధారంగా మేధస్సు ఉండదంటూ ఉండవల్లి అరుణ్కుమార్ తమిళనాడుకు చెందిన సీనియర్ నాయకుడు కమరాజ్ నాడార్ను ఉదహరించారు. కేవలం తమిళం మాత్రమే తెలిసిన నాడార్ను అప్పటి ప్రధానమంత్రి జవాహర్ లాల్ నెహ్రు సైతం సలహాలు అడిగేవారని ఆయన చెప్పారు. ఇంగ్లీష్ మాట్లాడే వారికి ఎక్కువ తెలివి ఉంటుందనేది నిజం కాదన్నారు. ఇంగ్లీష్ను ఉన్నత స్థానంలో కూర్చోబెట్టాల్సిన అవసరం ఎంతమాత్రం లేదని ఉండవల్లి సూచించారు. ఇంగ్లీష్తోపాటు మన దేశానికి చెందిన ముఖ్యమైన భాషలు ఉండాల్సిందేనని ఆయన తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more