అసెంబ్లీలో టీఆర్ఎస్ పార్టీ , వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు కలిసి అవిశ్వాసం తీర్మానం అర్థరాత్రి విగిపోయింది. అవిశ్వాస తీర్మానం ఇంత త్వరగా విగిపోతుందని ఏ రాజకీయ నాయకులు అనుకోలేదు. కానీ అవిశ్వాస తీర్మానం ఒకరోజు చర్చతో వీగిపోతుందన్న వార్త విని అమితంగా సంతోషించిన వ్యక్తి ఎవరు? ప్రభుత్వాధినేత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అనుకుంటే పప్పులో కాలేసినట్టే! ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అంతకు వంద రెట్లు సంతోషించారన్నది సన్నిహిత వర్గాల కథనం. పాదయాత్రలో వుండి సభకు హాజరు కాకున్నా దూర నియంత్రణతో సకలం నడిపించిన చంద్ర బాబు సంతోష సంభరితులయ్యారని ఈ వర్గాలు తెలిపాయి. తన దగ్గర వున్నవారితో ఈ సంతోషం పంచు కోవడమే గాక పార్టీ తరపున శాసనసభను కుదిపేసిన మోత్కుపల్లి నర్సింహులును కూడా అభినందనలతో ముంచెత్తడం ఇందుకు నిదర్శనమన్నారు. చంద్రబాబు సంతోషానికి రెండు కారణాలున్నాయి. మొదటిది- అవిశ్వాస తీర్మానం శిరోభారం ఒక్క రోజుతో తేలిపోవడం. రెండవది- ఈ ఘట్టంలో హరీశ్వర్ రెడ్డి మినహా మరెవరూ విప్ను ధిక్కరించి తిరుగు బాటు చేయకపోవడం. అవిశ్వాస తీర్మానం రాకూడదని వచ్చినా హౌరాహౌరి ఓటింగు జరక్కూ డదని చంద్ర బాబు మనసారా కోరుకున్నారు.
అందుకే అందరూ విమర్శిస్తున్నా అభిశంసనలు కురుస్తున్నా టిఆర్ఎస్ వై ఎస్ఆర్సిపిలతో విమర్శలు చేసి తటస్థ వైఖరి తీసుకున్నారు. ఇందు కోసం విప్ కూడా జారీ చేశారు. తమ వాళ్లు ఫిరాయిస్తారన్న భయం ఒకవైపు, కాంగ్రెస్ వారు ఫిరాయించి అవిశ్వాసం నెగ్గితే ఎలాగన్న భయం మరో వైపు తెలుగు దేశంను వెన్నాడాయి.. ఈ ఆత్మ రక్షణ వ్యూహం దీర్ఘకాలంలో నష్టదాయకమని పార్టీ నేతలు ఎంత చెప్పినా నిర్ణయం మార్చుకోలేదు.అయితే ఓటింగు వచ్చే సరికి వ్యతిరేకిస్తామన్న ఆశ లేదా అంచనా వారిలో కొందిరి ఆఖరి వరకూ వుండింది గాని విప్ జారీతో అవన్నీ అడుగంటాయి. ప్రతిష్ట కోసం పాకులాడటం కన్నా పార్టీ బలం కాపాడుకోవడమే కీలకమని నిర్ణయానికి వచ్చి నిస్సంకోచంగా అవిశ్వాసం నుంచి విడగొట్టుకున్నారు. శాసనసభలో దీనిపై చర్చ సందర్భంలోనూ తెలుగుదేశం వ్యూహాత్మకంగానే మోత్కుపల్లి నరసింహులును రంగంలోకి దించిందని స్పష్టమైంది. కెసిఆర్ లేదా మరెవరిపైన తీవ్రంగా దాడి చేయాలన్నా చంద్రబాబు ఆయననే వినియోగిస్తుంటారు. వాగ్ధాటికి తోడు సామాజిక నేపథ్యం ఆయన విమర్శకులకు ఆటంకమవుతుందనేది తెలిసిన విషయమే.
ఈ చర్చలో మోత్కుపల్లి ప్రభుత్వాన్ని నామకార్థంగా విమర్శిస్తూనే దాడి ప్రధానంగా జగన్పైనా ఆయన తండ్రి వైఎస్పైనా ఎక్కుపెట్టడం తర్క విరుద్ధమైనా తమ పరువు కాపాడిందని తెలుగుదేశం నేతలు సంతోషిస్తున్నారు. ప్రజల్లో పలుచన అయినా సభలో గట్టెక్కగలిగామని వారు వ్యాఖ్యానిస్తున్నారు. అద్యక్షుని అభినందనలు కూడా అందడంతో అలాటి వారు మరింత పొంగిపోతున్నారు. అయితే ఈ ఆత్మరక్షణ వ్యూహం అస్తిత్వానికే భంగకరమని ఆందోళన చెందే వారు కూడా చాలామంది కనిపించారు. వారిలో కొందరు పార్టీనుంచి నిష్క్రమించే అవకాశాలు ఇంకా పెరిగినా అశ్చర్యం లేదన్న అంచనాలు కూడా వున్నాయి. అవే చంద్రబాబును వెనుకంజకు కారణమైనాయి. నెల రోజులు లేదా పదిహేను రోజులు అవిశ్వాసంపై చర్చ జరగకుండా ఒక్కరోజులో తేలిపోయింది గనక తమపై దాడికి అవకాశం తగ్గిందన్నది వారికి ఆనందం కలిగించింది!
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more