కర్ణాటకలో స్థానిక సంస్థల ఎన్నికల్లో గాలి కోట సామ్రాజ్యం కుప్పకూలింది. గాలికి ఎదురుగాలి వీచింది. అక్కడ జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గాలి వర్గానికి, అధికార పార్టీ బీజేపీకి గట్టి దెబ్బతగిలింది. ఈ రెండు పార్టీలకు ధీటుగా కాంగ్రెస్ పార్టీ తన హవాని కొనసాగించింది. ఇక ముఖ్యంగా బళ్లారిని కాంగ్రెస్ చేజిక్కించుకుంది.. కర్ణాటకలో కొత్తగా గాలి జనార్దన రెడ్డి, బీ శ్రీరాములు నెలకొల్పిన బీఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికల్లో బోల్తాపడింది. బళ్లారి కార్పొరేషన్లో బీఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా పరాజయాన్ని చవిచూసింది. 35 నగర పాలిక వార్డుల్లో కేవలం ఆరింటిని గెలుచుకుంది. 26 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అఖండ మెజారిటీతో గెలుపొంది నగర పాలిక కార్యాలయంపై తన జెండా పాతింది. సొంత జిల్లా అయిన బళ్లారిలోనే బీఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతు కావడం చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ ఎన్నికల్లో విపక్ష కాంగ్రెసు పార్టీ మొదటి స్థానంలో ఉండగా, రెండో స్థానంలో మరో ప్రతిపక్ష పార్టీ జెడిఎస్ ఉంది. అధికార పార్టీ ముక్కలు కావడంతో ఆ ప్రభావం పడింది.
గాలి అనుచరుడు శ్రీరాములు పెట్టిన బిఎస్సార్ పార్టీ తుడిచి పెట్టుకు పోవడం ఆ పార్టీ జీర్ణించుకోలేకపోతుంది. కర్నాటకలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ హవా వీయడంతో కాంగ్రెసు క్యాడర్లో ఉత్సాహం తొణికిసలాడుతోంది. బళ్లారి నగర పాలికకు కార్పొరేట్ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆ పార్టీ ప్రధాన నాయకుల మధ్య సమన్వయం కుదరలేదని తెలిసింది. ఒక ఎమ్మెల్యే చెప్పిన అభ్యర్థులకు కాకుండా మరో ఎమ్మెల్యే తన అనుకూలురైన వారికి ఎక్కువగా టిక్కెట్లు ఇప్పించుకున్నారని అంటున్నారు. ఏది ఏమైన గాలి సామ్రాజ్య పతనం ప్రారంభం అయిందని అక్కడి రాజకీయ వర్గాలు అనుకుంటున్నాయి. మరి వచ్చే ఎన్నికల్లో పార్టీ పరిస్థితి ఇలానే ఉంటే కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more