Budget impact on nris

finance minister chidambaram, budget for 2013-14, non residence indians, budget impact on nris

budget impact on nris

budget-impact-on-nris.png

Posted: 03/05/2013 02:00 PM IST
Budget impact on nris

chidambaram2013-14 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం రూపొందించిన భారత ప్రభుత్వ ఖజానా ఆదాయ, ఖర్చుల అంచనా (బడ్జెట్) వలన ప్రవాస భారతీయుల (ఎన్ఆర్ఐ) మీద పడుతున్న ప్రభావం.

1.    అతి సంపన్నుల నుంచి ఎక్కువ పిండటం

కోటి రూపాయలు అంతకు మించిన సంవత్సరాదాయం ఉన్న వారి నుంచి వచ్చే సంవత్సరం నుంచి పది శాతం అదనపు పన్ను (సర్ ఛార్జ్).  ఇది ప్రస్తుతం ఈ సంవత్సరం వరకే పరిమితమైవుంది బాగానే వుంది కానీ, ప్రవాస భారతీయుల విషయంలో భారత్ లో వారి ఆదాయ వనరులైన వారికి ఇక్కడ లభించే అద్దెలు కానీ, పెట్టుబడుల మీద వచ్చే వడ్డీ కానీ, ఆస్తులను అమ్మటం వలన వచ్చిన లభాలు కానీ ఈ పరిధిలోకి వస్తాయి. 

నాకు మరి అదనపు ఆదాయం కావాలి.  నేను అతి సంపన్నుల గాక మరెవరి లక్ష్యం చేయగలను అంటారు చిదంబరం.  దేశంలో కోటి రూపాయల ఆదాయం ఉన్నట్టుగా ఆదాయాన్ని ప్రకటిస్తున్నవారు కేవలం 42800 మంది మాత్రమే ఉన్నారు.  నేను వారి మీదనే 10 శాతం అదనపు భారాన్ని మోపుతున్నాను అన్నారు చిదంబరం తన బడ్జెట్ ప్రసంగంలో. 

2.    బడ్జెట్ మీద ప్రసంగాల చివర్లో ప్రత్యక్ష పన్నుల నిబంధనలను ప్రవేశపెట్టబోతున్నారు.

దేశ ఆర్థిక వ్యవహారాల మీద సలహాలనందించే  స్టాండింగ్ కమిటీ నివేదికను ఆర్థిక మంత్రి పునఃపరిశీలన చెయ్యబోతున్నారు.  కమిటీ లోగడ చేసిన కొన్ని సిఫారసులు ప్రవాస భారతీయుల పట్ల ఎక్కువ కఠిన వైఖరిని కలిగివున్నాయి.  ఉదాహరణకు, ఒక ఆర్థిక సంవత్సరంలో 60 రోజుల కంటే ఎక్కువ కాలం కానీ లేదా బడ్జెట్ ప్రవేశపెడుతున్న ఆర్థిక సంవత్సరానికి ముందు నాలుగు సంవత్సరాలలో 365 రోజులకంటే ఎక్కువ కాలం కానీ భారత్ లో నివసించినట్లయితే వారికి విదేశాలలో వచ్చిన రాబడితో సహా మొత్తం ఆదాయం మీద పన్ను కట్టవలసివుంటుంది.  వ్యాపార లేక వ్యక్తిగత కారణాల రీత్యా  తరచుగా భారత్ కి వచ్చే ప్రవాసీయులను ఈ సిఫారసు చాలా ప్రభావితం చేస్తుంది. 

3.    విదేశాల నుంచి కొనుగోలు చేసి భారత్ కి తీసుకుని వచ్చే బంగారం పరిమితి అంతకు ముందు పురుష ప్రయాణీకులకు 10000 రూపాయల వరకు, మహిళా ప్రయాణీకులకు 20000 వరకూ అనుమతిస్తుంటే దాన్ని 50000, 100000 రూపాయలకు పెంచారు. 

4.    ప్రవాసీయులు తమ ఆదాయంలో ప్రవాసభారత హోదాను కలిగించుకోవటానికి టాక్స్ రెసిడెన్సీ సర్టిఫికేట్ (టిఆర్ సి) ని సమర్పించటాన్ని చిదంబరం తప్పనిసరి చేసారు.  అంతేకాదు, ఆదాయ పన్ను రాయితీకి అర్హులవటానికి ఆ సర్టిఫికేట్ కూడా పూర్తిగా సరిపోదంటూ సన్నాయి నొక్కు ఒకటి నొక్కారు.  అయితే టిఆర్ సి కాకుండా ఇంకా ఏమేం కావాలన్నదానికి వివరణనివ్వలేదు. 

5.    భారత్ లో ప్రవాస భారతీయులెవరైనా సాంకేతిక పరిఙానాన్ని అందించిన దానిమీద రాయల్టీ పొందుతున్నట్లయితే, ఇంతకు ముందు దానిమీద 10 శాతం పన్ను విధించేవారు.  దాన్ని చిదంబరం 25 శాతానికి పెంచారు. 

6.    దీర్ఘ కాలిక పెట్టుబడుల బాండ్స్ లో విదేశ కరెన్సీని స్వాగతిస్తూ, దాన్ని పెంచటం కోసం దాని మీద ప్రవాసీయులకు వచ్చే వడ్డీ మీద ఆదాయ పన్నుని పోయిన సంవత్సరం 20 నుంచి 5 శాతానికి తగ్గించారు.  దాన్ని చిదంబరం ఈ సంవత్సరానికి కూడా కొనసాగించారు. 

7.    బ్యాంక్ లేక గృహ ఋణాల సంస్థల నుంచి తీసుకున్న ఋణం మీద వడ్డీ నుంచి ప్రస్తుతం ఆదాయ పన్ను దృష్ట్యా ఒకటిన్నర లక్షల రూపాయల వరకూ తగ్గించే నియమాన్ని అనుసరిస్తున్నారు.  అయితే ఈ సంవత్సరంలో కొత్తగా మొదటి సారి భారత్ లో గృహ నిర్మాణం కోసం తీసుకున్న ఋణం మీద వడ్డీ విషయం అదనం మరో లక్ష వరకూ తగ్గించటానికి బడ్జెట్ లో ప్రతిపాదన జరిగింది.  ఇది కేవలం మొదటి సారి భారత్ లో తీసుకుంటున్న గృహ ఋణం మీద మాత్రమే.  ఒక వేళ ఈ సంవత్సరం ఆ అదనపు లక్ష రూపాయలను వాడుకోలేకపోతే అందులో మిగిలినదాన్ని వచ్చే సంవత్సరం ఉపయోగించుకునే వెసులుబాటు కూడా కలిగించారు. 

8.    చిన్న తరహా మధ్య తరహా ప్రవాస భారత వ్యాపార వేత్తలు లఘు మధ్య తరహా పరిశ్రమల (ఎస్ ఎమ్ ఇ) ఎక్స్ చేంజ్ లో లిస్టింగ్ చేసుకోవచ్చు అనే ఆకర్షణీయమైన ప్రతిపాదనను కూడా చిదంబరం ఈ సంవత్సరం బడ్జెట్ లో చేసారు.  ప్రస్తుతం అనుసరిస్తున్న విధానంలో, ఐపిఓ (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) ఉన్నవారికే ఈ సదుపాయం ఉంది.  కానీ ఈ సంవత్సరం నుంచి కొత్తగా స్థాపించిన కంపెనీలకు, అది కూడా పబ్లిక్ భాగస్వామ్యం (ఐపిఓ) లేకపోయినా ఎస్ఎమ్ ఇ ఎక్స్ చేంజ్ లో లిస్టింగ్ చేసుకోవచ్చు.  అయితే ఈ ప్రయోజనం కేవలం సూచించిన పెట్టుబడిదారులకు మాత్రమే పరిమితమైవుంటుంది. 

భారత్ లో వ్యాపారం చెయ్యటం చాలా సులువు ఉభయతారకంగా ఉంటుందని, మా ప్రభుత్వ విధానాలను ఎప్పిటికప్పుడు వివరిస్తూ, పెట్టుబడిదారుల మనసుల్లో పన్నుల విషయంలో భయాలు, శంకలు, విశ్వాసరాహిత్యాలను తొలగించే ప్రయత్నం చేస్తామని కూడా చిదంబరం తెలియజేసారు. 

దీనివలన, భారత్ కి తిరిగివచ్చి ఇక్కడ తమ సొంత వ్యాపార సంస్థను స్థాపించదలచుకున్న ప్రవాస భారతీయులకు ఇది ఎంతో ఉపయోగయోగ్యంగా ఉంటుంది.

-శ్రీజ


 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  General v k singh talks on indo pak relation and kashmir
Man immolates himself for cause of tamils in sri lanka  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more