నిన్నటి వరకు మాకు తెలంగాణ కావాలి. హైదరాబాద్ లేకుండా తెలంగాణ ఇస్తే , మేం తీసుకోం, తలలేని తెలంగాణ మాకెందుకు అన్నవారే.. ఇప్పుడు తెలంగాణ పై కొత్త పాట పాడుతున్నారు. తెలంగాణ నాయకుల్లో ఇంత త్వరగా ఇలాంటి మార్పు రావటం పై అనేక అనుమానాలు వస్తున్నాయి. తెలంగాణ నేతలు ఎందుకు మారిపోతున్నారు? తెలంగాణ సమస్యను పక్కన పెట్టి ఇప్పుడు ఈ కొత్త రాజకీయం ఏమిటి? దీని వలన ఎవరికి ఉపయోగం ? అనే ప్రశ్నలు తెలంగాణ ప్రజలను వేధిస్తున్నాయి. టీఆర్ఎస్ పార్టీ మీద తెలంగాణ ప్రజలకు నమ్మకం పూర్తి పోయిందని అంటున్నారు. ఇప్పుడు తెలంగాణ నాయకుల దోరణి ఇలా మారిపోవటం ప్రజలు మండిపడుతున్నారు. టీడీప నాయకులు చెప్పిన మాటలు నిజం అయ్యేలా ఉందని తెలంగాణ ప్రజలు అంటున్నారు. దేశానికి హైదరాబాద్ను రెండవ రాజధానిగా చేయాలన్న డిమాండ్కు క్రమేపీ మద్దతు పెరుగుతోంది. నిన్న, మొన్నటి వరకు సీమాంధ్ర ప్రాంత నేతలు మాత్రమే ఈ వాదన వినిపించగా, ఇప్పుడు తెలంగాణ ప్రాంత నేతలు సైతం రెండవ రాజధాని ప్రతిపాదనకు మద్దతునిస్తున్నారు. దేశానికి హైదరాబాద్ను రెండవ రాజధానిగా చేయాలని గతంలో రాజ్యాంగ నిర్మాత డా.బాబా సాహేబ్ అంబేద్కర్ చేసిన ప్రతిపాదనను టీడీపీ అధికార ప్రతినిధి సుధీష్ రాంబొట్ల తొలుత తెరపైకి తీసుకురాగా, ఆ పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి మద్దతు పలికారు. ఇద్దరు సీమాంధ్ర ప్రాంత నేతలే కావడంతో ఈ వాదన వెనుక కుట్రకోణం దాగి ఉందని తెలం గాణ వాదులు విమర్శించారు. అయితే తాజాగా రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ప్రస్తావిస్తూ టీడీఎల్పీ ఉపనేత మోత్కుపల్లి నర్సింహులు, దేశానికి హైదరాబాద్ను రెండవ రాజధాని చేస్తే రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని పేర్కొనడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇప్పటికే రెండవ రాజధాని డిమాండ్ కు సామాజిక టీ- జేఏసీ నేతలు మద్దతు ప్రకటించారు. ఈ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు వారు పెద్ద ఎత్తున ప్రచారాన్ని చేపట్టారు. దేశ రెండవ రాజధానిగా హైదరాబాద్ను ప్రకటిస్తే తెలంగాణ సమస్యను సునాయాసంగా పరిష్కరించే అవకాశాలున్నాయని టీడీపీ అధికార ప్రతినిధి సుధీష్ రాంబొట్ల అంటున్నారు. కేంద్రం సత్వరమే రెండవ రాజధానిగా హైదరాబాద్ను ప్రకటిస్తే, ప్రాంతాలకతీతంగా అందరు టీ-ఏర్పాటుకు సహకరిస్తారన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. సానుకూలంగా స్పందించి కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో పాటు, రాజధాని శివారు ప్రాంతాలు కూడా శరవేగంగా అభివృద్ధి చెందే అవకాశముందని సుధీష్ రాంబొట్ల వెల్లడించారు. ఇప్పుడిప్పుడే తాము చేస్తున్న వాదనలోని వాస్తవాలను అంతా గ్రహిస్తున్నారన్నారు. అందుకే ప్రాంతాలకతీతంగా మద్దతునిస్తున్నారని సుధీష్ రాంబొట్ల పేర్కొన్నారు. ఇప్పటికే ఈ వాదనకు సామాజిక జేఏసీ మద్దతునిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మోత్కుపల్లి చేసిన వ్యాఖ్యలతో దేశానికి హైదరాబాద్ను రెండవ రాజధాని చేయాలన్న డిమాండ్ ఊపందుకునే అవకాశాలున్నాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తు న్నారు. ఒక వైపు తెలంగాణ సాధన కోసం ఉద్యమిస్తూనే, మరోవైపు దేశానికి హైదరాబాద్ను రెండవ రాజధాని చేయాలని కేంద్రంపై ఒత్తిడి పెంచే దిశగా సామాజిక టీ-జేఏసీ నేతలు రెండంచెల ఉద్య మానికి సిద్ధమవు తున్నారు. ఇప్పటి కే మేధావులు, విద్యార్థి, ప్రజాసంఘాల నేతలతో ఈ అం శంపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. త్వర లోనే సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత రాజకీయ నేతలతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించాలని యోచిస్తున్నా రు. హైదరాబాద్ను దేశానికి రెండవ రాజధాని చేయాలన్న నేతల డిమాండ్ ఏ మేరకు విజయవంతమవుతుందో కాలమే సమాధానం చెబుతుంది.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more