మన మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి .. రాష్ట్రం పై కొంచెం ఇష్టం-కొంచెం కష్టంగా ప్రవర్తించారు. రైల్వే బడ్జెట్ దేశ, రాష్ట్ర ప్రయోజనాల మాట అటుంచితే. కేంద్ర రైల్వే సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి జిల్లాకు చెందినవారు కావడంతో జిల్లా ప్రజలు రైల్వే ప్రాజెక్టులపై ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షల మేర కాకపోయినప్పటికీ రైల్వే బడ్జెట్ లో జిల్లాకు సంబంధించి కొన్ని కొత్త ప్రాజెక్టులతో పాటు కొన్ని పెండింగ్ ప్రాజెక్టులకు మాత్రమే మోక్షం లభించింది. కొట్ల సూర్య ప్రకాష్ రెడ్డి కేంద్ర రైల్వే సహాయమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కర్నూలు రైల్వే స్టేషన్ స్థాయి కర్పూలు టౌన్ నుంచి కర్నూలు సిటిగా పెరుగుతుందని జిల్లా ప్రజలు ఆశించారు. గత కొన్ని దశాబ్ధాలుగా నత్తనడక సాగుతున్న నంద్యాల, ఎర్రగుంట్ల రైల్వేలైన్ పనులు వేగవంతమవుతాయని అందరూ భావించినప్పటికీ ఆ లైన్ పనులు వేగవంతం చేసేందుకు ప్రత్యేకంగా తీసుకున్న చర్చలేవీ బడ్జెట్ లో లేకపోవడం జిల్లా వాసులను నిరాశపరిచింది. అయితే కర్నూలుకు రైల్వే వ్యాగన్ వర్క్ షాప్ మంజూరులో కొట్ల మార్క్ కన్పించింది. అదేవిధంగా గతకొన్ని దశాబ్ధాలుగా జిల్లా ప్రజలు ఆకాంక్షిస్తున్న కర్నూలు , హైదరాబాద్ మద్య ఇంటర్ సిటీ ఎక్స్ ప్రేస్ రైలు ను మంత్రి కోట్ల సాధించిన ఘనతగా జిల్లా ప్రజలు భావిస్తున్నారు. అంతేగాకుండా కర్నూలు, నంద్యాల మద్య ప్యాసింజర్ రైలు మంజూరు కూడా ప్రజలు స్వాగతిస్తున్నారు. దాదాపు 17 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీకి చెందిన రైల్వే శాఖ మంత్రి బడ్జెట్ ను ప్రవేశపెట్టడం ఒక ఎత్తయితే సుమారు 20 ఏళ్ల తర్వాత జిల్లాకు రైల్వే బడ్జెట్ లో జిల్లాకు న్యాయం జరిగిందని కోట్ల అంటున్నారు.
అంతేకాకుండా కర్నూల్ జిల్లా మీదుగా వెళ్లే గుంటూరు- గుంతకల్ బ్రాడ్ గేజీ మార్గం కూడా కోట్ల వల్లనే సాధ్యపడింది. నంద్యాల–ఎర్రగుంట్ల కొత్త రైలు మార్గానికి కూడా నాటి ప్రధాని పివి నరసింహరావును ఒప్పించి పివితోనే ఈ పథకం పనులు ప్రారంభింపచేశారు. రైల్వే శాఖ సహాయమంత్రిగా పదవిని చేపట్టినకొట్ల ఆరు నెలలు కూడా గడవకముందే తన అధికారాన్ని ఉపయోగించి కర్నూలు జిల్లాకు రైల్వే వ్యాగన్ వర్క్ షాప్ నుమంజూరుచేయించగలిగారు. మహబూబ్ నగర్- గుత్తి మద్య కర్నూలు మీదుగా డబ్లింగ్ పనులను కూడా మంజూరు చేయించారు. 2013-2014 రైల్వే బడ్జెట్ లో ప్రకటించిన పలు కొత్త రైళ్లలో చెన్నై–నాగర్ సాల్, మంగళూరు- కాచిగూడ ఎక్స్ ప్రెస్ రైళ్ళు కర్నూలు మీదుగా నడిచేవే కావటంతో రైల్వేబడ్జెట్ పై కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తనదైన సొంత జిల్లా ముద్రవేసి జిల్లా ప్రజల రుణం తీర్చుకున్నారన్న అభిప్రాయాలు జిల్లా ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more