Shortage of intelligence personnel

central intelligence, state intelligence, home department, s k shinde

shortage of intelligence personnel

intelligence-shortage.png

Posted: 02/27/2013 12:41 PM IST
Shortage of intelligence personnel

intelligence-staff

నిఘా సంస్థలలో పని చేసేవారి కొరత చాలా ఉందని నిఘా సంస్థలో పనిచేసే సీనియర్ ఆఫీసర్ అన్నారు.  2009 నుంచి పనిచేసేవారి సంఖ్య కేవలం 5 శాతం పెరిగిందని ఆయన అన్నారు.  ఉద్యోగుల కొరత చాలా కాలం నుంచి ఉన్న నేపథ్యంలో 2009 లో అప్పటి కేంద్ర హోం మంత్రి చిదంబరం, 6000 మంది ఉద్యోగులను భర్తీ చెయ్యమని ఆదేశించారు.  దర్యాప్తు సంస్థ సంవత్సరానికి 600 మందికి శిక్షణనిస్తుంది.  కానీ రిటైర్ అయ్యేవారి సంఖ్యతో అది సరితూగలేకపోతోంది.  రాష్ట్రాలలో కూడా అదే పరిస్థితి. 

ఈ నేపథ్యంలో, పోయిన వారంలో హైద్రాబాద్ లో జరిగిన బాంబు పేలుళ్ళ దృష్ట్యా, కేంద్ర హోం శాఖ 3400 కోట్ల రూపాయల వ్యయంతో ఉగ్రవాదాన్ని అరికట్టటానికి జాతీయ స్థాయిలో ఒక సంస్థ (ఎన్ సి టి సి) ను ఏర్పాటు చెయ్యటానికి సిద్ధమవటం దర్యాప్తు సంస్థలలోని ఉద్యోగుల నిరసనకు కారణమవుతోంది.  ఉన్న సంస్థలలో ఉద్యోగులను భర్తీ చెయ్యకుండా కోట్లాది రూపాయలను వెచ్చించి మరో సంస్థను స్థాపించటం ముఖ్యమా అని ప్రశ్నస్తున్నారు. 

ఎలక్ట్రానిక్ మీడియా ద్వార దర్యాప్తులు చెయ్యగల సామర్థం గల ఎన్ టి ఆర్ వో సంస్థ (నేషనల్ టెక్నికల్ రిసెర్చ్ ఆర్గనైజేషన్) తన రాజ్యాన్ని విస్తరించుకుంటోంది కానీ ఆర్థిక లావాదేవీల్లో ఆరోపణలను కూడా ఎదుర్కుంటోంది.  దర్యాప్తు సంస్థలకు సాంకేతిక పరంగా సహాయమందించే సంస్థ అవసరం ఎంతైనా ఉంది కానీ మేము అడిగిన విధంగా మాకు సహాయం లభించటం లేదంటూ సీనియర్ ఉద్యోగి నిరాశని వ్యక్తపరుస్తున్నారు. 

హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే ఎన్ సి టి సి స్థాపన కోసం చేస్తున్న ప్రయత్నాన్ని, ప్రభుత్వం మీద తెస్తున్న ఒత్తిడికి చాలా రాష్ట్రాల నుంచి కూడా వ్యతిరేకత వస్తోంది.  2010 లోనే ఉగ్రవాదాన్ని అరికట్టే సంస్థ స్థాపన జరుగుతుందని అప్పట్లో చిదంబరం కూడా అన్నారు.  కానీ ఎన్ సి టి సి వలన ప్రయోజనమేమిటని దర్యాప్తు సంస్థలోని సీనియర్ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. 

హైద్రాబాద్ బాంబు పేలుళ్ళ ఘటనను ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్న  ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ కూడా సిబ్బంది కొరతను సమస్యగా చెప్తున్నారు.  దిల్ సుఖ్ నగర్, బేగం బజార్, ఆబిడ్స్ ప్రాంతాల్లో దాడి జరిగే అవకాశముందని 2012 లో నిఘా వర్గాల నుంచి సందేశం వచ్చింది.  కానీ ఏం చెయ్యాలి, బాంబులు ఎక్కడెక్కడ పెడతారో కనిపెట్టటానికని వందలాది పోలీసులను ఎంతకాలం గస్తీలో తిప్పుతాం అంటారాయన.  అక్కడే ఉన్న మరో సీనియర్ ఆఫీసర్ కూడా ప్రత్యక్షంగా ఎదురయ్యే సమస్యల గురించి చెప్పారు.  ఆగస్ట్ 2005 లో మావోయిస్ట్ లు శాసన సభ్యుల హత్యలకు పథకాలు వేస్తున్నారని సమాచారం అందింది.  అలా ప్రతి ఆగస్ట్ 15 కీ అందుతోంది.  కానీ ఏం చేస్తాం, అందరికీ భద్రతా ఏర్పాట్లను చెయ్యటానికి అంత మంది సిబ్బంది ఎక్కడినుండి వస్తారు అన్నారు. 

మొత్తం మీద, మరో కొత్త దర్యాప్తు సంస్థను స్థాపించే బదులు, ఉన్నవాటిని మెరుగు పరుస్తూ, సిబ్బందిని పెంచితే పనులూ త్వరగా అవుతాయి, అధిక వ్యయం కూడా తప్పుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kotla surya prakash reddy comments on railway budget
Rail budget disppoints ap again  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more