మాటల రాజకీయ నాయకుడిగా కేసిఆర్ ఎంతో పేరు ఉంది. నిమిషాల్లో నిర్మాణుశ్యం చేయగలడు, అదే నిమిషాలో .. నిప్పు ఆర్పగల శక్తి ఒక కేసిఆర్ మాత్రమే ఉందని అందరి తెలిసిందే. రాజకీయ మేధావి. తిట్లు తిట్టాలన్న కేసిఆరే, ప్రజల చేత జై కొట్టించుకోవాలన్న కేసిఆరే. కలుగులోకి వెళ్లాలన్న మన కేసిఆర్ కేసాద్యం. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఫైట్ చేస్తున్నా విషయం తెలిసిందే. కేసిఆర్ తెలంగాణ కోసం ఒక పార్టీ స్థాపించి, ఉద్యమాలు చేస్తున్నారు. సుమారు పది సంవత్సరాలు దాటిపోయింది. కానీ కేసిఆర్ చాలా మార్పులు వచ్చాయి. పార్టీలో నాయకుల సంఖ్య పెరిగింది. కేసిఆర్ తన కొడుకు, కూతురు, మేనల్లుడు కు పదవులు ఇవ్వటం కూడా జరిగింది. కానీ తెలంగాణ మాత్రం రాలేదు. ఆయనలో బిపి పెరిగిన ప్రతిసారి.. కలుగు నుండి బయటకు వచ్చి, టిడిపి నాయకుల్ని, టిడిపి పార్టీని, కాంగ్రెస్ పార్ట పెద్దలను బండబూతులు తిట్టి మీడియా ముందు హడవుడి చేసి వెళ్లిపోతాడు. ఆతరువాత ఆయన చేసిన వ్యాఖ్యలపై అన్ని రాజకీయ పార్టీల నుండి విమర్శలు రావటం సహజమే. కానీ తెలంగాణ కోసం ఫైట్ చేసినట్లు లేదు. 60 ఏళ్ల కేసిఆర్ తనలోనే ఆవేశాన్ని తగ్గించుకోవటానికే ఇలా చేస్తున్నాడని టీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. తెలంగాణ సమస్య తుది దశకు వచ్చిన సమయంలో కేసిఆర్ ఎందుకు మౌనంగా ఉంటాడు? అసలు ఆయన ఫాంహౌస్ కు ఎందుకు వెళ్లుతున్నారు? అసలు తెలంగాణ పై ఆయన ఉద్దేశం ఏమిటి? తెలంగాణ కోరుకుంటున్నాడా? లేక సమైక్యాంగా ఉండాలని కోరుకుంటున్నారా? అనే ప్రశ్నలు టీఆరఎస్ నాయకులను వేధిస్తున్నా ప్రశ్నలు? ఒకసారి .. లగడపాటికి ఐ లవ్ యు చెబుతారు. మరో సారి బిజేపితో కలిసిపోయి.. కమలాన్ని చెవిలో పెట్టుకుంటారు. మరో సారి కారు దిగి, టిడిపి సైకిల్ ఎక్కి.. చంద్రబాబు తో ప్రయాణిస్తారు? మరో సోనియా గాంధీ దేవత అని అంటాడు, మరోసారి .. తెలంగాణ ఇస్తే.. టీఆర్ఎస్ పార్టీని .. కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని మీడియా ముందు బల్లగుద్ది చెబుతారు. కేసిఆర్ వ్యవహార శైలిలో చూసి టీఆర్ఎస్ నాయకులకు మైండ్ బ్లాక్ అవుతుందని చెబుతున్నారు. ఉదయం ఒక పార్టీ నాయకుడితో కాపురం, మధ్యాహ్నం మరో పార్టీ నాయకుడితో సంసారం, సాయంత్రం కొత్త నాయకుడితో ఐటమ్ సాంగ్ , మిడ్ నైట్ మసాల, ఇలా రోజుకోక పార్టీలతో సంసారం చేస్తే.. తెలంగాణ ఎలా వస్తుందని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. చివరకు చికెన్ నారాయణ కూడా కేసిఆర్ ను చీ కోడుతున్నారని ఆపార్టీ క్యాడర్ బాధపడుతుంది. ఏవరైన ధైర్యం చేసి ఏంటీ సార్ అని అడిగితే.. ఏంధిరాభాయ్ నీ లొల్లి, గాళ్ల సంగతి నేను చూసుకుంటా, మీరు చప్పుడు చేయుకురి అని అడిగిన వారికి క్లాస్ పీకుతారు. కాంగ్రెస్, టిడిపి పార్టీలనుండి వెళ్లిన నాయకులకు పిచ్చిపడుతుందని చెబుతున్నారు.
తెలంగాణకు అనుకూలంగా చెప్పిన టీడీపీ నాయకుడు చంద్రబాబు పై పిచ్చి విమర్శలు చేస్తాడు. బూతులు తిడతారు. తెలంగాణ ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ అని తెలిసినా కూడా ఆపార్టీ పై ఒక్క విమర్శ కూడా చెయ్యాడు మన కేసిఆర్. తెలంగాణ కోసం ఉద్యమం చేసిన విద్యార్థులు, ఉద్యోగులపై కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు పెట్టి, నానా ఇబ్బందులు పెడుతుంటే..కేసిఆర్ మౌనంగా ఫాంహౌస్ లో ఆవు పాలు ఎలా పితకాలి అని ఆలోచనలు చేస్తున్నాడని విద్యార్ధులు, ఉద్యోగులు అంటున్నారు. ఉద్యమం చెయ్యాండి మీ వెనక నేనుంటానని చెప్పి, కొన్ని ఉద్యోగ సంఘాలను కూడా మోసం చేసినట్లు సమాచారం. తెలంగాణ పై తుది నిర్ణయం వచ్చే సమయంలో కేసిఆర్ ప్రవర్తనతో క్యాడర్ పూర్తిగా దెబ్బతింటుందని .. ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. 53 రోజుల పాటు నిరంతరంగా సాగిన సకల జనుల సమ్మె పై .. ఢిల్లీ నుండి కేసిఆర్ .. నీళ్లు చల్లి .. సమ్మె మంటలను ఆర్పివేసినట్లు ఆపార్టీలోని సీనియర్ నాయకులు చెప్పుకుంటున్నారు. కేసిఆర్ పరిస్థితి చూసిన ఆ పార్టీ నాయకులకు అనేక అనుమానాలు కలుగుతున్నాయి. 2014లో టీఆర్ఎస్ పార్టీ ఉంటుందా? లేక కాంగ్రెస్ పార్టీలో కలిసిపోతుందాఅనే అనుమానంతో.. నాయకులు నలిగిపోతున్నారట. తెలంగాణలో జరిగిన సహకార ఎన్నికల్లో టీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలుసుకోలేకపోయింది. ఎమ్మెల్సీ ఎన్నికలకు మాత్రం బీజేపితో కలిసి పోటీ చెయటానికి సిద్దమైనట్లు తెలుస్తోంది.
కేసిఆర్ తీరుపై ఆయన కుటుంబ సభ్యులు తీవ్రంగా మండిపడ్డారు. కేసిఆర్ అన్నరంగరావు కూతురు రేగులపాటి రమ్య ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే. ఉద్యమం కోసం కేసిఆర్ ఎలాంటి చర్యలు తీసుకోకుండా.. ఆయనలో బిపి పెరిగిన ప్రతిసారి రాజకీయ ప్రత్యర్థులపై బండ బూతులు తిట్టి, కలుగులోకి వెళ్లటం ఆయనకు బాగా అలవాటైందని ఆపార్టీ సీనియర్ నాయకులు అంటున్నారు. కేసిఆర్ చేసే తిక్కపనులతో .. తమ పరువు పోతుందని ఆపార్టీ నాయకులే అనుకుంటున్నారు. 2014 ఎన్నికల్లో తెలంగాణ సమస్య, కేసిఆర్ బతుకు బయటపడుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కేసిఆర్ ఇప్పటికైన ఆ కలుగు నుండి బయటకు వచ్చి, తెలంగాణ సమస్య పై ఒక నిర్ణయం తీసుకోవాలని టీఆరఎస్ క్యాడర్, తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. తెలంగాణ పై కీలక దశలో ఉన్నప్పుడు ఇలా కలుగులో ఉండటం ఏం బాగాలేదని ఆయన అభిమానులు అంటున్నారు. తెలంగాణ పై కీలక నిర్ణయాలు తీసుకోవాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more