అక్రమాస్తుల కేసులో అరెస్టై జైల్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల తన తండ్రి దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాష్ట్రంలో ప్రజా ప్రస్థానం పాదయాత్ర చేసిన విషయం తెలిసిందే. ఆయన చేసిన పాదయాత్రతో ..రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది. అయితే ఇప్పుడు వైఎస్ షర్మిల కూడా మరో ప్రజా ప్రస్థానం పేరుతో రాష్ట్రంలో పాదయాత్ర చేస్తుంది. ఇప్పటికి ఆమె 1000 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తి చేసినట్లు మీడియా వర్గాలు చెబుతున్నాయి. షర్మిల పాదయాత్ర వలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపడుతుందా? అనే దానిపై రాజకీయ విశ్లేషకులు సర్వే చేసినట్లు తెలుస్తోంది. షర్మిల పాదయాత్ర వలన పార్టీకి పెద్దగా బలం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. జగనన్నా వదిలిన బాణాన్ని అని ప్రజల ముందుకు వెళ్లిన షర్మిలకు అన్ని విమర్శలే ఎదురవుతున్నాయి. రీసెంట్ గా షర్మిల కాలు ఆపరేషన్ కోసం మూడు వారాలు పాదయత్ర నిలిపివేసిన ఆమె పై అనేక విమర్శలు వచ్చాయి. అసలు కాలు ఆపరేషన్ జరగలేదని, అంతా షర్మిల నాటకంతో నటించారని టీడీపీ నాయకులు విమర్శలు చేయటంతో.. ప్రజల్లో ఉన్న కాస్త నమ్మకం కూడా గాలిలో కలిసిపోయిందని రాజకీయ పండితులు అంటున్నారు. షర్మిల పాదయాత్రతో ఆమె భర్త బ్రదర్ అనిల్ చేసిన అవినీతి బయటకు రావటంతో.. ప్రజలు పాదయాత్ర వైపు రావటంలేదని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. అలాగే షర్మిల ప్రసంగాలు కూడా ప్రజలను ఆకట్టుకోలేకపోతున్నాయాని ఆ పార్టీ సీనియర్ నాయకులు చెబుతున్నారు. అంతేకాకుండా.. వైఎస్ కుటుంబం ఆర్థికంగా ఉన్నది కాబట్టి, షర్మిల పాదయాత్రలో కేవలం 500 వందల మంది కార్యకర్తలతో పాదయాత్ర చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ ఐదువందల మందికి ప్రతి రోజు అన్నీ సౌకర్యాలు కల్పించటం వలన వారు షర్మిల పాదయాత్రలో సొంత మనుషుళ్ల కనిపిస్తున్నారు. అంతేతప్ప ప్రజలు పెద్దగా షర్మిల పాదయాత్రలో కనిపించటం లేదని రాజకీయ నాయకులు అంటున్నారు. అంతేకాకుండా.. షర్మిల పాదయాత్రను కేవలం ఒక్క సాక్షి మీడియానే కవర్ చేస్తుంది. మిగత ఏ టీవీ ఛానల్స్ లోను పాదయాత్ర గురించి రావటం లేదని ఆ పార్టీ నాయకులే అంటున్నారు. షర్మిల పాదయాత్ర తో 2014లో 200 శాసనసభ సీట్లు గెలుచుకుంటుందా? అనే సందేహం వ్యక్తం అవుతుంది.
అయితే అది చాలా కష్టమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఆ పార్టీ నాయకుల్లో కొత్త భయం పట్టుకున్నట్లు తెలుస్తోంది. అసలు ఈ పార్టీ 2014 వరకు ఉంచుతారా? లేక పిఆర్పీ మాదిరే కాంగ్రెస్ లో కలిసిపోతారా అనే అనుమానాలు పార్టీ నాయకుల మద్య బలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పెద్దలతో సీక్రెట్ గా కలిసి వస్తున్నట్లు పార్టీ నాయకులు అనుకుంటున్నారు. ఆమె ఢిల్లీ పెద్దలతో కలిసి చర్చలు జరపటంతో పార్టీ నాయకులు అనుమానం పడుతున్నారట. అసలే పిఆర్పీ పార్టీ వలన దెబ్బతిన్నాం, మళ్లీ ఈ పార్టీలో చేరి మరో చేదు అనుభవం జరిగితే .. మా పరిస్థితి ఏమిటని పార్టీలోని నాయకులు మదనపడుతున్నారట. అసలు జగన్ బయటకు వస్తాడో, లేదో, ఒక వేళ బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో కలిసిపోతే .. మా పరిస్థితి ఏమిటి? అని పార్టీ నాయకులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకోని బిక్కముఖాలు పెడుతున్నట్లు పార్టీ సీనియర్ నాయకులు చెబుతున్నారు. అసలు పాదయాత్ర షర్మిల చేయకుండా.. వైఎస్ విజయమ్మ గానీ, వైఎస్ భారతి గానీ చేసినట్లైతే పార్టీకి మంచి బలం వచ్చేదని, ప్రజలు వైఎస్ కుటుంబం మీద సానుభూతి పెరిగి ఉండేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. షర్మిల పాదయాత్రతో పార్టీకి పెద్దగా లాభం లేదని, 2014 లో 200 సీట్లు గెలుచుకోవటం కష్టమని రాజకీయ మేథావులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more