తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వస్తున్నా మీకోసం అంటూ పాదయాత్ర చేస్తున్నారు. ఇప్పటకి ఆయన రెండు వేల కీలమీటర్లు దాటి పాదయాత్ర చేసినట్లు టీపీడీ నాయకులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం చంద్రబాబు గుంటూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు. గుంటూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్న చంద్రబాబు ఒక చేదు అనుభవం ఎదురైంది. గుంటూరు కలెక్టర్ ఎస్. సురేష్ కుమార్ తాఖీదులు జారీ చేశారు. రేపు సాయంత్రం 4 గంటలకు గుంటూరు జిల్లా విడిచి వెళ్ళాలని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ షాక్ తో టీడీపీ నాయకులు ఆందోళన చెందుతున్నారు. గుంటూరు జిల్లాకు చెందని వారు ఎవరూ జిల్లాలో ఉండరాదని నోటీసులు జారీ చేశారు. చంద్రబాబు ఈ నెల 6వ తేదీ నుంచి గుంటూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు. ప్రస్తుతం తెనాలి నియోజవకర్గంలో పాదయాత్ర కొనసాగుతోంది. గత ఏడాది అక్టోబర్ రెండవ తేదీ గాంధీ జయంతి నాడు అనంతపురం నుంచి ప్రారంభమైన యాత్ర స్వల్ప విరామాలు మినహాయించి ఎక్కడా ఆటంకం లేకుండా కోనసాగుతోంది. మహబూబ్ నగర్ లో స్టేజీ కూలి కాలికి గాయమైనప్పుడు, గుంటూరు సంఘటనలో మళ్లీ కాలికి గాయమైనప్పుడు పాదయాత్రకు ఉన్న చోటు నుంచే తాత్కాలిక విరామం ప్రకటించి తిరిగి పాదయాత్రను కొనసాగించారు.
అయితే ఇప్పుడు జిల్లా వదిలి వెళ్లమంటే తమ లక్ష్యానికి విరుద్దమని తెలుగుదేశం పార్టీ నేతలు అంటున్నారు. అసలు గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్ . సురేష్ కుమార్ చంద్రబాబును గుంటూరు జిల్లా వదిలి ఎందుకు వెళ్లమన్నారు అంటే. రిఫర్ 1, మెమోనెం. 258/ ఎలక్షన్ . బి/ఎ2/2012-12, తేది 29-01-2013 ఆఫ్ జిఎ(ఎల్ ఇసియస్. బి) డిపోర్టుమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, 2. ఆర్ సి నెం. 172/13/సి1, తేదీ 14-02-2012 నోటీలను జిల్లా కలెక్టర్ , ఎన్నికల రిటర్నింగ్ అధికారి జారీ చేయటం జరిగింది. జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఈ నిర్ణయం తీసుకోవటం జరిగినట్లు తెలుస్తోంది. ఎన్నికల నిబంధనలు అమల్లో ఉన్నందున 19వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 21వ తేదీ సాయంత్రం 4 గంటల వరకకు పాదయాత్ర నిలుపుదల చేస్తున్నామని తెలిపారు. ఒక రకంగా చెప్పాలంటే .. చంద్రబాబుకు గుంటూరు కలెక్టర్ ఎస్ సురేష్ కుమార్ వార్నింగ్ ఇచ్చినట్లుగా ఉందని కాంగ్రెస్ నాయకులు, వైఎసఆర్ పార్టీ నాయకులు చెవులు కోర్కుకుంటున్నారు. టీడీపీ నాయకులు మాత్రం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more