తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు ఇంటి పోరు మొదలైంది. కేసిఆర్ అందరి విషయంలో ఎంతో తెలివిగా వ్యవహరించి నిర్ణయాలు తీసుకోవటం జరుగుతుంది. కానీ ఇప్పుడు పదవుల కోసం సొంత ఇంటిలోనే యుద్దం మొదలైంది. అసలే తెలంగాణ సమస్య పై పోరు చేస్తున్న కేసిఆర్ కు ఇంటి పోరు పెద్ద తలనొప్పిగా మారిందని టీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. పెరటి మొక్క వైద్యనాకి పనికిరాదు అనే విధంగా, సొంత వారిపై కేసిఆర్ ప్రవర్తిన తీరు పై వారు మండిపడుతున్నారు. కేసిఆర్ కొడుకు, కూతురు, మేనల్లుడు విషయంలో శ్రద్ద తీసుకున్న ఆయన మా పై సవితి ప్రేమ చూపిస్తున్నారని ఆయన కుటుంబ సభ్యులు అంటున్నారు. అసలు ఇంటిలో గొడవ ఏమిటి? కేసిఆర్ పై కుటుంబ సభ్యులు ఎందుకు మండిపడుతున్నారు? అనే విషయాలు ప్రతి తెలంగాణ బిడ్డకు వస్తాయి. కానీ అసలు విషయం ఏమిటంటే.. పదవులన్నీ ఆయన కుటుంబానికే ఇస్తూ, ఇటీవల పదవీ విరమణ చేసి టీఆర్ఎస్ లోకి చేరిన స్వామి గౌడ్ కు పదవి ఇవ్వటం పై ఆయన కుటుంబ సభ్యులు తీవ్రంగా మండిపడుతున్నారు. కేసిఆర్ అన్న కల్వకుంట్ల రంగారావు కుమార్తె రేగులపాటి రమ్య , భర్త రేగులపాటి మధుసూదన్ రావు లు కేసిఆర్ పై యుద్దం ప్రకటించారు. ఎప్పటి నుంచి పార్టీకి అన్ని విధాల వీరు కష్టపడుతున్నారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి పదవులు గానీ, పార్టీ టిక్కెట్ గానీ ఇవ్వలేదని వారు అంటున్నారు. ముందొచ్చిన చెవులు కన్న వెనకొచ్చిన కొమ్ములకు వాడి ఎక్కువుగా ఉంటుందనే విధంగా ప్రవర్తించారు .
ఎప్పటినుంచో పార్టీలో ఉంటున్న మమ్మల్ని కాదని ఇటీవల వచ్చిన స్వామి గౌడ్ కు ఎలా పదవి ఇస్తారని వారు కేసిఆర్ ను ప్రశిస్తున్నారు. అసలు స్థానికేతరుడైన స్వామిగౌడ్ కు టికెట్ ఎలా ఇస్తారని కేసిఆర్ ను నిలదీశారు. కేసిఆర్, స్వామిగౌడ్ ఇద్దరు కలిసి సకల జనుల సమ్మెను తాకట్టు పెట్టారని రేగులపాటి రమ్య ఆరోపించారు. కేసిఆర్ ఉద్యమం పేరుతో పబ్బం గడుపుకుంటున్నారని కేసిఆర్ అన్న కూతురు తీవ్రంగా మండిపడ్డారు. హౌసింగ్ కుంభకోణం, అవినీతి అక్రమాలకు పాల్పడిన స్వామి గౌడ్ కు ఎమ్మెల్సీ టికెట్ ఎలా ఇచ్చారో కేసిఆర్ సమధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. అయితే స్వామి గౌడ్ ను గెలిపించుకునేందుకు ఉద్యోగ సంఘాలన్నింటిని ఏకం చేసి, చివరకు బీజేపితో సైతం అంగీకరింపజేసిన కేసిఆర్ ఇప్పుడు ఈ స్థానిక వివాదంలో ఇరుక్కోవటంతో ఎన్నిక ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి స్వామిగౌడ్ స్ధానికుడు కాదంటూ కరీంనగర్ కు చెందిన 15 మంది స్వతంత్ర అభ్యర్థులు వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఇంత చేస్తునప్పటికీ స్వామి గౌడ్ స్థానికేతర గొడవ ఇప్పటికే ఉంటే సోదరుడి కుమార్తె రమ్య ఇప్పుడు గౌడ్ అవినీతిపై గళమెత్తడంతో కేసిఆర్ కు కొత్త తలనొప్పి మొదలైందని టీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. కేసిఆర్ ఇంటి పోరు నుండి ఎలా బయటపడతారో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more