భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి ఎన్.వి.ఎస్. ప్రభాకర్ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి అల్లుడు బ్రదర్ అనిల్ పై విమర్శల వర్షం కురించాడు. ఇంత వరకు భారతీయ జనతా పార్టీకి చెందిన నేతలు వైయస్ కుటుంబం పైనా, జగన్ పైనా తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన సందర్భాలు లేవు. కానీ ప్రభాకర్ మాత్రం బ్రదర్ అనిల్ ని ఏకిపారేశాడు. ఆయన నాంపల్లి పార్టీ కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడిన ఆయన వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో అక్రమంగా వందల కోట్ల విలువైన భూములను సంపాదించిన వైఎస్ జగన్, షర్మిల, బ్రదర్ అనిల్పై సీబీఐ న్యాయ విచారణ జరపాలని, రక్షణ టివీ పేరుతో ఉన్న మత ప్రచార చానెల్ బ్రదర్ అనిల్ దేనని ఆయన అరోపించారు.బినామీ పేరుతో ఆయన నడుపుతున్నారని తెలిపారు.షర్మిల రెండువేల నాలుగులో ఇచ్చిన ఆస్తి వివరాల ప్రకారం రెండు కోట్ల లోపే ఉందని, ఆ తర్వాత వందల కోట్లు పెరిగాయని ఆయన ఆరోపించారు.
అంతే కాకుండా మరో అడుగు ముందుకువేసి, మత పరంగా కూడా విమర్శలు చేశాడు. అనిల్ తో షర్మిల కు పెళ్లి చేసేముందు అనిల్ మతం మార్పించారని, మతం మార్చిన తరువాతనే షర్మిళను ఇచ్చి పెళ్లి చేశారని ఆయన అన్నారు. మానవత్వమే మతంగా చెప్పుకుంటున్న వైయస్ కుటుంబం, ఇదేనా మానవత్వమని ఆయన ప్రశ్నించారు. వైఎస్ఆర్ పాలన అంతా అవినీతికి మారుపేరుగా నిలిచిం దని, వైఎస్ హయాంలో జరిగిన భూముల కబ్జాలకు అడ్డుకట్టవేసేందుకు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వీరిద్దరి అక్రమాస్తుల పై నిగ్గుతేల్చే వరకు రాజకీయ పోరాటం చేస్తామని ప్రభాకర్ అన్నారు. మరి ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న ఈయన ఇప్పుడు వీరిద్దరిని టార్గెట్ చేయడం వెనుక ఆంతర్యం ఏమిటో అని రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు. మొత్తం మీద షర్మిల పాదయాత్ర తిరిగి ప్రారంభించిన తర్వాత వారిపై వ్యక్తిగత దాడి ప్రారంభం అయిందని చెప్పవచ్చు.
మరో వైపు టీడీపీ కూడా వైయస్ కుటుంబం పై, బ్రదర్ అనిల్ అగస్థా కుంభకోణంలో హస్తం ఉందని ఆరోపించింది. అగస్టా హెలికాప్ట్టర్ల కుంభకోణం మూలాలు హైదరాబాద్లోనే ఉన్నాయని, అది వైయస్ కుటుంబంలోనే ఉన్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించగా, టీడీపీ ఎంపీలు అయిన నామా నాగేశ్వర రావు, దేవేందర్గౌడ్, నిమ్మల కిష్టప్ప, కొనకళ్ల నారాయణ, సీఎం రమేష్, రమేష్రాథోడ్, శివప్రసాద్ లు కూడా ఆరోపించారు. దీనిపై స్పష్టమైన ఆధారాలు సేకరించామని, వాటితో సీబీఐని సంప్రదించబోతున్నట్లు వారు తెలిపారు. అగస్టా కుంభకోణంలో ఇటలీ లింకులన్నీ బయటకు రావాల్సి ఉందని, దీనిపై తాము పార్లమెంట్ ఉభయ సభల్లో గళం విప్పుతామని చెప్పారు. ఇవన్నీ ఆరోపణలు విన్న జనాలు బ్రదర్ అనిల్ మామూలోడు కాదని అనుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more