రాష్ట్ర పోలీస్ శాఖ ప్రతిష్టకు ఉన్నతాధికారులు శక్తివంచన లేకుండా శ్రమిస్తున్న తరుణంలో ఆశాఖలోని కొందరు కిందిస్థాయి సిబ్బంది చేసే పాడు పనులతో పోలీస్ శాఖ పరువు మొత్తం పోతుందని కొంత మంది సీనియర్ పోలీస్ అధికారులు అంటున్నారు. న్యాయం కోసం వచ్చిన మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ పోలీసు ఖ్యాతిని బజారు పాలు చేస్తున్నారు. రీసెంట్ రాష్ట్రంలో చోటు చేసుకున్న సంఘటనలు పరిశీలిస్తే పోలీస్ శాఖ పరువు కాస్త నడి వీధిలో దీపం మాదిరి మారిపోయింది. ప్రజలతో సత్సంబంధాలు కలిగి వారితో స్నేహపూర్వకంగా ఉంటేనే నేరాలు నియంత్రణ సాధ్యమని పోలీసు ఉన్నతాధికారులు నిత్యం వల్లిస్తున్న విషయం తెలిసిందే. అయితే కొంత మంది ఉన్నతాధికారుల ఆదేశాలు, సూచనలు భేఖారుచూస్తూ కొందరు కింది స్థాయి సిబ్బంది న్యాయం కోసం వచ్చిన వారితో శారీరక సంబందాలు పెట్టుకొని పోలీసు శాఖ పరువును మంటగలుపుతున్నారు. తాజాగా హైదరాబాద్ నగరంలోని కేపిహెచ్ బి పోలీస్ స్టేషన్లో పనిచేసిన సుదీర్ అనే ఎస్సై ఉదందం తెలిసిందే. రెండుళ్లుగా ఓ వివాహిత మహిళలను మానసికంగా వేధింపులకు గురిచేసినట్లు సదరు బాధిత మహిళ పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించింది. ఈక్రమంలో పోలీసు ఉన్నతాధికారులు సైతం ఈకేసుపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపడుతున్నారు. ఈ సంఘటన మరవకముందే మరో ఎస్ఐ ప్రదీప్ ప్రేమించి మోసం చేశాడన్న విషయం వెలుగులోకి వచ్చింది. అయితే వారిద్దరి ఏకాభిప్రాయానికి వచ్చి వివాహానికి సిద్దమైనట్లు సమాచారం. గతంలో గుంటూరు లో జరిగిన సంఘటన రాష్ట్రం మొత్తం ఉడికిపోయింది. యువ ఎస్ఐ, రజియా అనే కాలేజీ విద్యార్థిని వేధించి సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. ఇకపోతే చిత్తూరు జిల్లా ఓ మైనర్ బాలికపై పోలీస్ అత్యాచారానికి పాల్పాడినట్లు వార్తలు వచ్చాయి. హైదరాబాద్ లో ఓ బాధ్యత గల సిఐ ఇంటర్ మీడియట్ చదివే విద్యార్థినికి తరచు వేధిస్తూ సస్పెండ్ అయ్యాడు. మహబూబ్ నగర్ లో తన భర్త నుండి కాపాడండి అని పోలీస్ స్టేషన్ వచ్చిన సుజాత అనే వివాహితని నీకు న్యాయం చేస్తే నాకేంటి లాభమని సభ్యసమాజం తలదించుకునేలా అసభ్యపదజాలం ఉపయోగించిన నవ్వులుపాలైన పోలీస్ అధికారి.
గతంలో ఓ పోలీస్ కూకట్ పల్లి లో ఓ యువతిని గర్బవతిని చేసి ఆపై తనకేం తెలియదని బుకాయించి పట్టుబడిన విషయం పాఠకులకు తెలిసిందే. ఇటీవల కాలంలో ఓ గన్ మెన్ ఓ వివాహిత స్నానం చేస్తుండగా తన సెల్ నుంచి చిత్రీకరించి పట్టుబడ్డాడు. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పోలీసులు అఘాయిత్యానికి, బెదిరింపులకు, దౌర్జన్యానికి అనేక మంది మహిళలు బలైనదాఖలాలున్నాయి. పోలీసు ఉన్నతాధికారులు చర్చలు తీసుకుంటున్నప్పటికి పోలీసు శాఖలో కామాంధుల దుశ్చర్యలు ఏమాత్రం ఆగడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి అంతేకాకుండా పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న మహిళా పోలీసులు సైతం వేధింపులకు గురవుతున్నట్లు సమాచారం. పలు సార్లు బాధిత మహిళా పోలీసులు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినా ఫలితం అంతంతమాత్రమేన్నది సమాచారం. పోలీస్ ప్రతిష్టకు భంగం కల్గించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు ఘోషిస్తుస్తూనే ఉన్నాయి. కాపాడాల్సిన వారే కామంతో రెచ్చిపోతే ఎలా అంటూ ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్న పోలీసు శాఖ ఉన్నతాధికారులు అంటీముట్టనట్లు వ్యవహరిస్తుండటం విచారకరం, ఏదిఏమైనా పవిత్రమైన పోలీస్ వ్రుత్తి లో ఉంటూ ఆశాఖను అపవిత్రం చేసే పోలీసులపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం, అవశ్యకత ఎంతైనా ఉందని తేల్చిచెప్పవచ్చు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more