దర్శకరత్న దాసరి మళ్లీ తన గళం వినిపించారు. ‘లవ్ టచ్’ సినిమా ఆడియో ఫంక్షన్ కార్యక్రమంలో దాసరి నారాయణ రావు సినీ రంగంలో ప్రస్తుతం జరుగుతున్న మార్పులపై ఆయన మండిపడ్డారు. ఇప్పుడు కనుకు నేను సినీ పరిశ్రలోకి వచ్చి ఉంటే జీవితంలో డైరెక్టర్ ని అయ్యే వాన్ని కాదని దాసరి మీడియా సమక్షంలో చెప్పినట్లు తెలుస్తోంది. తెలుగు సినీరంగంలో ఎందరికో గురువుగా పేరుపొందిన దాసరి నారాయణ రావు టాలీవుడ్ రంగంలో ప్రస్తుతం నెలకొన్ని పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆడియో ఫంక్షన్ కు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహకు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. స్టేజీ మీద వెళ్లిన దాసరికి మైకు కనిపించగానే దాసరి లో ఉన్న మరో అపరిచితుడు పైకి లేచి ఆ రెండు కుటుంబాలపై విశ్వరూపం చూపించారు. ఈ రోజుల్లో సినిమాల తీయడం మాటలు కాదు. ఒక్క సినిమాకి 50-60 కోట్లు ఖర్చు పెడుతున్నారు. పెద్ద సినిమా తప్ప చిన్న సినిమాలకు ఛాన్స్ లేదని ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా చిన్న సినిమాలకు థియేటర్లు దొరకవు. ఇప్పటి పరిస్థితులు చూస్తే కొత్త హీరోలు , ఆర్టిస్టులు రాగలరా? అని ప్రశ్నించారు. అంతేకాకుండా ఈ కుటుంబం నుండి , ఆ కుటుంబం నుండి హీరోలు పుట్టుకొస్తున్నారు. కొత్త వాళ్లకి ఎక్కడ ఛాన్స్ ఉండటం లేదని దాసరి ఆవేశంగా ఆ రెండు కుటుంబల పై విమర్శలు దాడి చేయటం జరిగింది. సినిమా అవకాశాలన్నీ ఆ రెండు కుటుంబల వారికే వెళ్లిపోతున్నాయి. వారికి పేరు బలం ఉంది, డబ్బు బలం ఉంది, ఈ రెండు సినిమాకి పనికోస్తుంది.
అంతేగానీ వారిలో నిజంగా టాలెంట్ ఉందా? అని దాసరి ప్రశ్నించారు. టాలెంట్ లేకుండా హీరోలైన వారు చాలామంది సినీ రంగంలో ఉన్నారు. వారికి పేరు వచ్చిన తరువాత టాలెంట్ మీద ద్రుష్టి పెట్టి పైకి వస్తారని ఆయన అన్నారు. అసలు అలాంటి వారు హీరోలే కాదని దాసరి అన్నట్లు మీడియా వర్గాలు అంటున్నాయి. తెలంగాణ నుంచి కొంతమందైనా హీరోలు కచ్చితంగా రావాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వైపు చూస్తూ అన్నట్లు తెలుస్తోంది. అంటే ఉప ముఖ్యమంత్రిని హీరోగా రమ్మని దాసరి ఉద్దేశం కాదు. కానీ దాసరి చూపులు మాత్రం అలాగే ఉన్నట్లు సినీ ప్రముఖులు అంటున్నారు. ఇప్పటికే తెలంగాణ నుండి నితిన్ హీరోగా ఉన్నారని గుర్తుచేశారు. గతంలో తెలంగాణ నుండి కొంత మంది హీరోలు వెండి తెరపై వెలిగినవారేనని ఆయన గుర్తు చేశారు. అలాంటి వారిలో ఆర్. నాగేశ్వర్ రావు, కాంతారావు, ప్రభాకర్ రెడ్డి, త్యాగరాజు వంటి ఆణిముత్యాలు తెలంగాణ నుంచి రావటం జరిగింది. అయితే దాసరి మళ్లీ ఆ రెండు కుటుంబాలపై ఎందుకు విమర్శలు చేసినట్లు ఆడియో ఫంక్షన్ కు వచ్చిన వారికి ఎవ్వరికి అర్థం కాలేదట. ఈయన మాత్రం ఎంత మంది హీరోల జీవితం ఆటలాడుకున్న సందర్భాలు చాలా ఉన్నాయని ఆడియో ఫంక్షన్ లోని సినీ ప్రముఖులు చెవులు కోర్కుకున్నట్లు సమాచారం. ఏమైన దాసరి ఈ వయసులో ఇలాంటి విమర్శలు చేయకపోవటమే మంచిదని సినీ మేథావులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more