తెలంగాణ సమస్యపై ఢిల్లీలో చక్రం తిప్పింది ఎవరు? తెలంగాణ సమస్య పై ఆజాద్ చేసిన వ్యాఖ్యల వెనుక ఉన్న వ్యక్తి ఎవరు అనేది ఎవరు అనేది తెలంగాణ నాయకులు చెబుతున్నారు. ఆజాద్ ప్రకటన వెనుక రాష్ట్ర గవర్నర్ నరసింహన్ రాసిన లేఖలు ఉన్నాయని టీ కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తెలంగాణ వెనక్కిపోవడానికి ప్రధాన కారణం రాష్ట్ర గవర్నర్ నరసింహన్ నివేదికనే అని టికాంగ్రెస్ మండిపడుతోంది. ఎంపి మధుయాష్కిగౌడ్ కూడా ఆయనపై నేరుగా మండిపడ్డారు. ఆయనతో పాటు ఇతర టి కాంగ్రెస్ నేతలు కూడా ఆయన తీరుపై మండి పడుతున్నారు. వచ్చేస్తుందని భావించిన తెలంగాణ ఆగటానికి కారణం గవర్నర్ ఇచ్చిన రహస్య నివేదికమేనని ఈ నేతలుపేర్కొంటున్నారు. అలాంటి సంకేతాలే తమకు ఢిల్లీనుంచి అం దాయని వారు చెబుతున్నారు. ఈ పరిస్థితులపై చర్చించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకొనేందుకు ఈ నేతలు సమాలోచనలు చేస్తున్నారు. ఎంపీ మందా జగన్నాథం నివాసంలో టి కాంగ్రెస్ ఎంపీలు ప్రత్యేక సమావేశం అవుతున్నట్లు తెలిసింది. ఈ సమావే శంలో భవిష్యత్ కార్యాచర ణపై ఓస్పష్టతకు రావాలని వారు భావిస్తు న్నట్లు తెలుస్తోంది. మరో వైపు తెలంగాణను అడ్డుకోవడంలో సిఎం పాత్ర కూడా ఉందని ఎంపీ జి.వివేక్ మండిపడుతున్నారు. రాష్ట్రంలోని పరిస్థితులను వివరిస్తూ గవర్నర్ నరసింహన్ కేంద్రానికి అందజేసిన నివేదికల తోపాటు తెలంగాణపై కూడా రహస్య నివేదికను అందజేశారని టి కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు పేర్కొంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే రాష్ట్రంలో శాంతిభద్రతలు దెబ్బతింటాయని, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా ఆయన నివేదిక ఇచ్చారని ఈ నేతలు భావిస్తున్నారు.
సోనియాగాంధీ తోనూ, ఏఐసిసి పెద్దలతో, కేంద్ర హోంశాఖతో పలుమార్లు గవర్నర్ నరసింహన్ కలవడంపై వారు ఈఅనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తొలినుంచి ప్రత్యేక తెలంగాణకు వ్యతిరేకంగానే గవర్నర్ వ్యవహరిస్తున్నారని టి కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు పేర్కొంటు న్నారు. తెలంగాణ ఇచ్చేస్తామని సానుకూల ప్రకటన చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్కుమార్సిండే ప్రకటనకు భిన్నంగా కేంద్రంలో పరిస్థితులు ప్రస్తుతం చోటుచేసుకొన్నాయని వారు పేర్కొంటున్నారు. తెలంగాణపై ఇచ్చేం దుకు సిద్దమైన కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఒక్కసారిగా వెనక్కితగ్గడానికి కార ణం గవర్నర్ నరసింహన్ నివేదికనే కారణమని పేర్కొంటున్నారు. గవర్నర్ నివేదికను సాకుగా చూపుతూ సీమాంధ్ర నేతలు చేసిన లాబీయింగ్ ఫలించిందని టి కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలకు సంబంధించిన వాస్తవాలతో కూడిన నివేదికను గవర్నర్ ఇస్తే బాగుంటుందని చెప్పారు. గవర్నర్ రహస్య నివేదికతోనే కేంద్రం తెలంగాణ విషయంలో వెనకడుగువేసిందని ఎంపీ మధుయాష్కిగౌడ్ అన్నారు. అవినీతి పరుడైనా కెవిపి కూడా తెలంగాణపై సానుకూల ప్రకటన రాకుండా అడ్డుకున్నారని ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణ కోసం కొత్త కార్యచరణ చేయటానికి టీ కాంగ్రెస్ నాయకులు సమావేశం అవుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more