ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అనుకోకుండా ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ అధిష్టానం ద్రుష్టిలో, మైనార్టీల మనస్సులలో రియల్ హీరోనా ? పదవి చేపట్టినప్పటి నుండి తన మంత్రి వర్గం నుండి, ప్రతిషక్షాల నుండి తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటున్న కిరణ్ కుమార్ రెడ్డి తీసుకున్న కొన్ని కఠినమైన నిర్ణయాల వల్ల ఆయన రియల్ హీరో అయ్యాడా ? అంటే అవుననే అంటున్నారు కొందరు. ఓ వైపు వైయస్ ముద్రను తొలగిస్తూ, కొత్తగా కాంగ్రెస్ పథకాలను తనదైన శైలిలో పథకాలకు మెరుగులు దిద్దుతు న్న కిరణ్, జైపూర్ చింతన్ శిబిర్లో నాయకత్వం నుంచి ఊహిం చని విధంగా ప్రశంసలు పొందారు. ఇక ఇప్పటి వరకు ఏ సీఎం కూడా మజ్లిస్ పార్టీని ఢీ కొనలేదు. కానీ అందరి ముఖ్యమంత్రులకు భిన్నంగా ఎంఐఎం అగ్ర నేతలు అయిన అసద్, అక్బరుద్దీన్ ఒవైసీలను అరెస్టు చేయించడంతో మెజారిటీ ప్రజల దృష్టిలో కిరణ్ హీరోగా నిలిచినట్టయింది. ఒకరకంగా ఈ విషయంలో కిరణ్ తన ప్రత్యర్థులపై ఓడిపోయారన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్న తరుణంలో, రాష్ట్ర చరిత్రలో మజ్లిస్పై ఉక్కుపాదం మోపిన ఏకైక ముఖ్యమంత్రిగా కిరణ్ పేరు సాధించారు. బాబు, వైఎస్ వంటి మహామహులే మజ్లిస్ జోలికి వెళ్లేందుకు సాహసించలేకపోయారు. బాబు కొద్దిమేరకు వారిని ఎదుర్కొనేందుకు ప్రయత్నించారు. శాంతిభద్రతల కోణంలో బాబు తీసుకున్న నిర్ణయాలు వారిని కొద్దమేరకు కట్టడి చేశాయి. కార్పొరేషన్ ఎన్నికల్లో మాత్రం మజ్లిస్ను కట్టడి చేశారు. ఫలితంగా తొలిసారి హైదరాబాద్లో టీడీపీ విజయం సాథించింది. అయితే కిరణ్ స్థాయిలో మాత్రం ఎవరూ సాహోపేతమైన నిర్ణయాలు తీసుకోలేకపోయారు. వైఎస్ అయితే మజ్లిస్కు బ్రహ్మరథం పట్టారు. మజ్లిస్కు సాగిలబడినంత పనిచేశారు. ఆ పార్టీ నేతలు అడిగిన కోర్కెలతో పాటు, అడగని కోర్కెలు కూడా తీర్చారు. కాంగ్రెస్ మంత్రులకంటే మజ్లిస్ నాయకులకే పెద్దపీట వేశారు. పాతబస్తీలో వారి సిఫారసులకే పెద్దపీట వేశారు. హైదరాబాద్ కలెక్టర్, పోలీసు కమిషనర్ల వంటి ఉన్నత పదవులను కూడా వారు సూచించిన వారినే నియమించారు. ఆ స్థాయిలో మజ్లిస్ పార్టీ వైఎస్ హయాంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని శాసించింది.
కిరణ్తో వైరం పెట్టుకుని, కిరణ్ను గద్దె దింపమే తన లక్ష్యమని, ఇకపై తనకు జగన్ కొత్త స్నేహితుడని అసద్ ఎప్పుడయితే ప్రకటించారో, అప్పటినుంచే మజ్లిస్ పతనం మొదలయినట్లు జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. మజ్లిస్ నేతలపై ఉన్న పాత కేసులన్నీ తిరగదోడారు. చివరకు ఎప్పుడో పెండింగ్లో ఉన్న సంగారెడ్డి కేసును కూడా దుమ్ముదులిపి, అసదుద్దీన్ ఒవైసీని జైలుపాలు చేయించి అందరినీ విస్మయపరిచారు. అక్బరుద్దీన్ ఒవైసీ ఇంకా జైలులోనే ఉన్నారు. కొత్తగా ఆ పార్టీ ఎమ్మెల్యే పాషా ఖాద్రీపై కేసు నమోదయింది. ఆయననూ నేడో, రేపో అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం చిత్తశుద్ధి ప్రదర్శించాలే గానీ ఏదైనా చేయగలుతుందన్న సంకేతాలు పంపించారు. ధైర్యం, తెగింపు, మొండితనం ఉంటే మజ్లిస్ను అణచివేయటం పెద్ద సమస్య కాదని కిరణ్ తన కార్యాచరణ ద్వారా రుజువుచేశారన్న కితాబు వినిపిస్తోంది. ఈ పరిణామాలను విశ్లేషిస్తున్న రాజకీయ విశ్లేషకులు కిరణ్ 2014 వరకు ముఖ్యమంత్రిగా కొనసాగుతాడనంలో ఎటువంటి సందేహం లేదని బల్లగుద్ది చెబుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more