గత కొన్ని రోజుల నుండి తెలంగాణ పై అధిష్టానం సానుకూల నిర్ణయం తీసుకోబోతుందన్న సమాచారం అందుకొని ఢిల్లీకి క్యూ కట్టిన సీమాంధ్ర నేతలు కాంగ్రెస్ పెద్దలను కలిసి రాష్ట్రాన్ని విభజించవద్దని వేడుకోవడానికి వెళ్లిన వారికి ఛేదు అనుభవమే ఎదురైందా ? నిన్నగాక మొన్న మంత్రి టీజీ వెంకటేష్ తెలంగాణ వచ్చేస్తుందని అసహనంగా ముఖం పెట్టి స్టేట్ మెంట్ ఇవ్వడం వెనుక ఏదో ఉన్నదనే అంతా అనుకున్నారు. అంతా అనుకున్నట్లే ఢిల్లీలో ముఖ్యనేతలను కలిసిన సీమాంధ్ర నేతలకు కాంగ్రెస్ పెద్దలు పంచ్ లు ఇచ్చినట్లు సమాచారం. టీజీ వెంకటేష్, ఏరాసు ప్రతాప్రెడ్డి, కాసు కష్ణారెడ్డి, పినిపె విశ్వరూప్లు ఢిల్లీలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి గులాంనబీ ఆజాద్, ప్రత్యేక పరిశీలకుడు వాయలార్ రవిలను కలిసి సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశంలో వాయలార్ రవి సీమాంధ్ర నేతలకు గట్టిగానే చివాట్లు పెట్టాడట.
తెలంగాణ అంశంపై మేము ఒక నిర్ణయం తీసుకోబోతున్న తరుణంలో గళం విప్పడం ఏమిటని, సీమాంధ్రలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ ప్రాబల్యం ఉందని, తెలంగాణలో సెంటిమెంట్ ఉందని, రాష్ట్ర విభజన జరగకుండా సమైక్యంగా ఉంచితే మీరెన్ని సీట్లు గెలుస్తారని ప్రశ్నించారట. దానికి రాష్ట్ర విభజన జరిగితే ఆ మరుక్షణం ప్రభుత్వం కూలిపోతుందని ఏరాసు, టిజి చెప్పారట. ఆ విషయం తమకు తెలుసునని, రాష్ట్ర ప్రభుత్వం కూలిపోతుందని తమకూ సమాచారం ఉందని, చాలామంది జగన్ వెంట వెళ్లిపోతారన్న సమాచారం ఉందని, మీరంతా వెళ్లిపోతే వెళ్లండని, మేం కొత్త టీమ్ను రెడీ చేసుకుంటామని, మీరెన్ని సీట్లు ఇస్తారో చెప్పడం లేదని, తెలంగాణ ఇస్తే అక్కడ పదహారు ఎంపీ స్థానాలు వస్తాయని, ఆంధ్రప్రదేశ్లో గెలిచిన స్థానాల వల్లే కేంద్రంలో యుపిఏ ప్రభుత్వం ఉందని, అసలు, మీరెప్పుడైనా ఉద్యమాలు చేశారా అని ఘాటుగా ప్రశ్నించారట. దీంతో మంత్రులు చేసేదేమి లేక వెనుదిరిగినట్టు సమాచారం. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఏరాసు, టిజి వెంకటేష్లు ఆ తర్వాత గులాం నబీ ఆజాద్తో అన్నారట. అందుకు ఆజాద్ వారిపట్ల కొంత కూల్గా సమాధానం చెప్పారట. ఇప్పుడు పరిస్థితులు ఆ విధంగా లేవని, 2009 డిసెంబర్ 9 నాటి ప్రకటన తప్పేనని, ఆ ప్రకటన రాకుండా చూడాల్సిందని, ఇప్పుడు కూడా నెల రోజుల్లో తెలంగాణపై తేలుస్తామని చెప్పడం సరి కాదన్నారట.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more