P chidambaram fires on pakistan government

p chidambaram, finance minister p chidambaram, pakistan government, pakistan army, indian army, war, indian jawans, indian jawans killed, two indian soldiers

p chidambaram fires on pakistan government

p chidambaram.gif

Posted: 01/11/2013 11:22 AM IST
P chidambaram fires on pakistan government

p chidambaram fires on pakistan government

పాక్ కవ్వింపు చర్యలకు, బరితెగింపు పనులకు  మనం గుణపాఠం చెప్పాలని , భారత సైన్యం  అవకాశం కోసం ఎదురుచూస్తుంది.  అయితే  మన దేశ  రాజకీయ నాయకులు అనుమతి కోసం  భారత సైన్యం  ఎదురుచూస్తుంది.   మన దేశ నాయకులు అనుమతి  ఇస్తే .. అరగంటలో  పాకిస్తాన్ శవాల దిబ్బగా మార్చుతామని  భారత సైనికలు  అంటున్నారు.  అయితే  వాస్తవాధీన రేఖ దాటి వచ్చి ఇద్దరు భారత సైనికులను అమానుషంగా హతమార్చిన పాకిస్తాన్ సైన్యానికి గుణపాఠం చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని యూపీఏ సంకీర్ణ సర్కారు భావిస్తోంది. ప్రధాని మన్మోహన్ సింగ్ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ భద్రతా వ్యవహారాల కమిటీ భేటీలో దీనిపై తీవ్ర చర్చ జరిగినట్టు సమాచారం. వాస్తవాధీన రేఖ దాటి కృష్ణా ఘాటీలోకి చొరబడి గస్తీలోవున్న ఇద్దరు భారత సైనికుల తలలు నరికి, మరో ఇద్దర్ని తీవ్రంగా గాయపర్చిన ఘటనపై లోతుగా చర్చించారు. సైన్యంలోని కమాండో దళాల చేత పాక్ ఈ దాడులు చేయిస్తోందని యూపీఏ సర్కారు నిర్దారణకు వచ్చింది. ఇద్దరు సైనికులు లాన్స్‌నాయక్ సుధాకర్ సింగ్, లాన్స్‌నాయక్ హేమరాజ్ తలలు నరికి, ఒక సైనికుడి తలను పాక్ సైనికులు తమవెంట తీసుకుపోవటాన్ని భద్రతా వ్యవహారాల కమిటీ తీవ్రంగా పరిఘణిస్తోంది. ‘రేఖ’ వద్ద పాక్ సైనికుల అమానుష చర్యలను కేబినెట్ భద్రతా వ్యవహారాల ఉప సంఘానికి రక్షణ మంత్రి ఏకె ఆంటోని వివరించటంతోపాటు, సైన్యం తరఫున ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందనేది ప్రతిపాదించినట్టు చెబుతున్నారు.

p chidambaram fires on pakistan government

పాక్ మరోసారి ఇలాంటి దారుణానికి ఒడిగట్టకుండా చేసేందుకు చర్య అత్యంత తీవ్రంగా ఉండాలనీ, అవసరమైతే వాస్తవాధీన రేఖ వద్ద ఉన్న రెండు మూడు పోస్టులపై కమాండో దాడులు చేయాలని సైన్యం ప్రతిపాస్తున్నట్టు సమాచారం. రెండు దేశాల మధ్య శాంతిని నెలకొల్పేందుకు ఇదివరకే ప్రారంభించిన కృషిని కొనసాగిస్తూనే, పాక్‌కు గట్టిగా బుద్ధి చెప్పాలని ప్రభుత్వం యోచిస్తోందని అంటున్నారు. పాకిస్తాన్‌లో మరోసారి ప్రజాస్వామ్య ప్రభుత్వంపై సైనిక దళాల ఆధిపత్యం పెరుగుతోందని, ఇది ముందు ముందు మరింత పెరుగుతుందని కేంద్రం అంచనా వేస్తోంది. రెండు దేశాల మధ్య శాంతి నెలకొనటం పాక్ సైనిక దళాలకు ఎంతమాత్రం ఇష్టం లేదనేది అందరికీ తెలిసిందే. వాస్తవాధీన రేఖ సమీపంలో జరిగిన ఘటనపై ఐక్యరాజ్య సమితి పర్యవేక్షకుల చేత దర్యాప్తు జరిపించాలంటూ పాక్ పాలకులు చేసిన ప్రతిపాదనను తిరస్కరిస్తున్నట్టు ఆర్థిక మంత్రి పి చిదంబరం తెలిపారు. చిదంబరం మంత్రివర్గ భద్రతా వ్యవహారాల ఉపసంఘం భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ పాక్ ప్రతిపాదనను అంగీకరించే ప్రసక్తి లేదన్నారు. కాశ్మీర్ సమస్యను అంతర్జాతీయ వేదికపైకి తీసుకెళ్లేందుకు చేస్తున్న ప్రయత్నాలను విజయవంతం కానివ్వకూడదని కేంద్రం నిర్ణయించుకున్నది. అందుకే ఇద్దరు సైనికులపై జరిగిన దాడిపై యుఎన్ విచారణకు అంగీకరించటం సాధ్యం కాదని చిదంబరం స్పష్టం చేశారు. కాశ్మీర్ లోయలో జరిగిన సంఘటనతో తమ సైనికులకు ఎలాంటి సంబంధం లేదని పాక్ సైన్యం బుకాయిస్తోంది. భారతదేశం తమపై నిరాధార ఆరోపణలు చేస్తోందంటూ నిజానిజాలను నిగ్గుతేల్చేందుకు ఐక్యరాజ్య సమితి పర్యవేక్షకుల చేత దర్యాప్తు జరిపించాలని పాక్ ప్రతిపాదించింది. ప్రతిపాదనను నేరుగా తిరస్కరిస్తున్నట్టు చిదంబరం ప్రకటించారు. కాశ్మీర్ లోయలో భారత సైనికులను దారుణంగా హతమార్చటంపై తాము చేయాల్సింది చేస్తామని చిదంబరం ప్రకటించారు. అయితే ఏం చేస్తారనేది వెల్లడించేందుకు నిరాకరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sonia gandhi held meeting in war room on telangana
Pcc chief botsa satyanarayana  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more