రాష్ట్రంలో పెరిగిన విద్యుత్ ఛార్జీలపై వామపక్షలు ఆందోళన చేపట్టాయి. కొన్ని రాజకీయ పార్టీల కూడా కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తిపోస్తున్నాయి. సొంత పార్టీ నాయకులు కూడా ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో పీసీస అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అందరికి సమాధానం చెబుతున్నారు. రాష్ట్రం లో పేద, మధ్యతరగతి ప్రజలకు ఇబ్బంది లేకుండా, రైతులు నష్టపోకుండా చూడడమే తమ ప్రభుత్వ ధ్యేయమని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. రూ. 26 వేల కోట్లతో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం తమదని, సామాన్యులకు నష్టం కలిగేలా తమ ప్రభుత్వం ఎప్పుడూ వ్యవహరించదని ఆయన చెప్పారు. గాంధీభవన్లో సత్తిబాబు మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్షాలు మోసపూరితంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వం విద్యుత్ చార్జీలు విపరీతంగా పెంచుతోందని ప్రచారం చేస్తున్నాయి. అవన్నీ అవాస్తవాలని, ప్రజలు నమ్మవద్దని కోరారు. ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదారి పట్టించే ప్రచారాలు చేయవద్దని, సమస్య పరిష్కారానికి తగు సూచనలు చేయాలని బొత్స సూచించారు.
2009 ఎన్నికల మేనిఫెస్టోలో విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పలేదని, 2004లో మాత్రమే ఛార్జీలు పెంచమని చెప్పామని బొత్స అన్నారు. రాష్ట్రంలో 63 లక్షల యూనిట్ల విద్యుత్ కొరత ఉందని బొత్స తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేకుండా సరిపడా విద్యుత్ కొనుగోలుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అన్నారు. వాతావరణం అనుకూలించక రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం తలెత్తిందని, వీటిని అధిగమించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని బొత్స చెప్పారు. డిస్కంల ముందు కాంగ్రెస్ తన వైఖరి వెల్లడిస్తుందన్నారు. విపక్షాలు దీనిపై రాద్దాంతం చేయటం తగదని ఆయన హితవు పలికారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more