Chandrababu naidu comments on cm kiran

chandrababu naidu, chandrababu naidu comments on cm kiran, kiran kumar reddy, electricity, chandra babu padayatra, warangal district, formers, power cut, power charges, andhra pradesh people,

Chandrababu Naidu comments on CM Kiran

Chandrababu Naidu.gif

Posted: 01/07/2013 05:33 PM IST
Chandrababu naidu comments on cm kiran

Chandrababu Naidu comments on CM Kiran

కాంగ్రెస్ పార్టీ తీసుకునే నిర్ణయం పై ఆ పార్టీ భవిష్యత్తు ఉంటుందని రాష్ట్ర ప్రజలు అంటున్నారు.  ఇప్పుటికి కరెంట్ చర్చీలు అనేక సార్లు పెంచిన ప్రభుత్వం మరోసారి  కరెంట్  షాక్ తో రాష్ట్ర ప్రజలకు  ఉగాది పండుగ చేసుకోమంటుంది.  దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు  వెల్లువెత్తున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి  కిరణ్ కుమార్ రెడ్డి సరైన నిర్ణయాలు తీసుకోవటం లేదని  టీడీపీ అధినేత చంద్రబాబు నాయకుడు మండిపడ్డారు.  రాష్ట్ర ప్రజల  పై   కరెంట్ ఛార్జీలు  అధనంగా  వేయాలని  చూస్తున్నాడని  ఆయన అన్నారు.  రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విద్యుత్ రంగాన్ని నిర్వీర్యం చేస్తోందని చంద్రబాబునాయుడు ఆరోపించారు. వస్తున్నా...మీకోసం కార్యక్రమంలో భాగంగా 94వ రోజు పాదయాత్రను నరసింహులపేట మండలం కొమ్ములవంచ నుంచి ప్రారంభించారు. అక్కడి రైతులను బాబు పరామర్శించారు. అనంతరం ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ టీడీపీ హయాంలో సంస్కరణలు తీసుకుని వచ్చి మిగులు కరెంట్ కల్గిస్తే , కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు విద్యుత్ వ్యవస్థను నాశనం చేశాయని విమర్శించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యుత్ చార్జీలు పెంచిన ఘనత ఈ సర్కారుకే దక్కుతుందని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ధరల పెరుగుదలకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని, ధరలు పెంచడంతో ప్రజలు కష్టాల పాలయ్యారన్నారు. ప్రజల కష్టాన్ని, చెమటను దోచుకుంటూ ప్రభుత్వం పందికొక్కులా పెరిగిందని బాబు మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వస్తే ప్రజలందిరికీ మంచి నీటిని అందిస్తామన్నారు. వృద్ధులకు, వితంతువులకు రూ.600 పింఛను ఇస్తామని, పేదవారందరికీ లక్ష రూపాయలు ఖర్చు పెట్టి సొంత ఇల్లు కట్టిస్తామని బాబు హామీ ఇచ్చారు. అయితే  సీఎం  రైతులకు ఉచిత విద్యుత్ కొనసాగిస్తాం అని అంటున్నారు. విద్యుత్ ఛార్జీల పెంపుపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, పార్టీల నుంచి సర్వత్రా నిరసనలు వ్యక్తమవడంతో ఛార్జీల పెంపుపై ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఇకపై కూడా రైతులకు ఉచిత విద్యుత్ కొనసాగిస్తామని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. గృహ వినియోగదారులపై కరెంట్ ఛార్జీల పెంపు ప్రతిపాదనేదిలేదని వెల్లడించారు. అయితే ఇంధన సర్దుబాటు పూర్తిస్థాయిలో ఉండకపోవచ్చని పేర్కొన్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Swami vivekananda suffered from 31 ailments
Crux of telangana issue is hyderabad  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more