ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కేంద్రంలో కదలికలు వచ్చాయి. ఈ కదలికలో తెలంగాణ ప్రాంత నాయకులు కొత్త ఉత్సహం నింపింది. తెలంగాణ సమస్యకు పెద్ద తలనొప్పిన మారిన హైదరాబాద్ నగరం. హైదరాబాద్ చుట్టే తిరుగుతున్న కేంద్రం నాయకుల ఆలోచనలు ..? తెలంగాణ వివాద పరిష్కారం మళ్లీ హైదరాబాద్ చుట్టూనే తిరుగుతోంది. రాష్ట్ర రాజధానిని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించటం లేదా నగర శాంతి భద్రతలు, సాధారణ పరిపాలనను కేంద్రం పరిధిలోకి తెచ్చేందుకు ఇరుపక్షాలు అంగీకరిస్తే ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు యూపీఏ సర్కారు సిద్ధమేనని అంటున్నారు. ఈ అంశమే ప్రధానంగా కేంద్ర హోం మంత్రి సుశీల్కుమార్ షిండే ఇరు ప్రాంతాల నేతలతో అంతర్గత మంతనాలు సాగిస్తున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ విషయంలో ఇరుపక్షాలకు ఆమోదయోగ్యమైన అవగాహన కుదరకపోవటం వల్లే తెలంగాణ వివాదంపై తుది నిర్ణయానికి రాలేకపోతున్నట్టు ఏఐసిసికి చెందిన సీనియర్ నాయకుడు ఒకరు స్పష్టం చేశారు. ఇటీవల రాష్ట్రానికి చెందిన ఎనిమిది గుర్తింపు పొందిన పార్టీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించిన సుశీల్కుమార్ షిండే తెలంగాణ వివాదంపై నెల రోజుల్లో నిర్ణయం వెల్లడిస్తామని చెప్పటం తెలిసిందే. తెలంగాణ వివాదాన్ని పరిష్కరించేందుకు కేంద్రం ప్రధానంగా రెండు ప్రతిపాదనలను పరిశీలిస్తోందన్న వార్తలు రావటం తెలిసిందే. తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి మండలి ఏర్పాటు చేసి ఆర్థిక ప్యాకేజీ ప్రకటించటం లేదా రాష్ట్ర విభజన చేపట్టటం అనేవి రెండు ప్రధాన ప్రతిపాదనలు. ఆర్థిక, రాజకీయ ప్యాకేజీతో కూడిన ప్రాంతీయాభివృద్ధి మండలి ఏర్పాటు ప్రతిపాదనకు తెలంగాణ నేతలు ససేమిరా అంటున్నారు.
మండలి ఏర్పాటు సాధ్యం కాని పక్షంలో హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించి రాష్ట్ర విభజన జరపాలని యూపీఏ సంకీర్ణ సర్కారు యోచిస్తోందని అంటున్నారు. అయితే హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించి రాష్ట్ర విభజన చేపట్టేందుకూ తెలంగాణ నేతలు అంగీకరించటం లేదు. కనీసం శాంతి భద్రతలు, సాధారణ పరిపాలననైనా కేంద్రం ఆధీనంలో ఆదీనంలో ఉండేందుకు అంగీకరించాలని సంకీర్ణ సర్కారు సూచించినట్టు తెలిసింది. ఈ ప్రతిపాదనపై తెలంగాణ, సీమాంధ్రకు చెందిన కొందరు నేతలతో అంతర్గతంగా జరుపుతున్న చర్చలు ఫలిస్తే జయపూర్ మేధోమథన సదస్సు తరువాత తెలంగాణపై నిర్ణయం ప్రకటించవచ్చని అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more