2012 సంవత్సరం అన్ని అంత విషాదంగానే ముగిసిన విషయం తెలిసిందే. అయితే కొత్త సంవత్సరం, కొత్త పండుగ, కొత్త ఆశయాలు, అంత కొత్తగా ఉంటుందని 2013 కొత్త సంవత్సరానికి స్వాగతం పలికిన మొదటి రోజే కొన్ని విషాద సంఘటనలు జరిగాయి. కొత్త సంవత్సరం రాకతో కొన్ని కుటుంబాలలో విషాదచాయలు అలుముకున్నాయి. కానీ పాత సీసాలో కొత్త సారా మాదిరి, ధ్యానం పత్రిజీ బాబా వ్యవహరం కొత్త సంవత్సరం మొదటి రోజే ప్రజలకు తెలిసింది. ధ్యానం పేరుతో పత్రిజీ చేస్తున్నా అసంఘీక కార్యక్రమాలను ఒక మీడియా వారు బయట పెట్టారు. జనవరి మొదటి రోజు మొత్తం పత్రీజీ బాబా అమ్మాయిలపై ఆయన చేసిన ద్యానం గురించే మీడియాలో ప్రచురితమైయ్యాయి. 70 ఏళ్ల వయసు ఉన్న ఈయన అసలు పేరు సుభాష్ ప్రతీజీ. ఈయన ధ్యానం పేరుతో అమ్మాయిలతో చేసే కార్యక్రమాలను ప్రజలకు కళ్లకుకట్టినట్లు మీడియా వారు చూపించారు. అయితే పత్రిజీ పిరిమిడ్ ధ్యానం అంటూ ప్రజలను మోసం చేస్తున్నాడని మీడియా వారు అంటున్నారు. ధ్యానం చేయటానికి ఆగ, మగ అని తేడలేకుండా అందరు వస్తారు. కానీ పత్రిజీ దర్శనం మాత్రం ఆడవాళ్లకే, అదీ కూడా 18 సంవత్సరాల అమ్మాయిల నుండి 35 సంవత్సరాల ఆంటీల వరకు మాత్రం పత్రిజీ ప్రత్యేక దర్శనం కలుగుతుంది. మగవారు అంటే ఆయనకు అసలుపడదు. ఒకనొక సమయంలో కొంత మంది మగవారిని కొట్టిన సందర్భాలు ఉన్నాయాని ఆయన భక్తులు చెబుతున్నారు. పత్రిజీ దగ్గరకు వచ్చే ప్రతి అమ్మాయి , మహిళ, ఆయన కౌగిలింలో బంధికావాల్సిందే. ఆయన చెంప్పలపై, లేదా ఆయన పెదాలపై ముద్దు వర్షం కురిపించాల్సిందే. ఇలా చేయటం కూడా అందరి ముందే జరిగిపోతాయని ఆయన భక్తులు చెబుతున్నారు. అందమైన అమ్మాయి పత్రిజీ కౌగిలించుకున్నప్పుడు అక్కడు భక్తులు చప్పట్లతో ఆనందం వ్యక్తం చేస్తారని, కొంత మంది భక్తులు అంటున్నారు.
ఈ ముసలోడు పెట్టే ముద్దులకు చదువుకున్న అమ్మాయిలుకూడా ఎగబడిపోతున్నారు. ద్యానం పేరుతో అమ్మాయిలో తన్మయానందం పొందుతున్న ధ్యానం స్వామి గురించి నిన్నటి రోజు వెలుగులోకి వచ్చింది. ముసలోడి కౌగిలిలో నలిగిపోయిన అమ్మాయిలో ఎంతో మంది మీడియా వారికి ఫోన్ చేసి వారి బాధను చెప్పుకోవటం జరిగింది. ఆయనది తాత వయసు, వాళ్లది ఆయన కూతుళ్ల , మనవరాళ్ల వయసు, కానీ ఆయన చేష్టలు మాత్రం ఆ వయసుకు తగినట్టుగా ఉండవు. ఈయన బాటలో ఆయన శిష్యులు కూడా ఇలాంటి వెకిలిచేష్టలు చేస్తారని భక్తులు అంటున్నారు. ఇప్పుడు రాష్ట్రమంతా ఈ విషయం వివాదాస్పదంగా మారింది. కొంత మంది భక్తులు మండిపడుతున్నారు. మరికొంత మంది ఈ పత్రిజీ ని సమర్థిస్తున్నారు. అయితే దీనిపై చర్చవేధికలు మీడియా వారు జరిపారు, ఈ కార్యక్రమంలో , ప్రముఖ డాక్టర్ సమరం, ఇంక కొంత మంది మేథావులు పాల్గొన్నారు. అయితే పిరమిడ్ ధ్యానం అనేది ఒక పచ్చి మోసం. పిరమిడ్ లో ధ్యానం చేస్తే అన్ని రోగాలు మాయమవుతాయని చెప్పటం చాలా దారుణం అని అన్నారు. పిరమిడ్ ధ్యానం వలన అన్ని రోగాలు నయం అవుతాయంటే , ఇక ఆసుపత్రులు ఎందుకు? డాక్టర్లు ఎందుకు, ఈ సైన్స్ ఎందుకు అని డాక్టర్లు అంటున్నారు. ఈ విషయం పై జనవిజ్నన వేదిక సభ్యులు కూడా స్పందించటం జరిగింది. అయితే పిరమిడ్ ధ్యానం సొసైటీ అధ్యకుడు ఈ విషయాన్ని తీవ్రంగా ఖండించారు. ఇది కేవలం మీడియా వారు కావాలని స్రుష్టించి వివాదంగా ఆయన అంటున్నారు. పత్రీజీ ఇప్పటి నుండి ఇలాంటి ధ్యానం చేయటం లేదు కొన్ని సంవత్సరాల నుండి చేస్తున్నారు. పిరమిడ్ ధ్యానం వలన అన్ని రోగాలు తగ్గుతున్నాయి కాబట్టే ప్రజలు లక్షల సంఖ్యలో వస్తున్నారని ఆయన అన్నారు. ఇది కేవలం మీడియా డబ్బులు కోసమే ఇలా చేస్తున్నారని ఆయన అన్నారు. అయితే పత్రిజీ అమ్మాయిలతో ఎలాంటి అసభ్యకరమైన పనులు చేయటం లేదని ఆయన గట్టిగా వినిపించారు. పిరమిడ్ ధ్యానం కేంద్రాలు దేశవ్యాప్తంగా ఉన్నాయని ఆయన అన్నారు. అంతేకాకుండా పిరమిడ్ ధ్యాన సభలకు తమిళనాడు గవర్నర్ రోశయ్య, కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి, రాష్ట్ర మంత్రి సుదర్శన్ రెడ్డి తదితర రాజకీయ నాయకులు హజరై పత్రిజీ పై ప్రశంసలు కురిపించారని పిరమిడ్ ద్యాన సొసైటీ సభ్యులు చెబుతున్నారు. అయితే ఇందులో ఏది నిజమో, ఏదీ కల్పితమో , ప్రజలే తెలుసుకోవాలి.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more