ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ పై ఎలాంటి అభిప్రాయం తో ఉన్నారు. అఖిలపక్షం ఏర్పాటు నేపథ్యంలో కాంగ్రెస్ వైఖరి కూడా చెప్పాల్సిన సమయం రావడంతో కిరణ్ కుమార్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా ఏం చెబుతారు ? ఆయన మనస్సులోని మాట ఏంటి ? ఢిల్లీ వెళ్లిన ఆయన కాంగ్రెస్ పెద్దలతో ఏం చెప్పాడు ? విశ్వసనీయ సమాచారం ప్రకారం... ఏఐసీసీ వ్యవహారాల ఇన్చార్జి గులాం నబీ ఆజాద్, కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేతో మంతనాలు జరిపి హైదరాబాద్ బయలుదేరి విమానాశ్రయానికిచేరుకున్న సమయంలో పార్టీ అధినేత్రి సోనియా పిలుపు మేరకు మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆమెతో పావుగంట సేపు మంతనాలు జరిపారు. ఈ అతి స్వల్ప సమయంలోనే కిరణ్ తెలంగాణ విషయంలో తన అభిప్రాయాన్ని పూస గుచ్చినట్టు అధినేత్రికి వార్తలు. పెద్దలతో చర్చల సందర్భంలో కిరణ్ తన అభిప్రాయంగా రెండో ఎస్.ఆర్.సి.ప్రతిపాదన తెరపైకి తెచ్చారని ప్రచారం జరుగుతోంది.
రెండువేల ఒకటి లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ రెండో ఎస్.ఆర్.సి.ఏర్పాటుకు అనుకూలంగా తీర్మానం చేసిందని, ఆ తర్వాత దానిని మార్చుకోలేదని కిరణ్ గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితులలో రెండో ఎస్.ఆర్.సి.ని కాంగ్రెస్ తన విదానంగా ప్రకటిస్తే సిపిఐ, టిఆర్ఎస్ తప్ప మిగిలిన పక్షాలు కాంగ్రెస్ ను వ్యతిరేకించవచ్చని,ఆ తర్వాత పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవచ్చని కిరణ్ తన అభిప్రాయం చెప్పినట్లు సమాచారం. రెండో ఎస్సార్సీ ఏర్పాటు వల్ల తెలంగాణ వాదానికి వచ్చే ముప్పు ఏమీ లేదని, అందువల్ల ఆ ప్రాంత నేతలు ఇబ్బంది పడాల్సిన అవసరమేమీ ఉండదని కూడా కిరణ్ వాదించినట్టు చెబుతున్నారు. కిరణ్ వాదనను బట్టి చూస్తుంటే తన నిర్ణయాన్ని కేంద్రం పైకి నెట్టి వేసినట్లు కనబడుతుంది. ఈ ఎస్సార్సీ ఏర్పాటు అంశం తెర పైకి తేవడం వలన ఇప్పుడున్న పరిస్థితులు కాస్త చల్లారి, 2014 ఎన్నికలు కూడా సాఫీగా గడిచిపోతాయనే ఆలోచించి కిరణ్ ఈ నిర్ణయాన్ని వెల్లడించారని అంటున్నారు. మరి దీని పై కేంద్రం ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more