కోటీశ్వరులకు సబ్సిడీ అవసరమా? ఒక మంత్రి ప్రశ్నించటం చాలా విశేషంగా ఉంది. అసలు సబ్సిడీ అంటే ఏమిటి? సబ్సిడీ ఎవరికిస్తారు? సబ్సిడీ ఎందుకు ఇస్తారు? అనే ప్రశ్నలక అందరికి తెలియకపోవచ్చు కానీ, కోటీశ్వరులకు బాగా తెలుసని ఆ మంత్రిగా అంటున్నారు. ప్రభుత్వం మాత్రం సబ్సిడీ ఇవ్వటం జరుగుతుంది. ఏ ప్రైవేటు బ్యాంకులు, సంస్థలుగానీ ఎలాంటి సబ్సిడీ ఇవ్వటం జరగదు. ప్రభుత్వం పేదవారికి ఉపయోగపడే విధంగా సబ్సిడీ ఇవ్వటం మనకు తెలిసిన కథ. కానీ ఇప్పుడు అది కేవలం కోటీశ్వరులకు చెందుతుందని మన మంత్రి అంటున్నారు. ప్రభుత్వం నుండి పేదవాడికి ఏదైన వస్తువు గానీ, మీని సంస్థగానీ, స్వయం ఉపాది పొందే వారికి, అసలు రేటులో నుండి కొంత రాయితీని తగ్గించి వారి ఎదుగుదలకు తోడ్పడుతుంది. అలా చేయటం వలన దేశంలో పేదవారికి సంఖ్య తగ్గుతుందని ప్రభుత్వం ఆలోచన. ఈ రాయితీ వలన పేదవాడికి కొంత భారం తగ్గించాలనే ప్రభుత్వం ఆలోచన. అయితే రాయితీ ( సబ్సిడీ) ఇప్పుడు దేశంలోని కోటీశ్వరులకు చెందుతుందని మన రాష్ట్ర మాథ్యమిక శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అంటున్నారు. పేదవాడికి అందించే సబ్సిడీలను పొందేందుకు కొంతమంది కోటీశ్వరులు పోటీ పడ్డం విడ్డూరంగా ఉందని, వారికి అసలు సబ్సిడీలు అవసరమా? అని ఆయన అన్నారు. సహకార సంఘాల ఎన్నికలను పురస్కరించుకుని మంత్రి పార్థసారథి స్థానిక జిల్లా పరిషత్ అతిధి గ్రుహంలో సమావేశమైయ్యరు. అయితే సహకార సంఘాల ఎన్నికలకు సంబంధించిన ప్రణాళికను వివరించేందుకు కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్క పేదవాడికి అందించడమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమన్నారు. నీలం తుపాన్ తో నష్టపోయిన రైతాంగాన్ని అదుకునేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపించి పంచాయితీ రాజ్ కు రూ. 22 కోట్లు , అర్ అండ్ బి శాఖ కు రూ. 19 కోట్లు ఇరిగేషన్ శాఖకు రూ. 25 కోట్లు నిధులను మంజూరు చేయడం జరిగిందన్నారు. సుమారు 50 వేల ఎకరాలు పంట నష్టం జరిగినట్లు అంచనా వేయడం జరిగిందన్నారు. నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వని నష్టపరిహారన్ని ప్రస్తుతం కిరణ్ కుమార్ రెడ్డి ఆద్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని మంత్రి పార్థసారధి అన్నారు. మంత్రిగారు కోటీశ్వరులకు రాయితీలు అవసరమా? అన్నారు గానీ, ఆ రాయితీలను కోటీశ్వరులకు చెందకుండా ప్రతి పేదవాడికి, రైతులకు అందేవిధంగా మంత్రిగారు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more